Political News

బంగారం లాంటి ఛాన్సు మిస్ చేసుకున్న కేసీఆర్

అవకాశాలు చెప్పి రావు. అలాంటిది ఎంతో ముందుగా చెప్పి వస్తున్న వేళ.. ఆ అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాల్సిన వేళ.. అందుకు భిన్నంగా ఉండిపోవటం చూస్తే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు.. ఆయన కుమారుడు కేటీఆర్ కు ఏమైందన్న సందేహం కలుగక మానదు. దేశంలోని ఒక మహా నగరానికి 64 దేశాలకు చెందిన రాయబారులు.. హైకమిషనర్లు రావటం అంటే మాటలా? అలాంటి అరుదైన అవకాశం వచ్చినప్పుడు నగర ఇమేజ్ భారీగా పెరిగేలా ప్రచారం చేసుకోవటం.. అందులో తనకు రావాల్సిన ఇమేజ్ వాటాను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే.. అలాంటిదేమీ చేయకుండా ఉండిపోయిన తీరు చూస్తే.. పెద్దసారుకు ఏమైందన్న సందేహం కలుగక మానదు.

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు వ్యాక్సిన్ తయారు చేసే పనిలో ముందంజలో ఉన్న హైదరాబాదీ కంపెనీ భారత్ బయోటెక్ సంస్థతో పాటు.. విదేశీ సంస్థతో కలిసి కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తున్న బయోలాజికల్ -ఈ సంస్థల్ని 64 దేశాల విదేశీ రాయబారుల టీం తాజాగా నగరానికి రావటం తెలిసిందే. ఈ సందర్భంగా వారు ఈ రెండు కంపెనీలను సందర్శించారు. ఈ సందర్భంగా వారికి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ స్వాగతం పలకటం గమనార్హం.

ఈ సందర్భంగా హైదరాబాద్ మహానగర గొప్పతనం గురించి.. ప్రపంచంలోని అత్యుత్తమ కంపెనీలైన గూగుల్.. యాపిల్.. ఫేస్ బుక్.. అమెజాన్.. మైక్రోసాఫ్ట్ కంపెనీలు తమ శాఖల్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాయని చెప్పారు. ఫార్మా సెక్టార్ ను డెవలప్ చేస్తున్నామని.. నగరంలో 50 బిలియన్ డాలర్ల ఫార్మారంగం అభివృద్ది జరుగుతోందని సోమేశ్ వెల్లడించారు. దేశంలో ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్లలో 33 శాతం హైదరాబాద్ నగరంలోనే జరుగుతుందని.. పరిశ్రమల స్థాపనకు వేగంగా అనుమతులు మంజూరు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల గురించి సోమేశ్ వివరించారు.

ఈ సందర్భంగా 64 దేశాల రాయబారులు ఈ రెండు కంపెనీల్ని సందర్శించారు. వ్యాక్సిన్ వివరాల్ని సేకరించారు. ఇదంతా బాగానే ఉన్నా.. ఇంత మంది విదేశీ రాయబారులు వచ్చిన వేళ.. కేవలం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ మాత్రమే వారిని కలవటం.. రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ.. రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు అవకాశం రాకపోవటంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. కేంద్రం ఈ తరహా ప్లానింగ్ చేసిందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఒకవేళ.. రాష్ట్ర ముఖ్యమంత్రి.. మంత్రి కేటీఆర్ ఇమేజ్ పెరగకుండా మోడీషాలు ప్లాన్ చేసి ఉంటారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ.. అదే నిజమైతే.. ఇంత భారీగా వస్తున్న విదేశీ రాయబారుల వివరాల్ని అన్ని పేపర్లకు భారీ ఎత్తున ప్రకటనలతో పాటు.. హైదరాబాద్ బ్రాండ్ మరింత పెరిగేలా.. రాయబారులకు.. విదేశీ ప్రతినిధులకు స్వాగతం పలికితే బాగుండేదన్న మాట వినిపిస్తోంది. మరింత అరుదైన అవకాశాన్ని కేంద్రంతో కోట్లాడి అయిన సొంతం చేసుకోవాలే కానీ.. సీఎస్ చేతికి ఇచ్చి విడిచిపెట్టటం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది. హైదరాబాద్ మహానగరానికి ఇంతకు మించిన బంగారం లాంటి అవకాశం మళ్లీ దొరుకుతుందా? అన్నది అసలు ప్రశ్న.

This post was last modified on December 10, 2020 11:01 am

Share

Recent Posts

ఏజెంట్‌లో నన్ను చూసి అసహ్యమేసింది – అఖిల్

అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద…

2 hours ago

దేవర కలెక్షన్లపై డిస్ట్రిబ్యూటర్ క్లారిటీ

ఒక సినిమా రిలీజైన రెండు మూడేళ్ల తర్వాత కూడా దాని కలెక్షన్ల గురించి విపరీతమైన చర్చ జరగడం అరుదు. ‘దేవర’ విషయంలో ఇదే…

6 hours ago

కొత్త విద్యా మంత్రిగా జోషి… ఎవరీయన?

కేంద్ర విద్యా శాఖకు నూతన మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు.…

9 hours ago

విజయ్ బలహీనతే కిరణ్ బలం

బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయి. ఇది అలాంటిదే. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో…

9 hours ago

‘స్పైడర్ మ్యాన్’ రచ్చ చేసేలా ఉన్నాడు

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న స్పైడర్ మ్యాన్ సిరీస్ లోని కొత్త సినిమా బ్రాండ్ న్యూ డే జూలై…

10 hours ago

జగన్ లాజిక్… ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ కి లోకేష్ కు ముడి!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ కొత్త లాజిక్ మాట్లాడుతున్నారు. నైతిక బాధ్యత వహిస్తూ…

10 hours ago