Political News

ఏపీలో కొత్త జిల్లాలు.. సర్కారుకు కొత్త సమస్యలు..!

కొత్త జిల్లాల ఏర్పాటు అంశం రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఆశలు రేకెత్తించింది. ఈ ప్రభుత్వం అయినా తమకు న్యాయం చేస్తుందని వారు భావించారు. గతంలో వైసీపీ అధినేత జగన్ తొలిసారి 13 జిల్లాలుగా ఉన్న రాష్ట్రాన్ని 26 జిల్లాలకు పెంచారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మార్చుతామని ప్రకటించి, అరకు వంటి పెద్ద పార్లమెంట్ స్థానాన్ని రెండు జిల్లాలుగా విభజించి మొత్తంగా 26 జిల్లాలను ఏర్పాటు చేశారు. అయితే అప్పట్లో జరిగిన తప్పుల కారణంగా ప్రజల్లో ఆందోళన, ఆవేదన వ్యక్తమైంది.

దీంతో ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా పెద్ద పీట వేయాలనే ఉద్దేశంతో ప్రస్తుత ప్రభుత్వం మరోసారి జిల్లాల విభజన అంశాన్ని తెరపైకి తెచ్చింది. జిల్లాలు, మండలాలు కొత్తగా ఏర్పాటు చేయడంతో పాటు మరికొన్ని సరిహద్దులను మార్చాలని భావించింది. అయితే ఇది వివాదంగా మారింది.

ఉదాహరణకు నెల్లూరు జిల్లాను తీసుకుంటే, ఈ జిల్లాలో ఉన్న కొన్ని మండలాలను తిరుపతి జిల్లాలోకి కలపాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. కలువాయి, రావూరు, సైదాపురం వంటి మండలాలను తిరుపతి జిల్లాలో కలపేందుకు మంత్రివర్గ ఉపసంఘం ప్రయత్నిస్తోంది.

అయితే దీనిని స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేస్తున్నారు. ఆ మండలాలను నెల్లూరులోనే ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా గూడూరును నెల్లూరు జిల్లాలో కలపాలన్న డిమాండ్ కూడా తెరపైకి వచ్చింది. దీనిని కొందరు వ్యతిరేకిస్తుండగా, మరికొందరు సమర్థిస్తున్నారు. గూడూరును నెల్లూరులోకి కలపాలంటూ బీజేపీ నాయకులు కోరుతుండగా, దీనిని టీడీపీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు.

దీంతో ఇరుపక్షాల మధ్య ఈ వ్యవహారం ఇబ్బందికరంగా మారింది. అదేవిధంగా ఉదయగిరి నియోజకవర్గంలోని ఉదయగిరి ప్రాంతాన్ని ప్రత్యేక రెవెన్యూ డివిజన్‌గా మార్చాలని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. అభివృద్ధి, తాగునీరు, అలాగే వ్యవసాయానికి సంబంధించిన అనేక అంశాల్లో ఉదయగిరి వెనుకబడి ఉందని, కాబట్టి దీనిని రెవెన్యూ డివిజన్‌గా మార్చాలని వారు కోరుతున్నారు. కానీ ఈ విషయంలో స్థానికంగా ఉన్న టీడీపీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు.

మొత్తంగా రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాల్లో జిల్లాలు, డివిజన్ల విభజన వ్యవహారం ప్రభుత్వాన్ని తీవ్రంగా కుదిపేస్తోంది. మరోవైపు కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి సమయం తక్కువగా ఉండటంతో ప్రభుత్వం ఏం చేయాలన్నది ఇప్పుడు ఇరకాటంగా మారింది. చివరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

This post was last modified on December 18, 2025 1:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబీ గారు… ప్రేక్షకులు ఎప్పుడైనా రైటే

భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…

6 hours ago

‘ఇవేవీ తెలియకుండా జగన్ సీఎం ఎలా అయ్యాడో’

వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…

7 hours ago

అఫీషియల్: తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ

తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…

7 hours ago

‘నువ్వు బ‌జారోడివి కాదు’… అనిల్ మీమ్ పంచ్

సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయ‌డంలో తెలుగు వాళ్ల‌ను మించిన వాళ్లు ఇంకెవ్వ‌రూ ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. కొన్ని మీమ్స్…

8 hours ago

జగన్ చేతులు కాల్చాకా నేతలు ఆకులు పట్టుకున్నారు

అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…

10 hours ago

కైట్ కుర్రోళ్లు… ఇప్పటికైనా అర్థం చేసుకోండి

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…

10 hours ago