Political News

ఇంచ్ కూడా తగ్గొద్దు: చంద్రబాబు కీలక నిర్ణయం

ఏపీ ప్రతిపక్షం (ప్రధాన కాదు) వైసీపీ విషయంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మెడికల్ కాలేజీల పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ (పీపీపీ) విధానంపై ఆ పార్టీ చేస్తున్న నిరసనలు, ధర్నాలు, కోటి సంతకాల సేకరణ వంటి అంశాలపై బుధవారం రాత్రి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్షించారు.

పీపీపీ విధానంలో ఎవరు ఎలాంటి యాగీ చేసినా వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదన్నారు. అంతేకాదు, అధికార పక్షం నాయకులు, అధికారులు కూడా ప్రజలకు పీపీపీ విధానంలో జరిగే మేళ్లను వివరించాలన్నారు.

పీపీపీ విధానం రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదే కాకుండా కేంద్రం కూడా దీనికి మద్దతు ఇస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇప్పటికే బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో పీపీపీ విధానంలోనే వైద్య కళాశాలలు నిర్వహిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ విధానంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం 30:30 చొప్పున నిధులు ఇస్తాయని, వైయబిలిటీ గ్యాప్ ఫండ్‌ను కూడా కేంద్రం అందిస్తుందని తెలిపారు.

రాబోయే రోజుల్లో మరిన్ని ప్రాజెక్టులకు కూడా ఈ విధానాన్ని అమలు చేయాలని కేంద్రం నిర్ణయించిన విషయాన్ని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వైద్య కళాశాలలను పీపీపీ విధానంలోనే నిర్మించాలని నిర్ణయించినట్లు చెప్పారు.

ఈ విషయంలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎవరు ఎన్ని అడ్డంకులు ఏర్పరిచినా సహించేది లేదన్నారు.
ఇంచ్ కూడా వెనక్కి తగ్గేది లేదు. రాజీ పడేది అంతకంటే కూడా లేదు. పీపీపీ విధానంలోనే పేదలకు మేలు జరుగుతుంది. వారికి మెరుగైన వైద్య సేవలు, నాణ్యమైన విద్య కూడా అందుతాయి.

ఈ విషయంలో అధికారులు నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. ఎవరో ఏదో అన్నారని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. రాజకీయ పరమైన విషయాలను రాజకీయంగానే తాము తేల్చుకుంటామని, అధికారులు మాత్రం ప్రభుత్వ విధానాలకు కట్టుబడి పనిచేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు స్పష్టం చేశారు.

అన్నీ పీపీపీలోనే

ఏపీలో మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలోనే నిర్మించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. తొలి దశలో ఆదోని, మార్కాపురం, పులివెందుల, మదనపల్లెలోని మెడికల్ కాలేజీలను పీపీపీలో నిర్మించాలన్నారు.

ఆదోనికి ఒక సంస్థ ముందుకు వచ్చిన నేపథ్యంలో ఆ సంస్థకే బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు. మిగిలిన ఆసుపత్రుల విషయంలో కూడా అధికారులు నిర్ణయాలు తీసుకోవాలని, మరోసారి బిడ్డర్లతో చర్చలు జరపాలన్నారు. అలాగే రెండో దశకు సంబంధించిన ఆసుపత్రుల అంశాన్ని కూడా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.

This post was last modified on December 25, 2025 11:48 pm

Share
Show comments
Published by
Satya
Tags: Chandrababu

Recent Posts

పలాస దర్శకుడికి విషమ పరీక్ష

ఏడేళ్ల క్రితం వచ్చిన పలాసతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కరుణ కుమార్. తక్కువ ఖర్చులో స్టార్ క్యాస్టింగ్ లేకుండా…

1 hour ago

నిజాం గడ్డపై ‘కింగ్’ కన్ను

అక్కినేని నాగార్జున హీరోనే కాదు.. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కూడా. ఐతే ఒకప్పటితో పోలిస్తే గత కొన్నేళ్లలో ఆయన అన్నపూర్ణ సంస్థలో…

3 hours ago

మహేష్ కోసం వాయిస్ మార్చమన్న కృష్ణ

కొన్ని సినిమాలు హీరోలకు నటులుగా మంచి పేరు తెచ్చిపెడతాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోవు. మహేష్ బాబు…

9 hours ago

వైసీపీలా చెడ్డపేరు తెచ్చుకోవద్దు: పవన్ హెచ్చరిక

ఏపీలో మద్యం అమ్మకాల విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం…

10 hours ago

టాక్సిక్ ఎందుకు భయపడటం లేదు

దురంధర్ 2 ది రివెంజ్ దెబ్బకు అడివి శేష్ డెకాయిట్ వాయిదా పడింది. ఇదే రూటులో టాక్సిక్ కూడా మనసు…

10 hours ago

లడ్డూ తయారిలో 58 లక్షల లీటర్ల పామాయిల్?

సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ నివేదిక వెల్లడైన…

11 hours ago