Political News

అమెరికాలో ఆగని లోకేష్ వేట

పెట్టుబ‌డిదారులకు ఏపీ స్వ‌ర్గ ధామంగా మారుతుంద‌ని.. మంత్రి నారా లోకేష్ తెలిపారు. అమెరికా ప‌ర్యటన‌లో ఉన్న మంత్రి.. పెట్టుబ‌డి దారుల‌తో అలుపెరుగ‌కుండా భేటీ అవుతున్నారు. ఐటీ స‌హా.. ఫార్మా కంపెనీల సీఈవోలు, ఆయా సంస్థ‌ల అధిప‌తుల‌తో కూడా నారా లోకేష్ చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. తాజాగా గూగుల్ సీఈవో సుంద‌ర్ పిచాయ్‌తో నారా లోకేష్ చ‌ర్చ‌లు జ‌రిపారు. సుమారు గంట సేపు పిచాయ్ సమ‌యం కేటాయించ‌డం గ‌మ‌నార్హం.

ఈ సంద‌ర్భంగా విశాఖ‌లో ఏర్పాటు చేయ‌నున్న గూగుల్  డేటా కేంద్రంపై ఇరువురు చ‌ర్చించారు. ప్ర‌స్తుతం భూముల కేటాయింపు కొలిక్కి వ‌స్తున్న నేప‌థ్యంలో ప‌నుల‌కు శ్రీకారం చుట్ట‌నున్నారు. ఇదే విష‌యం పై మంత్రి నారా లోకేష్‌, సుంద‌ర్ పిచాయ్‌ల మ‌ధ్య చ‌ర్చ సాగింది. గూగుల్ డేటా కేంద్రంతోపాటు.. డ్రోన్ సిటీలో నూ పెట్టుబ‌డులు పెట్టాల‌ని ఈ సంద‌ర్భంగా లోకేష్ కోరారు. అమ‌రావ‌తిలో ఏర్పాటు చేయ‌నున్న‌ డ్రోన్ సిటీలో అసెంబ్లింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాల‌ని సూచించారు.

ఇంటెల్ సీటీవోతో కూడా..

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఐటీ హార్డ్ వేర్ టెక్నాల‌జీ దిగ్గ‌జ సంస్థ ఇంటెల్ సీటీవో కె. శేష‌తోనూ మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఏపీలో ఇంటెల్ ఏటీఎంపీ యూనిట్ ఏర్పాటు చేయాల‌న్నారు. త‌ద్వారా.. ఏపీ ఐటీకి మరింత ప్ర‌భావ‌వంత‌మైన గుర్తింపు వ‌స్తుంద‌ని చెప్పారు. అదేవిధంగా రాజ‌ధాని ప్రాంతంలో ఏఐ ప‌రిశోధ‌న కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాల‌ని మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు. అలాగే, దిగ్గ‌జ సంస్థ ఎన్‌-విడియా తోనూ ఆయ‌న భేటీ అయ్యారు. అమ‌రావ‌తిలో ఎన్‌-విడియా ప్రాజెక్టును ప్రారంభించాల‌ని కోరారు.

ఇలా.. ఈ అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ప‌లువురు దిగ్గ‌జ కంపెనీల ప్ర‌తినిధుల‌ను క‌లుస్తున్న మంత్రి నారా లోకేష్ వారిని ఏపీకి ఆహ్వానిస్తున్నారు. దీనికి కొంద‌రు సానుకూలంగా స్పందిస్తుండ‌గా.. మ‌రికొంద‌రు ఇప్ప‌టికే ప్ర‌తిపాద‌న‌లు పంపుతున్న‌ట్టు తెలిపారు. ఏదేమైనా.. ఈ 17 మాసాల కాలంలో అంత‌ర్జాతీయంగా మంత్రి నారా లోకేష్ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకోవ‌డంతోపాటు ప‌రిశ్ర‌మ‌ల‌ను తీసుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

This post was last modified on December 10, 2025 2:20 pm

Share

Recent Posts

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

39 minutes ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

54 minutes ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

55 minutes ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

2 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

3 hours ago

కన్నీటి పర్యంతమైన బొత్స

వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…

3 hours ago