తెలుగు సినిమా నటిగా ఆమని అందరికీ సుపరిచితమే. ముఖ్యంగా మిస్టర్ పెళ్ళాం చిత్రం ద్వారా గుర్తింపు పొందారు. దాదాపు అందరి హీరోల పక్కన నటించారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన మహిళ. ఆమని ఈ రోజు భారతీయ జనతా పార్టీలో చేరారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు ఆమెకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి సహా పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
పార్టీలో చేరిన అనంతరం ఆమని మీడియాతో మాట్లాడుతూ తన రాజకీయ ప్రవేశంపై స్పష్టత ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో దేశ ప్రతిష్ఠ అంతర్జాతీయ స్థాయిలో పెరిగిందన్నారు. భారతీయురాలిగా గర్వపడేలా చేసిన ఆయన అడుగుజాడల్లో నడవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
దేశం కోసం మోదీ చేస్తున్న అభివృద్ధి పనులు, సనాతన ధర్మ పరిరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. కేవలం పదవుల కోసమో, అధికారం కోసమో కాకుండా.. సామాన్య ప్రజలకు సేవ చేయాలనే ఆకాంక్షతోనే కమల దళంలో చేరాను అని ఆమె వివరించారు.
నటిగా సమాజంలోని వివిధ వర్గాలను దగ్గర నుంచి గమనించిన అనుభవం ఉన్న ఆమనికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. గతంలో పలువురు తెలుగు హీరోయిన్లు ఆయా పార్టీలలో చేరి, ఎమ్మెల్యేలు, ఎంపీలుగా కూడా గెలిచారు. ఆ జాబితాలో ఇప్పుడు ఆమని వచ్చి చేరింది. ఆమని రాకతో బీజేపీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం వస్తుందేమో వేచి చూడాలి.
This post was last modified on December 20, 2025 6:32 pm
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…