Political News

నారా బ్రాహ్మ‌ణికి ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు

ఏపీ మంత్రి నారా లోకేష్ స‌తీమ‌ణి, న‌ట‌సింహం బాల‌య్య గారాల‌ప‌ట్టి నారా బ్రాహ్మ‌ణి అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌క అవార్డును సొంతం చేసుకున్నారు. దేశంలో `అత్యంత ప్ర‌భావ‌వంత‌మైన మ‌హిళా వ్యాపార వేత్త‌` అవార్డును ఆమె అందుకున్నారు. మ‌హారాష్ట్ర రాజ‌ధాని దేశ వాణిజ్య రాజ‌ధాని ముంబైలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ వాణిజ్య‌ ప‌త్రిక `బిజినెస్ టుడే` ఈ అవార్డును అందించింది. ప్ర‌స్తుతం బ్రాహ్మ‌ణి హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

2025-26 సంవ‌త్స‌రానికి గాను అత్యంత ప్ర‌భావావంత‌మైన వ్యాపార దిగ్గ‌జంగా నారా బ్రాహ్మ‌ణి గుర్తింపు పొందారు. వాస్త‌వానికి ఏటా ఈ పుర‌స్కారాల‌ను అందిస్తారు. ఈ ఏడాది కూడా సుమారు 22 మంది వ్యాపార వేత్త‌లుగా రాణిస్తున్న మ‌హిళ‌లు పోటీలో ఉన్నారు. వారంద‌రిలోకీ.. నారా బ్రాహ్మ‌ణి అత్యుత్త‌మ వ్యాపార వేత్త‌గా నిలిచారు.

ఈ అవార్డు ల‌భించ‌డం ప‌ట్ల నారా బ్రాహ్మ‌ణి స్పందిస్తూ.. ఈ గుర్తింపు ద‌క్క‌డం గౌర‌వంగా భావిస్తున్నాన‌ని చెప్పారు. శాశ్వ‌తంగా నిలిచే సంస్థ‌ల‌ను ఏర్పాటు చేయ‌డం, బాధ్య‌తాయుత నైతిక విలువ‌ల‌కు క‌ట్టుబ‌డి ఉండ‌డం, ప్ర‌జ‌ల‌ను శ‌క్తిమంతం చేయ‌డ‌మే.. నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలుగా ఆమె పేర్కొన్నారు.

దేశ‌వ్యాప్తంగా మ‌హిళా పారిశ్రామిక‌, వాణిజ్య‌, వ్యాపార వేత్త‌ల‌ను గుర్తించి ప్రోత్స‌హిస్తున్న `బిజినెస్ టుడే` ప‌త్రిక‌కు ఆమె ధ‌న్య‌వాదాలు తెలిపారు. కాగా.. గ‌తంలోనూ బ్రాహ్మ‌ణి ప‌లు అవార్డులు అందుకున్నారు. వ్యాపార వేత్త‌గానే కాకుండా.. సామాజిక చైత‌న్యం నింపే కార్య‌క్ర‌మాల్లో పార్టిసిపేట్ చేసిన నేప‌థ్యంలో ఆమెను అవార్డులు వ‌రించాయి.  బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ట్రస్టులో బోర్డు మెంబర్‌గా ఉన్న బ్రాహ్మ‌ణి.. వారానికి ఒక రోజును ఆసుప‌త్రిలో సేవ‌ల‌కు కేటాయిస్తున్నారు.

This post was last modified on December 14, 2025 8:14 am

Share

Recent Posts

100 కోట్లు రాలేదంటే ఏమనుకోవాలి

నిన్న విడుదలైన జన నాయకుడుకి ఎలాంటి టాక్ వచ్చిందో తెలిసిందే. విజయ్ కున్న క్రేజ్ దృష్యా తమిళనాడులో ఎగబడి చూస్తున్నారు…

6 minutes ago

`మేకిన్` ఇండియా అడిగితే.. `లీకిన్` ఇండియా ఇచ్చారు

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారుపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త‌న‌దైన శైలిలో సెటైర్లు వేశారు. దేశ ప్ర‌జ‌లు మేకిన్…

1 hour ago

మ‌న్యానికి కుంకీల‌ను పంపిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌

పార్వ‌తీపురం మ‌న్యం జిల్లాలోని రైతులు గ‌త కొన్ని రోజులుగా ఏనుగుల బెడ‌ద‌ను ఎదుర్కొంటున్నారు. స్థానిక గ్రామాల్లోకి ఏనుగులు చొర‌బ‌డి ప్ర‌జ‌ల‌ను…

2 hours ago

స్థానికంపై జగన్ సీరియస్ గానే ఉన్నారా?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల తర్వాత మరో కీలక ఎన్నికలకు తెర లేవనుంది. రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే దిశగా కూటమి సర్కారు ప్రణాళికలు…

3 hours ago

ముగ్గురు యువతుల ముద్దుల వరుడు

ఇద్దరు భార్యల ముద్దుల మొగుడు.. ఈ కాన్సెప్ట్ తో తెలుగులో ఎన్నో సినిమాలు వచ్చాయి. వినడానికి, చూడడానికి సరదాగానే ఉంటుంది.…

4 hours ago

రామ రామా… ఇంకెన్ని బ్రేకులు స్వామీ

నాలుగు వేల కోట్లతో తీశామని గొప్పగా చెప్పుకున్న ప్యాన్ ఇండియా మూవీ రామాయణ ప్రమోషన్ల పరంగా వేస్తున్న అడుగులు ఎటెటో…

4 hours ago