ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ అవార్డు లభించడం పట్ల ఏపీలోని టీడీపీ నాయకులు, శ్రేణులు, ప్రభుత్వ వర్గాలు, మంత్రులు.. అధికారులు సైతం ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఇక, నారా వారి కుటుంబం అయితే.. సంతోషంలో మునిగి తేలుతోంది. మంత్రి లోకేష్ నుంచి ఆయన సతీమణి, చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి, సతీమణి భువనేశ్వరి కూడా సంతోషం వ్యక్తం చేశారు.
కానీ, చంద్రబాబు మాత్రం కీలక వ్యాఖ్యలు చేశారు. సత్కారాలు, సన్మానాల కోసం తాను ఎప్పుడూ వెంపర్లాడలేదని చెప్పారు. తాను ఎప్పుడూ పనిచేసుకుని పోవడంలోనే సంతోషం, ఆనందం అనుభవిస్తానని చెప్పారు. తన పాలన పట్ల, పనితీరు పట్ల ప్రజలు వ్యక్తం చేసే సంతృప్తే.. `సత్కారం`గా భావిస్తానని చెప్పారు. గతంలోనే తన పనితీరును మెచ్చి విదేశీ యూనివర్సిటీల నుంచి దేశీయ విశ్వవిద్యాలయాల వరకు డాక్టరేట్లు ప్రదానం చేసేందుకు ముందుకు వచ్చినట్టు తొలిసారి ఆయన వెల్లడించారు.
అయితే.. తాను వాటిని సున్నితంగా తిరస్కరించానని చెప్పారు. ప్రస్తుతం ఎకనమిక్ టైమ్స్ పత్రిక ప్రకటించిన `బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్-2025` వంటి సత్కారాలను తాను ఎప్పుడూ గతంలో తీసుకోలేదన్నారు. ఈ అవార్డు ప్రకటించడం పట్ల పత్రిక యాజమాన్యానికి సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఈ అవార్డు రావడానికి అధికారులు చేసిన కృషి, మంత్రుల సహకారం.. క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి ఉన్న మద్దతే కారణమని చంద్రబాబు సవినయంగా పేర్కొన్నారు.
టాలీవుడ్ లో హీరోల సినిమాల వసూళ్ల మీద సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరగడం ఎప్పటినుంచో చూస్తున్నాం. అయితే ఇప్పుడు…
వచ్చే మూడేళ్లలో తానేంటో చూపిస్తానని.. వైసీపీని ఉద్దేశించి డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.…
ఏదైనా థియేటర్ వెళ్ళినప్పుడు సినిమా ప్రారంభానికి ముందు జనాన్ని ఇబ్బంది పెడుతున్నవి స్మోకింగ్ యాడ్సే. వాటి వెనుక మంచి ఉద్దేశం…
పదిహేనేళ్ల కుర్రాడే కదా అని స్లెడ్జింగ్ చేస్తే రిజల్ట్ ఎంత దారుణంగా ఉంటుందో శ్రీలంక బౌలర్లకు ప్రాక్టికల్ గా అర్థమైంది.…
జూన్ 21.. ప్రపంచ యోగా దినోత్సవం. భారత్ లో రూపుదిద్దుకున్న ఈ ప్రాచీన యోగా విద్యను యావత్తు ప్రపంచం ఆనుసరించడం…
2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…