ఏపీ ఎడ్యుకేషన్ మోడల్ ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా విధానాలు అందరి మన్ననలు పొందుతున్నాయి. ఈ రోజు కేంద్ర మంత్రి ఇక్కడి ఎడ్యుకేషన్ మోడల్ భేష్ అంటూ కితాబిచ్చారు. ఇక్కడ ఉన్న విపక్షం మాత్రం లోకేష్ బాధ్యతలు చేపట్టిన తొలినాళ్ల నుంచి ఆరోపణలు చేస్తూనే ఉంది. దీంతో ఆంధ్రప్రదేశ్లోని విద్యా విధానం ఇక్కడ వైసీపీ విమర్శలను, కేంద్రం నుంచి ప్రశంసలను అందుకుంటోందని పలువురు అనుకుంటున్నారు.
ఎవరు ఎన్ని విమర్శలు చేసినా చంద్రబాబు, లోకేష్ చొరవ బాగుంది అంటూ ఆ కేంద్ర మంత్రి చెప్పడం ఏపీకి మేలు జరిగే అంశమే. ఈ రోజు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారంటే.. ఏపీలో నాణ్యమైన విద్యా విధానం అమలులో ఉంది. ఇతర రాష్ట్రాలు కూడా ఇటువంటి విధానాన్ని అవలంబించవచ్చు అన్నారు. సీఎస్ఆర్ నిధులతో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. ఏపీ మోడల్ మాగుందంటూ ఇతర రాష్ట్రాలు కూడా సృజనాత్మక విధానాలను అవలంబిస్తున్నాయని కితాబిచ్చారు.
ఏపీలో విద్య, ఐటీ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యా విధానంలో వినూత్నమైన మార్పులకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా స్కూళ్లలో ఉపాధ్యాయుల కొరత ఉండకూడదనే ఉద్దేశంతో మెగా డీఎస్సీని నిర్వహించి 16వేలకు పైగా పోస్టులను భర్తీ చేశారు. పాఠశాల విద్యార్థులకు తల్లికి వందనం పథకంలో ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ పథకాన్ని వర్తింపజేస్తున్నారు.
కొద్ది రోజుల కిందట మెగా పేరెంట్ మీటింగ్ 2.0 విజయవంతంగా నిర్వహించారు. తొలి నుంచీ లోకేష్ను టార్గెట్ చేస్తూ వైసీపీ ప్రస్తుత విద్యావిధానంపై విమర్శలను చేస్తోంది. అయితే లోకేష్ చేపట్టిన సంస్కరణ ఫలితాలు మాత్రం ఏపీ విద్యలో కనిపిస్తున్నాయి. బడుల్లో డ్రాపవుట్స్ తగ్గిపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం అవుతున్నాయి. ఇదే కేంద్ర మంత్రి ప్రధాన్ ఈ రోజు పేర్కొన్నారు. ఆంధ్రా మోడల్ బాగుంది అని ఆయన చెప్పడం మంత్రి నారా లోకేష్ పనితీరుకు ఇచ్చిన ప్రశంస అని చెప్పుకోవచ్చు.
This post was last modified on December 10, 2025 7:04 pm
అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…
కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…
యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…
వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…
కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…
కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ సర్పంచ్ కారును బీజేపీ కార్యకర్తలు…