సాధారణంగా ప్రభుత్వంలో ఉన్న పార్టీకి చెందిన నాయకులకు సర్కారు నుంచి అభయం ఉంటుంది. ఇది సహజం. ఎక్కడైనా ఎవరైనా తప్పులు చేసినా.. పార్టీ ప్రభుత్వమే కాబట్టి వెనుకేసుకు వస్తుంది. అయితే.. ఏపీలో మాత్రం దీనికి భిన్నంగా టీడీపీ వ్యవహరిస్తోంది. తప్పు చేసిన వారు తన వారే అయినా.. అరెస్టుకు వెనుకాడడం లేదు. చర్యలకు వెనక్కి తగ్గడం లేదు. తాజాగా టీడీపీ నుంచి సస్పెన్షన్కు గురైన చిత్తూరు జిల్లాకు చెందిన జయచంద్రారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.
నకిలీ లిక్కర్ కేసులో జయచంద్రారెడ్డి పేరు ప్రముఖంగా తెరమీదికి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో పార్టీ వెంటనే ఆయనపై చర్యలు తీసుకుంది. పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అంతేకాదు.. పార్టీ బాధ్యతలను కూడా తప్పించారు. దీంతో జయచంద్రారెడ్డి స్థానికంగా అదృశ్యమయ్యారు. తాజాగా ఈ కేసులో జయచంద్రారెడ్డి పీఏ.. సతీష్ను అరెస్టు చేసిన పోలీసులు.. 24 గంటల్లో జయచంద్రారెడ్డిని కూడా బెంగళూరు లో అరెస్టు చేశారు.
వైసీపీ హయాం నుంచే జరిగిన నకిలీ మద్యం కేసు.. ఇటీవల వెలుగు చూసింది. తంబళ్లపల్లి నియోజకవర్గంలోని ములకలచెరువు ప్రాంతంలో తయారీ కేంద్రాన్ని ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించారు. ఈ కేసులో వైసీపీకి చెందిన జోగి రమేష్ బ్రదర్స్ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం వారు కూడా జైల్లోనే ఉన్నారు. తాజా అరెస్టుతో దాదాపు ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నవారిని అరెస్టు చేసినట్టు అయింది.
చంద్రబాబు ఏమన్నారు?
జయచంద్రారెడ్డి అరెస్టు జరిగిన సమయంలో సీఎం చంద్రబాబు కేబినెట్ సమావేశంలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ.. తప్పు చేసిన వారిని వదిలిపెట్టేది లేదన్నారు. పార్టీ నాయకులు ప్రజల సేవకు ఉపయోగపడాలి కానీ.. అక్రమార్కులతో చేతులు కలిపి.. ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి రారాదని స్పష్టం చేశారు. చట్టం ప్రకారం జయచంద్రారెడ్డిపై చర్యలు తీసుకోవాలని మరో సారి పోలీసులకు ఆయన సూచించారు.
This post was last modified on December 11, 2025 4:04 pm
ఏ రాష్ట్రంలో అయినా... ప్రతిపక్ష నాయకులకు ప్రభుత్వాలు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వవు. సహజంగా రాజకీయ వైరాన్ని కొనసాగిస్తాయి. ఏపీ సహా…
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపాయి. పార్టీలకు…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చింది. శుక్రవారం నుంచి…
కన్నడలో ఒకప్పటి స్టార్ హీరోయిన్, తర్వాత రాజకీయ నాయకురాలిగా మారిన దివ్య స్పందన అలియాస్ రమ్య జర్నీలో వివాదాలకు లోటేమీ…
ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…