నేషనల్ హెరాల్డ్ పత్రిక వాటాలను విక్రయించడం ద్వారా.. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు అక్రమాలకు తెరదీశారని.. దీనిలో వారు.. మనీలాండరింగ్కు కూడా పాల్పడ్డారని.. పేర్కొంటూ.. సీబీఐ, ఈడీ అధికారులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. వీటికి సంబంధించి.. ఇద్దరినీ సీబీఐ ఒక దఫా విచారణకు కూడా పిలిచింది. మరోవైపు అరెస్టుల పర్వం కూడా కొనసాగుతుందని కొన్నాళ్ల కిందట వార్తలు కూడా వచ్చాయి.
అయితే.. తాజాగా ఈ కేసులో ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇది కూడా ఓ కేసేనా? అంటూ.. దర్యాప్తు అధికారుల తరఫున హాజరైన న్యాయవాదిని నిలదీసింది. ఈ కేసులో మనీలాండరింగ్ వ్యవహారాన్ని ప్రశ్నించిన కోర్టు ఈడీ అధికారులు ఏదో ఉద్దేశంతో పనిచేస్తున్నారని అనిపిస్తున్నట్టు వ్యాఖ్యానించడం మరింత సంచలనంగా మారింది. ఈ క్రమంలో ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ను పరిగణనలోకి తీసుకోవడం లేదని స్పష్టం చేసింది.
“ఈ కేసులో ఓ ప్రైవేటు వ్యక్తి(సుబ్రమణ్య స్వామి) ప్రమేయం ఉందని అంటున్నారు. కానీ, తగిన ఆధారాలు ఏవీ లేకుండా.. మీరు ఎలా పనిచేస్తున్నారు? ఎవరో వచ్చి ఫిర్యాదు చేస్తే.. గుడ్డిగా విచారణ పేరుతో కాలం వేస్టు చేస్తారా? ఎలాంటి ఆధారాలు లేకుండా ఎఫ్ ఐఆర్ ఎలా నమోదు చేస్తారు. “ అని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసు ఉద్దేశ పూర్వకమే అయితే.. ఫిర్యాదు చేసిన వ్యక్తి, అధికారులు కూడా కోర్టు ఆదేశాల మేరకు నడుచుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.
నిజానికి మనీలాండరింగ్ కేసులు విచారించేప్పుడు.. తగిన ఆధారాలు ఉండాలని వ్యాఖ్యానించిన కోర్టు.. ఈ కేసులో అలాంటి ఆధారాలు ఎక్కడున్నాయో.. తమకు కనిపించడం లేదని చెప్పింది. అయితే.. ఈ కేసును బలపరిచేలా మరిన్ని సాక్ష్యాలు, ఆధారాలు సమర్పిస్తామన్న ఈడీ తరఫు న్యాయవాది వాదనలతో కోర్టు ఏకీభవించింది. ఈ పని ఇప్పటికే చేసి ఉండాల్సిందని.. పేర్కొంటూ.. మరింత సమయం ఇచ్చింది.
This post was last modified on December 17, 2025 9:59 am
న్యాచురల్ స్టార్ నాని అభిమానుల విపరీతమైన ఎదురు చూపులకు చెక్ పెడుతూ ది ప్యారడైజ్ టీజర్ వచ్చేసింది. నిమిషంన్నర లోపే…
సోషల్ మీడియా ఎప్పుడు ఎవరికి ఎలా ఫేమ్ తెచ్చిపెడుతుందో ఊహించలేం. మలయాళ అమ్మాయి ప్రియ ప్రకాష్ వారియర్ అనుకోకుండా అలాగే…
కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన ఫలితాలు అందుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ సంపాదిస్తాయి. టీవీల్లో, ఆన్ లైన్లో గొప్ప ఆదరణ…
దేశవ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాలను పునర్విభించి .. మహిళలకు రిజర్వేషన్ కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వం ఆశలు ప్రస్తుత సమావేశాల్లో నెరవేరేలా కనిపించడం…
తెలంగాణాలో ఎమ్మెల్యేలు, మంత్రులకు తమ కుమారుల ప్రేమ వ్యవహారాలు తలనొప్పిగా మారుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు కేంద్ర మంత్రి బండి…
ఇంకా రాకా షూటింగ్ పూర్తి కాలేదు. మూడు నెలలకు పైనే వర్కింగ్ డేస్ అవసరమవుతాయని అంటున్నారు. అందుకే విడుదల తేదీ…