ఏపీ బీజేపీలో నాయకుల మధ్య లుకలుకలు ఉన్నాయి. ఒకరంటే ఒకరికి పడకపోవడం.. ఒకరిపై మరొకరు ఆధిపత్య రాజకీయాలు చేయడం వంటివి కామన్గా మారాయి. అయితే.. సాధారణంగా ఏ పార్టీలో అయినా.. ఇలాంటి ఆధిపత్య రాజకీయాలు ఉంటాయి. అదేసమయంలో క్షేత్రస్థాయి నాయకులు కూడా తమ తమ శైలిలో రాజకీయాలు చేస్తుంటారు. దీనిని పార్టీలు కూడా సహిస్తుంటాయి. కానీ.. ప్రత్యర్థి పార్టీలకు కోవర్టులుగా వ్యవహరించే వారి విషయమే ఎప్పుడూ ఇబ్బందులకు దారి తీస్తుంది.
ఇప్పుడు ఏపీ బీజేపీలో ఈ విషయమే చర్చకు వస్తోంది. పార్టీలో కోవర్టులు ఉన్నారంటూ.. కొన్నాళ్లుగా నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. అది కూడా వైసీపీకి మేలు చేసేలా వ్యవహరించే వారు ఉన్నారన్నది వారి మాట.
ఒక వైపు కూటమి పార్టీలు కలసి కట్టుగా ముందుకు సాగాలని భావిస్తుంటే.. నాయకులు ఎవరైనా కూడా.. దీనికి దన్నుగా నిలవాల్సి ఉంటుంది. కానీ, పార్టీ పరంగా మాత్రం కొందరు నాయకులు వైసీపీకి, జగన్కు కూడా కోవర్టులుగా వ్యవహరిస్తున్నారంటూ.. బీజేపీ అధిష్టానానికి లేఖలు ముటాయని సమాచారం. ఇది ఇప్పుడు అంతర్గత చర్చల్లో హాట్ టాపిక్గా మారిందన్నది వాస్తవం.
“నిజమే. ఈ విషయం కొన్నాళ్లుగా చర్చనీయాంశంగా మారింది. కొందరు నాయకుల వ్యవహార శైలి అలానే ఉంది.“ అని విజయవాడకు చెందిన కీలక బీజేపీ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. అయితే.. దీనిని తప్పుపట్టాల్సిన అవసరం లేదని చెప్పడం విశేషం. కేంద్రంతో ఉన్న సత్సంబంధాల విషయంలో బీజేపీ నాయకులు కొందరు గతంలో వైసీపీ అధినేతతో పనులు చేయించుకున్నారని.. రాజ్యసభ సీటు కూడా దక్కించుకున్నారని.. సో.. అలాంటప్పుడు ఇవన్నీ కామనేనని చెప్పిన నాయకుడు కూడా ఉన్నారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. కోవర్టులు వెనక్కి తగ్గాల్సిందేనని హెచ్చరించడం గమనార్హం.
This post was last modified on December 14, 2025 8:10 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…