Political News

కార్యకర్తలతో చంద్రబాబు… కాఫీ కబుర్లు

తెలుగుదేశం పార్టీ ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.   ‘కాఫీ కబుర్లు’ పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపుతోంది. ఇది ఒక కొత్త కాన్సెప్ట్. పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య దూరాన్ని తగ్గించడమే ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం. ఈనెల రెండో తేదీన టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సరికొత్త కార్యక్రమాన్ని లోకేష్ నేతృత్వంలో నిర్వహించారు. నేతలకు ఆయన దిశా నిర్దేశం చేశారు. కార్యకర్తలతో ఎలా మెలగాలో సూచించారు.

ఈ రోజు కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తల శిక్షణా శిబిరానికి సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో  ‘కాఫీ కబుర్లు’ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పార్టీ కార్యకర్తలను కలుసుకునే ప్రతి సందర్భం తనకు ప్రత్యేకమైన సందర్భంగా చంద్రబాబు నాయుడు అన్నారు. కార్యకర్తే అధినేత అనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆలోచనలు, విజయాలు, నాయకత్వ లక్షణాలు, సంక్షేమ పథకాల అమలు, కార్యకర్తలకు గౌరవం, అందలం వంటి అంశాలపై వారితో చర్చించారు. వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.

కాఫీ తాగుతూ ముచ్చటించుకునే ఈ వినూత్న కార్యక్రమంలో కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పార్టీ అధినేత తమతో పాటు కూర్చుని మాట్లాడటం వారికి ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని కలిగించింది. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం, పార్టీ విధానాలు, గ్రామస్థాయిలో అన్ని పరిస్థితులు, మంచి చెడులు తెలుసుకోవడానికి కూడా ఈ కార్యక్రమం మంచి వేదిక అవుతుందనేది చంద్రబాబు నాయుడు భావన.

This post was last modified on December 11, 2025 9:55 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Chandrababu

Recent Posts

టీవీ సౌండ్ హఠాత్తుగా ఆగిపోయిందే

మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…

26 minutes ago

ఎన్టీఆర్ నీల్… ఇంకో ఏడాది ఆలస్యంగా

అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…

48 minutes ago

కొత్త ‘మహావతారం’పై విమర్శలేల?

గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…

2 hours ago

అన్నీ కారుణ్యాలే అయితే ప్రతిభావంతులు ఏం చెయ్యాలి?

రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…

3 hours ago

30 కోట్ల‌తో సీనియ‌ర్ నిర్మాత సాహ‌సం

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో సుదీర్ఘ కాలంగా నిర్మాత‌గా ఉన్నారు చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు. 90వ ద‌శ‌కంలోనే దివంగ‌త న‌టుడు శోభ‌న్ బాబు…

4 hours ago

రౌడీ కోసం నాని వస్తే… అంత విశేషమా?

ఒక స్టార్ హీరో సినిమా ప్రారంభోత్సవం జరుగుతుంటేనో లేదా ప్రి రిలీజ్ ఈవెంట్ ఏర్పాాటు చేస్తేనో.. ఇంకో స్టార్ హీరో…

6 hours ago