Political News

ఆ పంచాయతీల్లో బీఆర్ఎస్ ఓటమి, కవిత ఎఫెక్టేనా?

తెలంగాణ‌లో జ‌రిగిన రెండో విడ‌త పంచాయ‌తీ ఎన్నిక‌ల్లోనూ కాంగ్రెస్ పార్టీ మ‌ద్ద‌తు దారులు జోష్ చూపించారు. భారీ ఎత్తున పంచాయ‌తీల‌ను కైవ‌సంచేసుకున్నారు. 193 మండలాల పరిధిలోని 3వేల‌, 911 గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవులకు  జ‌రిగిన రెండో విడ‌త పోలింగ్‌లో కాంగ్రెస్ మ‌ద్ద‌తుతో రంగంలోకి దిగిన 1,728 మంది స‌ర్పంచ్‌లు జ‌య‌కేత‌నం ఎగుర‌వేశారు. నిజానికి తొలి విడత‌లో కాంగ్రెస్ పార్టీ హ‌వాను చూసిన బీఆర్ఎస్ పార్టీ త‌న మ‌ద్ద‌తు దారుల‌కు బ‌ల‌మైన సంకేతాలు ఇచ్చింది. రెండో విడ‌త‌లో అయినా.. పైచేయి సాధించాల‌ని చెప్పింది.

కానీ, రెండో విడ‌త‌లోనూ.. బీఆర్ఎస్ పార్టీ మ‌ద్ద‌తు దారులు వెనుక‌బ‌డ్డారు. 3, 911 పంచాయ‌తీల్లో కేవ‌లం 912 స‌ర్పంచు ప‌ద‌వుల‌ను మాత్ర‌మే బీఆర్ఎస్ దక్కించుకుంది. త‌ద్వారా.. బీఆర్ఎస్‌కు ప్ర‌జ‌ల నుంచి భారీ మ‌ద్ద‌తు లేద‌న్న విషయం స్ప‌ష్ట‌మైంది. మ‌రోవైపు.. బీజేపీ కూడా 201 స్థానాల్లో పైచేయి ద‌క్కించుకుని అంతో ఇంతో అస్తిత్వం కాపాడుకునే ప్ర‌య‌త్నం చేసింది. ఆదివారం ఉద‌యం జ‌రిగిన పోలింగ్‌లో ప‌ల్లె ప్ర‌జ‌లు భారీ ఎత్తున ఎన్నిక‌ల పోలింగ్ కేంద్రాల‌కు క్యూ క‌ట్టారు. మ‌ధ్యా హ్నం 1గంట‌కే పోలింగ్ స‌మ‌యం ముగిసినా.. 2 గంట‌ల వ‌ర‌కు కూడా క్యూలో ఉన్న‌వారు ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు.

దీంతో తొలి విడ‌త‌తో పోల్చుకుంటే.. రెండో విడ‌త‌కు పోలింగ్ శాతం పెరిగింది. దీంతో ఈ పెరిగిన ఓటు బ్యాంకు అంతా త‌మ‌దేన‌ని బీఆర్ఎస్ వ‌ర్గాలు భావించాయి. కానీ, ఎక్క‌డా ఆ దాఖ‌లా పెద్ద‌గా క‌నిపించ‌లేదు. పోలింగ్ శాతం పెరిగిన పంచాయ‌తీల్లో కాంగ్రెస్ విజ‌యం ద‌క్కించుకోవ‌డం గ‌మ‌నార్హం. అదేవిధంగా పోలింగ్ శాతం నామ‌మాత్రంగా జ‌రిగిన చోట కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించింది. మొత్తంగా.. రెండో విడ‌త‌లోనూ బీఆర్ఎస్‌కు అనుకూలంగా ఏమీ వాతావ‌ర‌ణం క‌నిపించ‌లేదు. మ‌రోవైపు.. స్వ‌తంత్రులుగా పోటీ చేసిన‌వారు.. బీఆర్ఎస్ క‌ల‌ల‌ను ఛిద్రం చేశార‌న్న లెక్క‌లు వ‌స్తున్నాయి. వీరు 500 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకున్నారు.

త‌ట‌స్థ ఓటు బ్యాంకును కూడా బీఆర్ఎస్ ద‌క్కించుకోలేక పోవ‌డం.. అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగిన రెండేళ్ల త‌ర్వాత కూడా ఆ పార్టీపై సింప‌తీ పెర‌గ‌క‌పోవ‌డం వంటివి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్నాయి. దీనికి ప్ర‌ధానంగా.. పార్టీపై విశ్వ‌స‌నీయ‌త స‌న్నిగిల్లు తోంద‌న్న చ‌ర్చ‌సాగుతోంది. చిత్రం ఏంటంటే.. బీఆర్ ఎస్ మాజీ నాయ‌కురాలు, ఎమ్మెల్సీ క‌విత ఎన్నిక‌ల‌కు ముందు తిరిగిన ప‌ల్లెల్లో కాంగ్రెస్ జ‌య‌కేత‌నం ఎగుర‌వేయ‌డం గ‌మ‌నార్హం. జ‌న జాగృతి పేరుతో క‌విత‌.. పంచాయ‌తీ ఎన్నిక‌ల షెడ్యూల్‌కు ముందు … వ‌రంగ‌ల్‌, క‌రీంగ‌న‌గ‌ర్‌, న‌ల్లగొండ‌, మ‌హ‌బూబాబాద్ జిల్లాల్లో ప‌ర్య‌టించారు. ఇప్పుడు ఆయా జిల్లాల్లోని ప‌ల్లెల్లో కాంగ్రెస్ మ‌ద్ద‌తు దారులు విజ‌యం ద‌క్కించుకున్నారు. సో.. మొత్తానికి క‌విత దెబ్బ కూడా బీఆర్ ఎస్‌కు బాగానే త‌గిలింద‌న్న చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. 

This post was last modified on December 15, 2025 10:58 am

Share
Show comments
Published by
Kumar
Tags: Kavitha

Recent Posts

ఏ చిన్న అవ‌కాశాన్నీ వ‌ద‌ల‌ట్లేదుగా బాబూ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఏ చిన్న అవ‌కాశాన్నీ వ‌ద‌ల‌ట్లేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. పెట్టుబడుల‌కు ఎక్క‌డ అవ‌కాశం ఉంటే..…

2 hours ago

11 రూపాయల టికెట్లు రాంగా రైటా

ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…

7 hours ago

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

10 hours ago

సభలోకి దేవుడిని లాగడం కరెక్టేనా?

ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో శాస‌న స‌భ‌ను బాయ్‌కాట్ చేసిన వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు శాస‌న మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…

10 hours ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

11 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

12 hours ago