ఏపీ సీఎం చంద్రబాబును ఆ పార్టీ నాయకులు ఒకే కోణంలో చూస్తున్నారా? బాబుకు రెండో కోణం కూడా ఉందన్న విషయాన్ని వారు పట్టించుకోవడం లేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. రాష్ట్రంలో సీఎంగా ఆయన ఒకవైపు అభివృద్ధి పనులు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. తాను పరిగెడుతున్న వేగంతో సమానంగా పరుగులు పెట్టాలని ఆయన ఎమ్మెల్యేలకు చెబుతున్నారు. అయితే.. వారు ఈ విషయాన్ని లైట్ తీసుకుంటున్నారు.
చంద్రబాబు వేగం కాకపోయినా.. అంతో ఇంతో అయినా వేగంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. కానీ.. కొందరు మాత్రమే పనులు చేపడుతున్నారు. ప్రజలను కలుస్తున్నారు. మిగిలిన వారు మాత్రం ఎక్కడిగొంగళి అక్కడే అన్నచందంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఇలాంటి వారిపై చంద్రబాబు రెండో కోణంలో ఆలోచించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక, పార్టీలో కలహాలు పెట్టుకునే నాయకులు కూడా పెరుగుతున్నారు.
వారిని కూడా చంద్రబాబు హెచ్చరిస్తున్నారు. కలహాలతో ఎన్నాళ్లు ఉంటారు..? పార్టీ కార్యక్రమాల కోసం పనిచేయాలని చెబుతున్నారు. కానీ.. నాయకులు మాత్రం కొందరు మారడం లేదు. ఇలాంటి వారిలో ఒకరిద్దరికి ఇటీవల చంద్రబాబు స్వయంగా క్లాస్ ఇచ్చారు. అయిన కూడా.. వారిలో మార్పు కనిపించడం లేదు. అయితే.. చంద్రబాబు కఠినం కఠినం అంటున్నా.. పెద్దగా కఠిన చర్యలు తీసుకోకపోవడంతో ఇలాంటి నాయకులు లైట్ తీసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే నాయకులలో మార్పు అయితే పెద్దగా కనిపించడం లేదు. తాజాగా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వివాదం ఈకోవలోదే. సో.. ఇలాంటి వారు ఇప్పటి వరకు చంద్రబాబులోని ఒకకోణాన్ని మాత్రమే చూశారని అంటున్నారు. ఆయనే కనుక రెండో కోణం నుంచి ఆలోచిస్తే.. ఇప్పటికిప్పుడు బాగానే ఉన్నా.. వచ్చే ఎన్నికల నాటికి అడ్రస్ గల్లంతయ్యే పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు. సో.. తొలిసారి విజయం దక్కించుకున్నవారు.. ఎంతటివారైనా.. పార్టీలైన్ను గౌరవించాల్సిందేనన్నది గుర్తుంచుకోవాలి.
This post was last modified on December 12, 2025 10:33 pm
గుంటూరు ఎంపీ అదే విధంగా కేంద్ర మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖరకు సీఎం చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు. రెండు…
కేంద్రంలోని బిజెపి తమకు తోడుగా ఉంటుందని లేదా వచ్చే ఎన్నికలనాటికీ తమతో కలిసి వస్తుందన్న ఆశల్లో వైసిపి ఉంది. ఈ…
భారత రాష్ట్రసమితి(బీఆర్ఎస్).. ఈ పేరుకు పెద్ద ప్రాభవమే ఉంది. ఒక్కొక్కపార్టీకి నాయకుల పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. కానీ, బీఆర్ఎస్ కు…
సెంటిమెంటుకు-రాజకీయాలకు మధ్య సయామీ కవలలకు ఉన్నంత బంధం ఉంటుంది. సో.. సెంటిమెంటును కాదని నాయకులు రాజకీయాలు చేయగలరా? సాధ్యంకాదు. సో..…
తెలంగాణ పంచాయతీ ఎన్నికల పోలింగ్.. దీనికి ముందు జరిగిన ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు పంచిన నగదు.. వంటివి కీలక…
``ఫలానా వ్యక్తితో కలిసి పనిచేయండి.. ఫలానా పార్టీతో చేతులు కలపండి!`` అని ప్రధాని నరేంద్ర మోడీ తన రాజకీయ జీవితంలో…