Political News

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తుంటారు. మరోవైపు ప్రజా వేదికలో జనంతో మమేకమవుతుంటారు. కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇస్తుంటారు. చివరికి మారుమూల గల్లీలో ప్రజలకు సమస్య ఏర్పడినా నేనున్నానంటూ వెంటనే స్పందిస్తున్నారు. పాలనలో మంత్రి లోకేష్ సరికొత్త పొలిటికల్ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు.

పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో ఓ గల్లీలో ప్రజలకు సమస్య వచ్చింది. తాము నివసిస్తున్న బజారు ఆరు అడుగులు మాత్రమే ఉందని, దానికి అడ్డంగా రెండు అడుగుల వెడల్పుతో కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారని స్థానికులు చెప్పారు. దాంతోపాటు పైప్‌లైన్ కూడా అడ్డుగా ఉందన్నారు. ట్రాన్స్ఫార్మర్‌ను తొలగించాలని అక్కడ ఉన్న మహిళలు రోడ్డుపైకి వచ్చి నినాదాలు చేశారు. రోడ్డు ఇరుకుగా ఉండటం వల్ల చాలామంది పడి గాయాల పాలయ్యారని తెలిపారు. ఇదే విషయాన్ని అచ్యుత అనే మహిళ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

ఇంత చిన్న సమస్యను సాధారణంగా స్థానికంగా ఉన్న కార్పొరేటర్ చూసుకుంటారు. కానీ సోషల్ మీడియాలో అక్కడి స్థానికుల ఆవేదనను చూసిన లోకేష్ వెంటనే స్పందించారు. స్థానిక ఎమ్మెల్యే, శాసనసభ విప్ జీవి ఆంజనేయులును అలర్ట్ చేశారు. వీలైనంత త్వరగా ఆ సమస్యను పరిష్కరించాలని సూచించారు.

ఇదొక్కటే కాదు.. వైద్య సహాయం కోసమో, అరబ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్నామని ఎవరైనా ట్విట్టర్‌లో ఒక పోస్ట్ చేస్తే చాలు, మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందిస్తున్నారు. లోకేష్ కార్యాలయ సిబ్బంది వెంటనే సమస్యను నమోదు చేసుకుని ఆయా సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నారు.

This post was last modified on December 19, 2025 12:12 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Lokesh

Recent Posts

ప్రసాదు ప్రీమియర్ల మీదే అందరి కన్ను

సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…

3 minutes ago

మాజీ సీబీఐ డైరెక్టర్ సతీమణి సైబర్ వలలో పడడమా…

వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…

15 minutes ago

బ్లాక్ బస్టర్ పాటలకు పెన్ను పెట్టకుండా ఎలా?

వేటూరి, సిరివెన్నెల లాంటి దిగ్గజ గేయ రచయితలు వెళ్ళిపోయాక తెలుగు సినీ పాటల స్థాయి తగ్గిపోయిందని సాహితీ అభిమానులు బాధ…

3 hours ago

పవన్… ‘ఒక్కరోజు విలేజ్’ పిలుపు ఫలించేనా?

నెల‌లో ఒక్క‌రోజు గ్రామీణ ప్రాంతాల‌కు రావాలని.. ఇక్క‌డి వారికి వైద్య సేవ‌లు అందించాల‌ని డాక్ట‌ర్ల‌కు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్…

7 hours ago

బాబీ గారు… ప్రేక్షకులు ఎప్పుడైనా రైటే

భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…

12 hours ago

‘ఇవేవీ తెలియకుండా జగన్ సీఎం ఎలా అయ్యాడో’

వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…

12 hours ago