Political News

బంగారం లాంటి ఛాన్సు మిస్ చేసుకున్న కేసీఆర్

అవకాశాలు చెప్పి రావు. అలాంటిది ఎంతో ముందుగా చెప్పి వస్తున్న వేళ.. ఆ అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాల్సిన వేళ.. అందుకు భిన్నంగా ఉండిపోవటం చూస్తే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు.. ఆయన కుమారుడు కేటీఆర్ కు ఏమైందన్న సందేహం కలుగక మానదు. దేశంలోని ఒక మహా నగరానికి 64 దేశాలకు చెందిన రాయబారులు.. హైకమిషనర్లు రావటం అంటే మాటలా? అలాంటి అరుదైన అవకాశం వచ్చినప్పుడు నగర ఇమేజ్ భారీగా పెరిగేలా ప్రచారం చేసుకోవటం.. అందులో తనకు రావాల్సిన ఇమేజ్ వాటాను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే.. అలాంటిదేమీ చేయకుండా ఉండిపోయిన తీరు చూస్తే.. పెద్దసారుకు ఏమైందన్న సందేహం కలుగక మానదు.

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు వ్యాక్సిన్ తయారు చేసే పనిలో ముందంజలో ఉన్న హైదరాబాదీ కంపెనీ భారత్ బయోటెక్ సంస్థతో పాటు.. విదేశీ సంస్థతో కలిసి కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తున్న బయోలాజికల్ -ఈ సంస్థల్ని 64 దేశాల విదేశీ రాయబారుల టీం తాజాగా నగరానికి రావటం తెలిసిందే. ఈ సందర్భంగా వారు ఈ రెండు కంపెనీలను సందర్శించారు. ఈ సందర్భంగా వారికి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ స్వాగతం పలకటం గమనార్హం.

ఈ సందర్భంగా హైదరాబాద్ మహానగర గొప్పతనం గురించి.. ప్రపంచంలోని అత్యుత్తమ కంపెనీలైన గూగుల్.. యాపిల్.. ఫేస్ బుక్.. అమెజాన్.. మైక్రోసాఫ్ట్ కంపెనీలు తమ శాఖల్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాయని చెప్పారు. ఫార్మా సెక్టార్ ను డెవలప్ చేస్తున్నామని.. నగరంలో 50 బిలియన్ డాలర్ల ఫార్మారంగం అభివృద్ది జరుగుతోందని సోమేశ్ వెల్లడించారు. దేశంలో ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్లలో 33 శాతం హైదరాబాద్ నగరంలోనే జరుగుతుందని.. పరిశ్రమల స్థాపనకు వేగంగా అనుమతులు మంజూరు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల గురించి సోమేశ్ వివరించారు.

ఈ సందర్భంగా 64 దేశాల రాయబారులు ఈ రెండు కంపెనీల్ని సందర్శించారు. వ్యాక్సిన్ వివరాల్ని సేకరించారు. ఇదంతా బాగానే ఉన్నా.. ఇంత మంది విదేశీ రాయబారులు వచ్చిన వేళ.. కేవలం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ మాత్రమే వారిని కలవటం.. రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ.. రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు అవకాశం రాకపోవటంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. కేంద్రం ఈ తరహా ప్లానింగ్ చేసిందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఒకవేళ.. రాష్ట్ర ముఖ్యమంత్రి.. మంత్రి కేటీఆర్ ఇమేజ్ పెరగకుండా మోడీషాలు ప్లాన్ చేసి ఉంటారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ.. అదే నిజమైతే.. ఇంత భారీగా వస్తున్న విదేశీ రాయబారుల వివరాల్ని అన్ని పేపర్లకు భారీ ఎత్తున ప్రకటనలతో పాటు.. హైదరాబాద్ బ్రాండ్ మరింత పెరిగేలా.. రాయబారులకు.. విదేశీ ప్రతినిధులకు స్వాగతం పలికితే బాగుండేదన్న మాట వినిపిస్తోంది. మరింత అరుదైన అవకాశాన్ని కేంద్రంతో కోట్లాడి అయిన సొంతం చేసుకోవాలే కానీ.. సీఎస్ చేతికి ఇచ్చి విడిచిపెట్టటం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది. హైదరాబాద్ మహానగరానికి ఇంతకు మించిన బంగారం లాంటి అవకాశం మళ్లీ దొరుకుతుందా? అన్నది అసలు ప్రశ్న.

This post was last modified on December 10, 2020 11:01 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బ‌డ్జెట్ స‌మావేశాల‌ కోసం అసెంబ్లీకి జ‌గ‌న్‌.. ?

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిసింది. పార్టీ వ‌ర్గాలతో చ‌ర్చ‌లు జ‌రిపిన ఆయ‌న‌..…

2 hours ago

ఫ్యాన్స్ సంతోషం సరే… ఇది తప్పు కదా?

మెగాస్టార్ చిరంజీవి ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న, ఎంతగానో కోరుకున్న సందర్భం రానే వచ్చింది. ఆయనకు మనవడు పుట్టాడు. చిరంజీవి కుటుంబంలో…

2 hours ago

దురంధ‌ర్ ఇప్పుడు… పవన్ ఎప్పుడో!

దురంధ‌ర్‌.. చాలా ఏళ్ల త‌ర్వాత భార‌తీయ సినిమాలో బాలీవుడ్ త‌లెత్తుకునేలా చేసిన సినిమా. గ‌త ఏడాది ఛావా, సైయారా సినిమాలు…

5 hours ago

స‌రిహ‌ద్దు కంచె: ఇది క‌దా `ఎన్నిక‌ల‌ రాజ‌కీయం` అంటే!

+ దేశ స‌రిహ‌ద్దులను కాపాడాల్సిన బాధ్య‌త ఎవ‌రిది? నిస్సందేహంగా కేంద్ర ప్ర‌భుత్వానిదే. + దేశ స‌రిహ‌ద్దుల నుంచి పెరుగుతున్న చొర‌బాట్ల‌ను…

7 hours ago

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

15 hours ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

15 hours ago