ప్రధాని మోడీ హయాంలో చైనాకు దీటుగా భారత్ ఎదిగేందుకు కొంతకాలంగా గట్టి ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. డ్రాగన్ దేశానికి ఏమాత్రం తీసిపోమన్న రీతిలో మన దేశంలోనూ అత్యాధునిక సాంకేతికతను పరిచయం చేసేందుకు మోడీ సర్కార్ పలు కార్యక్రమాలు చేపట్టింది. ఈ క్రమంలోనే భారత్ లో అహ్మదాబాద్ – ముంబైల మధ్య బుల్లెట్ ట్రైన్ పరుగుపెట్టించేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఇక, తాజాగా మరో రెండో బుల్లెట్ ట్రైన్ మార్గాన్ని నిర్మించేందుకు కేంద్రం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయోధ్యకు బుల్లెట్ ట్రైన్ వేసేందుక మోడీ సర్కార్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి వారణాసి కారిడార్ పేరుతో కొత్త బుల్లెట్ ట్రైన్ రూట్ను సిద్ధం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. దాదాపు 800 కిలో మీటర్లు పొడవుండే ఈ కారిడార్ ….ఢిల్లీ నుంచి మధుర, ప్రయాగ్రాజ్, వారణాసి, ఆగ్రా, కాన్పూర్, జెవర్ ఎయిర్పోర్టులను కలుపుతూ వెళ్లనుందని సమాచారం.
లక్నో, రాయబరేలీలను కూడా తాకుతూ వెళ్లే విధంగా ఈ రైలు మార్గాన్ని ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది. ఢిల్లీ-వారణాసి బుల్లెట్ ట్రైన్ రూట్ నిర్మాణ పనులకు సంబంధించిన సర్వేను రాడార్ ద్వారా నిర్వహించనున్నట్లు నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతినిధులు వెల్లడించారు. రాడార్ ద్వారా 12 రోజుల్లో సర్వే పూర్తి చేయవచ్చని, మామూలుగా అయితే 12 నెలలు పడుతుందని వారు వివరించారు.
అహ్మదాబాద్ – ముంబై బుల్లెట్ ట్రైన్ మార్గానికి కూడా రాడార్ సర్వేనే నిర్వహించామన్నారు. జీపీఎస్, లేజర్ డాటా, ఫోటోలు, రాడార్ అందించిన సమాచారం ప్రకారం సర్వేను పూర్తి చేస్తామని తెలిపారు. మరోవైపు, ముంబై – హైదరాబాద్ లతోపాటు మరిన్ని నగరాల మధ్య కూడా బుల్లెట్ ట్రైన్ మార్గాన్ని నిర్మించే ఆలోచనలో కేంద్ర ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ బుల్లెట్ ట్రైన్ పరుగుపెట్టాలంటే మాత్రం మరికొంత కాలం వేచి చూడాలని ఎన్హెచ్ఎస్ఆర్ఎల్ ప్రతినిధిలు చెబుతున్నారు.
This post was last modified on December 9, 2020 7:31 am
అది ఢిల్లీ హైకోర్టు. ప్రధాన న్యాయమూర్తి ఓ కేసు విచారణను ఆన్లైన్లో ప్రారంభించారు. కొన్ని నిమిషాలు జరిగాయి. వర్చువల్ విచారణలో…
టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఇటీవల పార్టీలో జాతీయ, రాష్ట్ర స్థాయి కార్యవర్గాలతోపాటు.. పొలిట్ బ్యూరోను…
మెగా ఫ్యాన్స్ కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న శుభ వార్త పెద్ది విడుదల తేది. ఏప్రిల్ 30 నుంచి…
కేరళంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సుదీర్ఘ విరామం తర్వాత.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందా? అంటే.. ఔననే అంటు న్నాయి……
ఈశాన్య రాష్ట్రం అస్సాంలో బీజేపీ తన పట్టును వరుసగా మూడో సారి కూడా నిలబెట్టుకుంటోందని సర్వే సంస్థలు తేల్చి చెప్పాయి.…
దీదీనా-మోదీనా నినాదంతో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోటీలో మోదీదే పైచేయి అని బీజేపీనే విజయం దక్కించు కుంటుందని…