Political News

నారా బ్రాహ్మ‌ణికి ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు

ఏపీ మంత్రి నారా లోకేష్ స‌తీమ‌ణి, న‌ట‌సింహం బాల‌య్య గారాల‌ప‌ట్టి నారా బ్రాహ్మ‌ణి అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌క అవార్డును సొంతం చేసుకున్నారు. దేశంలో `అత్యంత ప్ర‌భావ‌వంత‌మైన మ‌హిళా వ్యాపార వేత్త‌` అవార్డును ఆమె అందుకున్నారు. మ‌హారాష్ట్ర రాజ‌ధాని దేశ వాణిజ్య రాజ‌ధాని ముంబైలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ వాణిజ్య‌ ప‌త్రిక `బిజినెస్ టుడే` ఈ అవార్డును అందించింది. ప్ర‌స్తుతం బ్రాహ్మ‌ణి హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

2025-26 సంవ‌త్స‌రానికి గాను అత్యంత ప్ర‌భావావంత‌మైన వ్యాపార దిగ్గ‌జంగా నారా బ్రాహ్మ‌ణి గుర్తింపు పొందారు. వాస్త‌వానికి ఏటా ఈ పుర‌స్కారాల‌ను అందిస్తారు. ఈ ఏడాది కూడా సుమారు 22 మంది వ్యాపార వేత్త‌లుగా రాణిస్తున్న మ‌హిళ‌లు పోటీలో ఉన్నారు. వారంద‌రిలోకీ.. నారా బ్రాహ్మ‌ణి అత్యుత్త‌మ వ్యాపార వేత్త‌గా నిలిచారు.

ఈ అవార్డు ల‌భించ‌డం ప‌ట్ల నారా బ్రాహ్మ‌ణి స్పందిస్తూ.. ఈ గుర్తింపు ద‌క్క‌డం గౌర‌వంగా భావిస్తున్నాన‌ని చెప్పారు. శాశ్వ‌తంగా నిలిచే సంస్థ‌ల‌ను ఏర్పాటు చేయ‌డం, బాధ్య‌తాయుత నైతిక విలువ‌ల‌కు క‌ట్టుబ‌డి ఉండ‌డం, ప్ర‌జ‌ల‌ను శ‌క్తిమంతం చేయ‌డ‌మే.. నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలుగా ఆమె పేర్కొన్నారు.

దేశ‌వ్యాప్తంగా మ‌హిళా పారిశ్రామిక‌, వాణిజ్య‌, వ్యాపార వేత్త‌ల‌ను గుర్తించి ప్రోత్స‌హిస్తున్న `బిజినెస్ టుడే` ప‌త్రిక‌కు ఆమె ధ‌న్య‌వాదాలు తెలిపారు. కాగా.. గ‌తంలోనూ బ్రాహ్మ‌ణి ప‌లు అవార్డులు అందుకున్నారు. వ్యాపార వేత్త‌గానే కాకుండా.. సామాజిక చైత‌న్యం నింపే కార్య‌క్ర‌మాల్లో పార్టిసిపేట్ చేసిన నేప‌థ్యంలో ఆమెను అవార్డులు వ‌రించాయి.  బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ట్రస్టులో బోర్డు మెంబర్‌గా ఉన్న బ్రాహ్మ‌ణి.. వారానికి ఒక రోజును ఆసుప‌త్రిలో సేవ‌ల‌కు కేటాయిస్తున్నారు.

This post was last modified on December 14, 2025 8:14 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

2 hours ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

3 hours ago

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…

3 hours ago

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

4 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

5 hours ago

ఆంధ్రా యువత ఎదురుచూపు… ఉగాదికి ముహూర్తం?

ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మ‌ధ్య జ‌రిగే తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది ప‌ర్వ‌దినానికి భారీ ప్ర‌క‌ట‌న చేసేందుకు ఏపీ మంత్రి నారా…

6 hours ago