Political News

అయోధ్యకు బుల్లెట్ ట్రైన్…మోడీ సర్కార్ ఘనత

ప్రధాని మోడీ హయాంలో చైనాకు దీటుగా భారత్ ఎదిగేందుకు కొంతకాలంగా గట్టి ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. డ్రాగన్ దేశానికి ఏమాత్రం తీసిపోమన్న రీతిలో మన దేశంలోనూ అత్యాధునిక సాంకేతికతను పరిచయం చేసేందుకు మోడీ సర్కార్ పలు కార్యక్రమాలు చేపట్టింది. ఈ క్రమంలోనే భారత్ లో అహ్మదాబాద్ – ముంబైల మధ్య బుల్లెట్ ట్రైన్ పరుగుపెట్టించేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఇక, తాజాగా మరో రెండో బుల్లెట్ ట్రైన్ మార్గాన్ని నిర్మించేందుకు కేంద్రం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయోధ్యకు బుల్లెట్ ట్రైన్ వేసేందుక మోడీ సర్కార్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి వారణాసి కారిడార్ పేరుతో కొత్త బుల్లెట్ ట్రైన్ రూట్‌ను సిద్ధం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. దాదాపు 800 కిలో మీటర్లు పొడవుండే ఈ కారిడార్ ….ఢిల్లీ నుంచి మధుర, ప్రయాగ్‌రాజ్, వారణాసి, ఆగ్రా, కాన్పూర్, జెవర్ ఎయిర్‌పోర్టులను కలుపుతూ వెళ్లనుందని సమాచారం.

లక్నో, రాయబరేలీలను కూడా తాకుతూ వెళ్లే విధంగా ఈ రైలు మార్గాన్ని ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది. ఢిల్లీ-వారణాసి బుల్లెట్ ట్రైన్ రూట్ నిర్మాణ పనులకు సంబంధించిన సర్వేను రాడార్ ద్వారా నిర్వహించనున్నట్లు నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతినిధులు వెల్లడించారు. రాడార్ ద్వారా 12 రోజుల్లో సర్వే పూర్తి చేయవచ్చని, మామూలుగా అయితే 12 నెలలు పడుతుందని వారు వివరించారు.

అహ్మదాబాద్ – ముంబై బుల్లెట్ ట్రైన్ మార్గానికి కూడా రాడార్ సర్వేనే నిర్వహించామన్నారు. జీపీఎస్, లేజర్ డాటా, ఫోటోలు, రాడార్ అందించిన సమాచారం ప్రకారం సర్వేను పూర్తి చేస్తామని తెలిపారు. మరోవైపు, ముంబై – హైదరాబాద్ లతోపాటు మరిన్ని నగరాల మధ్య కూడా బుల్లెట్ ట్రైన్ మార్గాన్ని నిర్మించే ఆలోచనలో కేంద్ర ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ బుల్లెట్ ట్రైన్ పరుగుపెట్టాలంటే మాత్రం మరికొంత కాలం వేచి చూడాలని ఎన్‌హెచ్ఎస్ఆర్ఎల్ ప్రతినిధిలు చెబుతున్నారు.

This post was last modified on December 9, 2020 7:31 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

3 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

3 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

6 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago