బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం పట్నాలోని ముఖ్యమంత్రి నివాసంలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో, నియామక పత్రాలు అందుకుంటున్న ఓ మహిళా ఆయుష్ డాక్టర్ హిజాబ్ను సీఎం స్వయంగా తొలగించిన ఘటన తీవ్ర విమర్శలకు దారి తీసింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారగా, ఆ మహిళ క్షణకాలం నిశ్చేష్టురాలై నిల్చున్నట్లు కనిపించింది. వేదికపై ఉన్న కొందరు నవ్వడం కూడా విమర్శలకు కారణమైంది.
ఈ ఘటనపై ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. ఆర్జేడీ నితీశ్ కుమార్ మానసిక స్థితి సరిగా లేదేమో అంటూ విమర్శలు గుప్పించగా, కాంగ్రెస్ ఈ చర్యను అసహ్యకరమైనదిగా పేర్కొని సీఎం తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.
రాష్ట్రంలో మహిళల భద్రతపై ఈ ఘటన తీవ్ర సందేహాలు కలిగిస్తోందని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఈ కార్యక్రమంలో మొత్తం 1,283 మంది ఆయుష్ వైద్యులకు నియామక పత్రాలు అందజేశారు. వీరిలో ఆయుర్వేద, హోమియోపతి, యునానీ వైద్యులు ఉన్నారు. వీరిని ఆయుష్ మెడికల్ సర్వీసులు, నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో వివిధ ఆరోగ్య సంస్థల్లో నియమించనున్నారు. ఈ ఘటన బిహార్ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చ మొదలైంది.
This post was last modified on December 15, 2025 10:27 pm
నాలుగు గంటల విచారణలో అన్నీ ముక్తసరి సమాధానాలే..! కొన్నిటికి మౌనం, మరికొన్నిటికి తెలియదు అంటూ దాటవేత.. విచారణలో ఇదీ సీఐడీ…
తెలుగు సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నందన్ది ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…
అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అందరూ హిట్ మెషీన్ అంటారు. దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత అపజయం లేకుండా కెరీర్ను సాగిస్తున్న…
అమెరికా వెళ్లాలి, బాగా సంపాదించి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కల. కానీ…
బలంగా మాట్లాడాలి. మాటకు మాట కౌంటర్ ఇవ్వాలి. అది వింటే ప్రత్యర్థులు నోరు అప్పగించాలి!. రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్…