బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం పట్నాలోని ముఖ్యమంత్రి నివాసంలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో, నియామక పత్రాలు అందుకుంటున్న ఓ మహిళా ఆయుష్ డాక్టర్ హిజాబ్ను సీఎం స్వయంగా తొలగించిన ఘటన తీవ్ర విమర్శలకు దారి తీసింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారగా, ఆ మహిళ క్షణకాలం నిశ్చేష్టురాలై నిల్చున్నట్లు కనిపించింది. వేదికపై ఉన్న కొందరు నవ్వడం కూడా విమర్శలకు కారణమైంది.
ఈ ఘటనపై ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. ఆర్జేడీ నితీశ్ కుమార్ మానసిక స్థితి సరిగా లేదేమో అంటూ విమర్శలు గుప్పించగా, కాంగ్రెస్ ఈ చర్యను అసహ్యకరమైనదిగా పేర్కొని సీఎం తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.
రాష్ట్రంలో మహిళల భద్రతపై ఈ ఘటన తీవ్ర సందేహాలు కలిగిస్తోందని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఈ కార్యక్రమంలో మొత్తం 1,283 మంది ఆయుష్ వైద్యులకు నియామక పత్రాలు అందజేశారు. వీరిలో ఆయుర్వేద, హోమియోపతి, యునానీ వైద్యులు ఉన్నారు. వీరిని ఆయుష్ మెడికల్ సర్వీసులు, నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో వివిధ ఆరోగ్య సంస్థల్లో నియమించనున్నారు. ఈ ఘటన బిహార్ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చ మొదలైంది.
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…