పెట్టుబడిదారులకు ఏపీ స్వర్గ ధామంగా మారుతుందని.. మంత్రి నారా లోకేష్ తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి.. పెట్టుబడి దారులతో అలుపెరుగకుండా భేటీ అవుతున్నారు. ఐటీ సహా.. ఫార్మా కంపెనీల సీఈవోలు, ఆయా సంస్థల అధిపతులతో కూడా నారా లోకేష్ చర్చలు జరుపుతున్నారు. తాజాగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్తో నారా లోకేష్ చర్చలు జరిపారు. సుమారు గంట సేపు పిచాయ్ సమయం కేటాయించడం గమనార్హం.
ఈ సందర్భంగా విశాఖలో ఏర్పాటు చేయనున్న గూగుల్ డేటా కేంద్రంపై ఇరువురు చర్చించారు. ప్రస్తుతం భూముల కేటాయింపు కొలిక్కి వస్తున్న నేపథ్యంలో పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇదే విషయం పై మంత్రి నారా లోకేష్, సుందర్ పిచాయ్ల మధ్య చర్చ సాగింది. గూగుల్ డేటా కేంద్రంతోపాటు.. డ్రోన్ సిటీలో నూ పెట్టుబడులు పెట్టాలని ఈ సందర్భంగా లోకేష్ కోరారు. అమరావతిలో ఏర్పాటు చేయనున్న డ్రోన్ సిటీలో అసెంబ్లింగ్ యూనిట్ను ఏర్పాటు చేయాలని సూచించారు.
ఇంటెల్ సీటీవోతో కూడా..
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ హార్డ్ వేర్ టెక్నాలజీ దిగ్గజ సంస్థ ఇంటెల్ సీటీవో కె. శేషతోనూ మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఏపీలో ఇంటెల్ ఏటీఎంపీ యూనిట్ ఏర్పాటు చేయాలన్నారు. తద్వారా.. ఏపీ ఐటీకి మరింత ప్రభావవంతమైన గుర్తింపు వస్తుందని చెప్పారు. అదేవిధంగా రాజధాని ప్రాంతంలో ఏఐ పరిశోధన కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. అలాగే, దిగ్గజ సంస్థ ఎన్-విడియా తోనూ ఆయన భేటీ అయ్యారు. అమరావతిలో ఎన్-విడియా ప్రాజెక్టును ప్రారంభించాలని కోరారు.
ఇలా.. ఈ అమెరికా పర్యటనలో పలువురు దిగ్గజ కంపెనీల ప్రతినిధులను కలుస్తున్న మంత్రి నారా లోకేష్ వారిని ఏపీకి ఆహ్వానిస్తున్నారు. దీనికి కొందరు సానుకూలంగా స్పందిస్తుండగా.. మరికొందరు ఇప్పటికే ప్రతిపాదనలు పంపుతున్నట్టు తెలిపారు. ఏదేమైనా.. ఈ 17 మాసాల కాలంలో అంతర్జాతీయంగా మంత్రి నారా లోకేష్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంతోపాటు పరిశ్రమలను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
This post was last modified on December 10, 2025 2:20 pm
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…