Political News

ఎన్నికల వరకు ఓర్చుకోండి అని జగన్ సూచన?

వైసీపీ నాయకులకు జగన్ తరచుగా హితవు పలుకుతున్నారు. ఎన్నికల వరకు ఓర్చుకోవాలని చెబుతున్నారు. దీనికి కారణం కొందరు ప్రస్తుతం కేసుల్లో ఇరుక్కున్నారు. మరికొందరు కేసుల్లో ఇరుక్కుని జైలు పాలయ్యారు. దీంతో నాయకులు కొందరు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై తరచుగా వైసీపీలో చర్చ జరుగుతుంది. జగన్ పట్టించుకోవడంలేదని, కనీసం తమకు న్యాయ సహాయం కూడా అందించడం లేదని ఒకరిద్దరు నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.

నిజానికి వైసీపీ తరఫున ప్రముఖ న్యాయవాది పొన్నవోల సుధాకర్ రెడ్డి పలు కేసులను వాదిస్తున్నారు. అయినప్పటికీ కీలక నేతల విషయంలో పార్టీ శ్రద్ధ తీసుకుంటుందని, మిగిలిన వారి విషయంలో వదిలేస్తోందన్న వాదన వినిపిస్తోంది. మరోవైపు కేసుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఏం మాట్లాడితే ఎలాంటి కేసులు నమోదు చేస్తారో అనే ఆవేదనలో పార్టీ నాయకులు ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నాయకులు జగన్ పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ప్రజల మధ్యకు రావాలని, తద్వారా ప్రభుత్వం కేసుల విషయంలో వెనక్కి తగ్గే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

కానీ జగన్ ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్రజల మధ్యకు వచ్చే విషయంలో అనేక సందర్భాల్లో సమయం పెట్టారు. కానీ ఒక్కసారి కూడా ఆయన స్పందించలేదు. మరోవైపు నాయకుల పై కేసులు నమోదు అవుతున్నాయి. వారు కేసుల్లో చిక్కుకుని జైళ్లకు కూడా వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల వరకు వెయిట్ చేయాలని, అప్పటివరకు ఓర్చుకోవాలని జగన్ తరచుగా చెప్తున్నారు. తాజాగా మరోసారి పార్టీ నాయకులకు ఆయన ఇదే విషయాన్ని చెప్పారు.

వచ్చే ఎన్నికల వరకు ఓర్చుకోవాలని, మహా అయితే కేసులు పెడతారు, తప్ప అంతకుమించి ఏమీ చేయలేరని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. మనం అధికారంలోకి వచ్చాక వాటిని ఎత్తేస్తామనీ కూడా భరోసా ఇస్తున్నారు. కానీ పార్టీ నాయకులు మాత్రం ఇదే పద్ధతి కొనసాగితే తాము బయటకు వచ్చే పరిస్థితి లేదని చెబుతున్నారు. దీంతో మొత్తంగా వైసీపీలో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల వరకు వేచి చూసి అప్పటి వరకు బయటకు రాకుండా ఉంటే పార్టీ పరిస్థితి ఏమిటి అన్నది కొందరు నాయకులు చెబుతున్న వాదన.

ఏదేమైనా జగన్ మాత్రం వచ్చే ఎన్నికల వరకు పార్టీ నాయకులు ఓర్చుకోవాల్సిందేనని సూచిస్తున్నారు. మరి దీనిపై నాయకులు ఏ విధంగా వ్యవహరిస్తారు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి. ప్రస్తుతం అయితే వైసీపీ పరిస్థితి ఏమాత్రం బాగోలేదు అన్నది వాస్తవం. రాష్ట్రవ్యాప్తంగా ఉత్తరాంధ్ర మినహా మిగిలిన చోట్ల నాయకులు కేసుల్లో ఇరుక్కున్న మాట వాస్తవం. నకిలీ మద్యం కేసు కావచ్చు, అక్రమ మద్యం కేసు కావచ్చు, ఎన్నికల సమయంలో నిధుల పంపిణీకి సంబంధించిన కేసులు కావచ్చు, సోషల్ మీడియా కేసులు కూడా చాలానే ఉన్నాయి. ఇలా మొత్తంగా వైసీపీ నాయకులు కేసుల్లో చిక్కుకుని అటు కోర్టుల చుట్టూ ఇటు స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు.

This post was last modified on December 11, 2025 11:32 am

Share

Recent Posts

మ‌ళ్లీ తాప్సి మీద ప‌డ్డ కంగ‌న‌

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల‌లో ఒక‌రైన కంగ‌నా ర‌నౌత్‌.. ప‌రిశ్ర‌మ‌లో ఒక స్థాయి అందుకున్న ద‌గ్గ‌ర్నుంచి తాను ప‌ని చేసే ఇండ‌స్ట్రీలోనే…

8 minutes ago

అర్థరహిత సర్వేలతో లాభం లేదు జగన్

రాష్ట్రంలో హైదరాబాద్ కు చెందిన ఐఐటీయన్ల సర్వే పేరుతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెండు మూడు రోజుల నుంచి…

44 minutes ago

ఇది మన ఇరుముడి – చదుకోవాల్సిన కేస్ స్టడీ

ఇరుముడి వసూళ్లు చూసి చాలా మందికి అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదు. ఎక్కడో మారుమూల మూసేయడానికి రెడీగా ఉన్నాయనిపించే…

1 hour ago

స్థానిక ఎన్నిక‌ల్లో… జ‌న‌సేన త్రిముఖ వ్యూహం..!

స్థానిక ఎన్నికల‌పై జ‌న‌సేన త్రిముఖ వ్యూహాన్ని అనుస‌రిస్తోంది. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన పార్టీ అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..…

4 hours ago

విద్యార్థుల పాలిట శాపంగా మారిన గోడలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో విద్యార్థి మృతి చెందాడు. నిన్న వైజాగ్ ప్రైవేటు స్కూల్లో టీచర్ కొట్టిన దెబ్బలకు యూకేజీ విద్యార్థి…

5 hours ago

నిర్మాత గాయాలకు ‘టాక్సిక్’ మందు అవుతుందా

నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…

13 hours ago