Political News

సోనియా, రాహుల్ గాంధీలపై కేసు… కోర్టు సంచలన వ్యాఖ్యలు

నేష‌న‌ల్ హెరాల్డ్ ప‌త్రిక వాటాల‌ను విక్ర‌యించ‌డం ద్వారా.. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు అక్ర‌మాలకు తెర‌దీశార‌ని.. దీనిలో వారు.. మ‌నీలాండ‌రింగ్‌కు కూడా పాల్ప‌డ్డార‌ని.. పేర్కొంటూ.. సీబీఐ, ఈడీ అధికారులు కేసులు న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే. వీటికి సంబంధించి.. ఇద్ద‌రినీ సీబీఐ ఒక ద‌ఫా విచార‌ణ‌కు కూడా పిలిచింది. మ‌రోవైపు అరెస్టుల ప‌ర్వం కూడా కొన‌సాగుతుంద‌ని కొన్నాళ్ల కింద‌ట వార్త‌లు కూడా వ‌చ్చాయి.

అయితే.. తాజాగా ఈ కేసులో ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఇది కూడా ఓ కేసేనా? అంటూ.. ద‌ర్యాప్తు అధికారుల త‌ర‌ఫున హాజ‌రైన న్యాయ‌వాదిని నిల‌దీసింది. ఈ కేసులో మనీలాండరింగ్  వ్య‌వ‌హారాన్ని ప్ర‌శ్నించిన కోర్టు ఈడీ అధికారులు ఏదో ఉద్దేశంతో ప‌నిచేస్తున్నార‌ని అనిపిస్తున్న‌ట్టు వ్యాఖ్యానించ‌డం మ‌రింత సంచ‌ల‌నంగా మారింది. ఈ క్ర‌మంలో ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోవడం లేద‌ని స్ప‌ష్టం చేసింది.

“ఈ కేసులో ఓ ప్రైవేటు వ్య‌క్తి(సుబ్ర‌మ‌ణ్య స్వామి) ప్ర‌మేయం ఉంద‌ని అంటున్నారు. కానీ, త‌గిన ఆధారాలు ఏవీ లేకుండా.. మీరు ఎలా ప‌నిచేస్తున్నారు? ఎవ‌రో వ‌చ్చి ఫిర్యాదు చేస్తే.. గుడ్డిగా విచార‌ణ పేరుతో కాలం వేస్టు చేస్తారా? ఎలాంటి ఆధారాలు లేకుండా ఎఫ్ ఐఆర్ ఎలా న‌మోదు చేస్తారు. “ అని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసు ఉద్దేశ పూర్వ‌క‌మే అయితే.. ఫిర్యాదు చేసిన వ్య‌క్తి, అధికారులు కూడా కోర్టు ఆదేశాల మేర‌కు న‌డుచుకోవాల్సి ఉంటుంద‌ని పేర్కొంది.

నిజానికి మ‌నీలాండ‌రింగ్ కేసులు విచారించేప్పుడు.. త‌గిన ఆధారాలు ఉండాల‌ని వ్యాఖ్యానించిన కోర్టు.. ఈ కేసులో అలాంటి ఆధారాలు ఎక్క‌డున్నాయో.. త‌మ‌కు క‌నిపించ‌డం లేద‌ని చెప్పింది. అయితే.. ఈ కేసును బ‌ల‌ప‌రిచేలా మ‌రిన్ని సాక్ష్యాలు, ఆధారాలు స‌మ‌ర్పిస్తామ‌న్న ఈడీ త‌ర‌ఫు న్యాయ‌వాది వాద‌న‌ల‌తో కోర్టు ఏకీభ‌వించింది. ఈ ప‌ని ఇప్ప‌టికే చేసి ఉండాల్సింద‌ని.. పేర్కొంటూ.. మ‌రింత స‌మ‌యం ఇచ్చింది.

This post was last modified on December 17, 2025 9:59 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

11 రూపాయల టికెట్లు రాంగా రైటా

ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…

48 minutes ago

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

3 hours ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

5 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

5 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

7 hours ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

7 hours ago