బలంగా మాట్లాడాలి. మాటకు మాట కౌంటర్ ఇవ్వాలి. అది వింటే ప్రత్యర్థులు నోరు అప్పగించాలి!. రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తోంది. పార్టీలు ఏవైనా.. నాయకులు ఎవరైనా ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు చెలరేగిపోతున్నారు. ముఖ్యంగా టీడీపీలో ఈ సంస్కృతి పెరుగుతోంది. సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా.. ఇదే సంప్రదాయాన్ని ప్రోత్సహిస్తున్నారు. తద్వారా ఇటు ప్రభుత్వాన్ని, అటు పార్టీని కూడా కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారు.
టీడీపీని తీసుకుంటే.. ప్రతి జిల్లాలోనూ ఫైర్ బ్రాండ్ నాయకులు ఉన్నారు. కొందరు డైరెక్ట్గా మరికొందరు ఇన్డైరెక్ట్గా పార్టీ తరఫున వాయిస్ వినిపిస్తున్నారు. దీంతో పార్టీ, ప్రభుత్వంపై వస్తున్న విమర్శలకు కౌంటర్ ఇస్తున్నారు. అయినా.. ఇది చాలదంటూ చంద్రబాబు చెబుతున్నారు. కానీ,అదేసమయంలో ఈ ట్రెండ్ కు భిన్నంగా వైసీపీ అడుగులు వేస్తోందన్న టాక్ వినిపిస్తోంది. నాయకులు నోరు విప్పితే.. జగన్ను ప్రశంసించాలి. గత పాలనను భుజాలపై ఎత్తుకోవాలి.
ప్రజలకు ఎబ్బెట్టే అయినా.. జగన్ను ప్రశంసలతో పొగడాలి. వాస్తవాన్ని వాస్తవంగా చెప్పాలంటే.. కొంత వెనుకంజ వేయక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. ఇది అంతిమంగా తటస్థ నాయకులకు ఇబ్బందిగా మారిందన్నది తెలుస్తోంది. వైసీపీలో చాలా మంది నేతలు.. కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చారు. వీరిలో గత తరం నాయకులు తటస్థంగా ఉంటారు. చేసే విమర్శల్లో పదును, సంచలనం కన్నా.. కూడా.. నిజాలు చూసుకుంటారు. వారి ఇమేజ్ దెబ్బతినకుండా కూడా చూసుకుంటున్నారు.
కానీ.. ఇది వైసీపీ అధిష్టానానికి నచ్చడం లేదు. దీంతో ఇలాంటి వారిని మీడియా ముందుకు రావద్దని గతంలోనే ఆదేశించారు. ఫలితంగా చాలా మంది నాయకులు దూరంగా ఉంటున్నారు. మరోవైపు.. సంచలన వివాదాస్పద కామెంట్లతో చెలరేగే నాయకులకు పట్టం కట్టారు. ఫలితంగా పార్టీ ఇమేజ్ పూర్తిగా నష్టపోయింది. వైసీపీ అంటే.. బూతుల పార్టీగా పేరు పడిపోయింది. ఈ ఇమేజ్నుంచి బయటకు వస్తే తప్ప.. ప్రస్తుతం మధ్యతరగతి ప్రజలను ఆకర్షించే అవకాశం లేదు. ఈ దిశగా పార్టీ ఇప్పుడు ఆలోచన చేస్తోంది. మరి ఏమేరకు పుంజుకుంటారో చూడాలి.
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…