Political News

ఇక్కడ వైసీపీ విమర్శలు.. అక్కడ కేంద్రం ప్రశంసలు

ఏపీ ఎడ్యుకేషన్‌ మోడల్‌ ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా విధానాలు అందరి మన్ననలు పొందుతున్నాయి. ఈ రోజు కేంద్ర మంత్రి ఇక్కడి ఎడ్యుకేషన్‌ మోడల్‌ భేష్‌ అంటూ కితాబిచ్చారు. ఇక్కడ ఉన్న విపక్షం మాత్రం లోకేష్‌ బాధ్యతలు చేపట్టిన తొలినాళ్ల నుంచి ఆరోపణలు చేస్తూనే ఉంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోని విద్యా విధానం ఇక్కడ వైసీపీ విమర్శలను, కేంద్రం నుంచి ప్రశంసలను అందుకుంటోందని పలువురు అనుకుంటున్నారు.

ఎవరు ఎన్ని విమర్శలు చేసినా చంద్రబాబు, లోకేష్‌ చొరవ బాగుంది అంటూ ఆ కేంద్ర మంత్రి చెప్పడం ఏపీకి మేలు జరిగే అంశమే. ఈ రోజు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఏమన్నారంటే.. ఏపీలో నాణ్యమైన విద్యా విధానం అమలులో ఉంది. ఇతర రాష్ట్రాలు కూడా ఇటువంటి విధానాన్ని అవలంబించవచ్చు అన్నారు. సీఎస్‌ఆర్‌ నిధులతో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. ఏపీ మోడల్‌ మాగుందంటూ ఇతర రాష్ట్రాలు కూడా సృజనాత్మక విధానాలను అవలంబిస్తున్నాయని కితాబిచ్చారు.

ఏపీలో విద్య, ఐటీ మంత్రిగా నారా లోకేష్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యా విధానంలో వినూత్నమైన మార్పులకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా స్కూళ్లలో ఉపాధ్యాయుల కొరత ఉండకూడదనే ఉద్దేశంతో మెగా డీఎస్సీని నిర్వహించి 16వేలకు పైగా పోస్టులను భర్తీ చేశారు. పాఠశాల విద్యార్థులకు తల్లికి వందనం పథకంలో ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ పథకాన్ని వర్తింపజేస్తున్నారు.

కొద్ది రోజుల కిందట మెగా పేరెంట్‌ మీటింగ్‌ 2.0 విజయవంతంగా నిర్వహించారు. తొలి నుంచీ లోకేష్‌ను టార్గెట్‌ చేస్తూ వైసీపీ ప్రస్తుత విద్యావిధానంపై విమర్శలను చేస్తోంది. అయితే లోకేష్‌ చేపట్టిన సంస్కరణ ఫలితాలు మాత్రం ఏపీ విద్యలో కనిపిస్తున్నాయి. బడుల్లో డ్రాపవుట్స్‌ తగ్గిపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం అవుతున్నాయి. ఇదే కేంద్ర మంత్రి ప్రధాన్‌ ఈ రోజు పేర్కొన్నారు. ఆంధ్రా మోడల్‌ బాగుంది అని ఆయన చెప్పడం మంత్రి నారా లోకేష్‌ పనితీరుకు ఇచ్చిన ప్రశంస అని చెప్పుకోవచ్చు.

This post was last modified on December 10, 2025 7:04 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

1 hour ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

4 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

4 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

5 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

5 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

7 hours ago