ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ అవార్డు లభించడం పట్ల ఏపీలోని టీడీపీ నాయకులు, శ్రేణులు, ప్రభుత్వ వర్గాలు, మంత్రులు.. అధికారులు సైతం ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఇక, నారా వారి కుటుంబం అయితే.. సంతోషంలో మునిగి తేలుతోంది. మంత్రి లోకేష్ నుంచి ఆయన సతీమణి, చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి, సతీమణి భువనేశ్వరి కూడా సంతోషం వ్యక్తం చేశారు.
కానీ, చంద్రబాబు మాత్రం కీలక వ్యాఖ్యలు చేశారు. సత్కారాలు, సన్మానాల కోసం తాను ఎప్పుడూ వెంపర్లాడలేదని చెప్పారు. తాను ఎప్పుడూ పనిచేసుకుని పోవడంలోనే సంతోషం, ఆనందం అనుభవిస్తానని చెప్పారు. తన పాలన పట్ల, పనితీరు పట్ల ప్రజలు వ్యక్తం చేసే సంతృప్తే.. `సత్కారం`గా భావిస్తానని చెప్పారు. గతంలోనే తన పనితీరును మెచ్చి విదేశీ యూనివర్సిటీల నుంచి దేశీయ విశ్వవిద్యాలయాల వరకు డాక్టరేట్లు ప్రదానం చేసేందుకు ముందుకు వచ్చినట్టు తొలిసారి ఆయన వెల్లడించారు.
అయితే.. తాను వాటిని సున్నితంగా తిరస్కరించానని చెప్పారు. ప్రస్తుతం ఎకనమిక్ టైమ్స్ పత్రిక ప్రకటించిన `బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్-2025` వంటి సత్కారాలను తాను ఎప్పుడూ గతంలో తీసుకోలేదన్నారు. ఈ అవార్డు ప్రకటించడం పట్ల పత్రిక యాజమాన్యానికి సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఈ అవార్డు రావడానికి అధికారులు చేసిన కృషి, మంత్రుల సహకారం.. క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి ఉన్న మద్దతే కారణమని చంద్రబాబు సవినయంగా పేర్కొన్నారు.
This post was last modified on December 18, 2025 10:35 pm
తెలుగులో ఒకప్పట్లా ఇబ్బడిముబ్బడిగా కమెడియన్లు లేరిప్పుడు. ఉన్న వాళ్లలో కూడా నిలకడగా నవ్వించేవాళ్లు తక్కువ. కొంచెం లేటుగా ఊపందుకుని.. వెన్నెల…
కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే, కేసు…
మొత్తం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో 40 ప్లస్ వయసులోనూ ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా, పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్న…
తమిళనాట కొత్త రాజకీయానికి తెర తీసిన స్టార్ హీరో దళపతి విజయ్… ప్రతి అడుగులోనూ తనదైన శైలి ప్రత్యేకతను చాటుతున్నారు.…
కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.…
పవన్ కళ్యాణ్ కెరీర్లో ఎన్నడూ లేని విధంగా ఎనిమిది నెలల వ్యవధిలో మూడు సినిమాలు రిలీజవడం ఆయన అభిమానులకు అరుదైన…