ఏపీలో మెడికల్ కాలేజీల అంశంపై పెద్ద దుమారమే రేగుతోంది. కోటి సంతకాల పేరుతో రెండు నెలల పాటు వైసీపీ ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు ప్రయత్నం చేసింది. పీపీపీ విధానంలో పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తే తప్పేంటని సీఎం చంద్రబాబు ప్రశ్నిస్తుండగా, ఇది ఒక స్కామ్ అంటూ వైయస్ జగన్ ఆరోపిస్తున్నారు. పిపిపి విధానంలో మెడికల్ కాలేజీలను దక్కించుకున్న వారిని తాము అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే జైల్లో వేస్తామంటూ ఈరోజు జగన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
గవర్నర్ ను కలిసే ముందుగా ఆయన పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. ఇందులో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ స్కూళ్లు, హాస్పిటల్స్ ఎందుకు నడపాలి అని ప్రపంచం మొత్తంలో అనుకునేది చంద్రబాబు ఒక్కరే. పోలీస్ శాఖను కూడా ప్రైవేటైజ్ చేస్తానంటున్నారని ఆయన ఆరోపించారు. మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని జైల్లో వేస్తానని హెచ్చరికలు జారీ చేయడం ఏపీ అభివృద్ధిని అడ్డుకోవడమే అని తెలుగుదేశం పార్టీ అంటోంది.
చంద్రబాబు ఈ అంశంపై మాట్లాడుతూ పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల పేర్లు కూడా ‘ప్రభుత్వ కళాశాల’ అనే ఉంటాయన్నారు. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తే మీకు వచ్చే నష్టం ఏమిటని ఆయన ప్రశ్నించారు? రుషికొండకు పెట్టిన 500 కోట్లతో ఇంకో రెండు కాలేజీలు కట్టొచ్చు అన్నారు.
దీనికి జగన్ కౌంటర్ ఇచ్చారు. మేము రిషికొండలో రూ.240 కోట్లతో బ్రహ్మాండమైన బిల్డింగ్ నిర్మించాం. అది విశాఖకు తలమానికంగా ఉంది. చంద్రబాబు ఒక్క రోజు యోగాకు రూ.330 కోట్లు ఆవిరి చేసారని ఆరోపణలు గుప్పించారు.
పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై మొదటి నుంచి సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టంగా ఉన్నారు. పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపడుతున్నా… అవి ప్రభుత్వ కళాశాలల పేరుతోనే నడుస్తాయని చెబుతున్నారు. మెడికల్ కాలేజీల నిబంధనలు కూడా రాష్ట్ర ప్రభుత్వమే నిర్దేశిస్తుందన్నారు. ఇందులో 100 శాతం అవుట్ పేషెంట్ సేవలు ఉచితం. 70 శాతం మందికి ఎన్టీఆర్ వైద్య సేవలు ఆయా కళాశాలల్లో అందుతాయి, సీట్లు కూడా పెరుగుతాయనేది సీఎం చంద్రబాబు నాయుడు భావన.
This post was last modified on December 19, 2025 8:36 am
మెక్సికోలో అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ మాఫియా డాన్ నెమెసియో రూబెన్ ఒసెగ్వెరా సెర్వంటెస్ అలియాస్ 'ఎల్ మెంచో' కథ ముగిసింది.…
న్యాచురల్ స్టార్ నాని తన ఇమేజ్ ని ఏ దిశగా తీసుకెళ్తున్నాడో ప్రేక్షకులకు పూర్తి క్లారిటీ వచ్చేస్తోంది. దసరాతో తెచ్చుకున్న…
ప్రభాస్ సినిమాలు సెట్స్ మీద ఎన్ని ఉన్నా ముందుగా ఏది విడుదలవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొన్న మాట వాస్తవం. ఆదిపురుష్…
తిరుమలపై మరో దుష్ప్రచారం జరగడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దుష్ప్రాచారానికి కారణం ఎవరు? ఎక్కడ నుంచి జరిగింది?…
ప్రధాన ప్రతిపక్ష హోదా కోరుకుంటున్న మాజీ సీఎం.. వైసీపీ అధినేత జగన్.. దానికి తగిన విధంగా పనిచే స్తున్నారా? అనేది…
తనపై వైసీపీ నాయకులు సహా.. ఆ పార్టీ అధినేత జగన్ చేస్తున్న విమర్శలపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. క్రికెట్…