తెలంగాణ రాజకీయాల్లో మరింత సెగ పెరుగుతోంది. ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో జంపింగ్ ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ఆత్మరక్షణలో పడేస్తున్నాయి. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున విజయం దక్కించుకున్న 10 మంది ఎమ్మెల్యేలు… తర్వాత కాలంలో బీఆర్ఎస్ను వదిలి అధికార పార్టీ కాంగ్రెస్ లో చేరిపోయారు. అయితే.. ఇది వివాదం కావడం.. న్యాయపరమైన వ్యవహారం వరకు వెళ్లడం.. తెలిసిందే.
మొత్తంగా 10 మందిలో ఐదుగురు స్పీకర్ ప్రసాదరావు చేపట్టిన విచారణకు హాజరై.. తాము బీఆర్ఎస్లోనే ఉన్నామని స్పష్టం చేశారు. మిగిలిన ఐదుగురిలో ఇద్దరు కడియం శ్రీహరి, దానం నాగేందర్లు మాత్రం అసలు విచారణకు హాజరు కాలేదు. ఇక, మిగిలిన ముగ్గురిలో తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజానికి విచారణకు వచ్చేందుకు సమయం కోరిన సంజయ్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.
బుధవారం సాయంత్రం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్.. తాను కాంగ్రెస్లోనే ఉన్నానని చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఉంటే తప్పేంటని కూడా ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు తాజాగా జగిత్యాల నుంచి బీఆర్ఎస్ టికెట్పై విజయం దక్కించుకున్న సంజయ్ కూడా ఇదే బాటలో నడిచారు. తాను కాంగ్రెస్లో ఉన్నానని గురువారం ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాదు, దీనిలో తప్పేముందని ఎదురు ప్రశ్నించారు. అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వానికి మద్దతుగా నిలిచానని.. దీనిలో ఎలాంటి తప్పులేదని వ్యాఖ్యానించారు. దీంతో బీఆర్ ఎస్ పార్టీ నాయకులు ఖంగు తిన్నారు. ఇక, ఈ వ్యవహారంపై స్పీకర్ ప్రసాదరావు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఈ నెల 29 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారం చర్చకు రానుంది.
టాలీవుడ్లో బండ్ల గణేష్ విచిత్రమైన పర్సనాలిటీ. చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే అతను.. నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్,…
బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ తీశారు. ఆస్కార్ వేదిక మీద తన బృందానికి అవార్డు వచ్చేలా చేశారు. వారణాసిని ఇంటర్నేషనల్…
టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకడు. రాజమౌళి కాకుండా ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ లేని దర్శకుడు…
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాస్త స్క్రీన్ మీద తగ్గినట్టు కనిపించినా అవకాశాలకు ఏ లోటు లేదు.…
అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు…
విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ సీఐ నాగరాజుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి.. ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే..…