రాజకీయంగా ప్రశాంతంగా ఉండే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. ఇప్పటి వరకు ఎవరినీ టార్గెట్ చేయలేదు. తన సతీమణి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై ఆరోపణలు వచ్చినప్పుడు, వైసీపీ నేతలు యాగీ చేసినప్పుడు కూడా ఆయన సైలెంట్గానే ఉన్నారు. కానీ.. తాజాగా మాత్రం ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత జగన్పైనే నేరుగా విరుచుకుపడ్డారు. తనపై జగన్ చేసిన వ్యాఖ్యలను తిప్పి కొట్టారు. వైసీపీ సీనియర్ నేత.. వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్నకు సొమ్ములు ఇచ్చిన విషయంపై ఆయన రగిలిపోతున్నారు.
అయితే.. ఇది కేవలం అప్పన్న వ్యవహారంతోనే పోయేలా కనిపించడం లేదు. వేమిరెడ్డి నెల్లూరు జిల్లాలోని కీలక నాయకులకు ఒక ఆర్థిక వనరుగా ఉపయోగపడుతున్నారు. వైసీపీలో ఉన్నప్పుడు ఆయన అనేక మంది నాయకులకు సాయం చేశారు. ఎన్నిక లసమయంలో వారు తిరిగి ఇస్తారా? ఇవ్వరా? అని కూడా చూడకుండా.. ఆర్థిక సాయం అందించారు. ఈ విషయాన్ని అప్పటి వైసీపీ నాయకులు చాలా మంది చెప్పారు. వేమిరెడ్డి సొమ్ము, సాయం అందుకోని వైసీపీ నాయకుడు జిల్లాలోనే లేరని చెప్పారు.
ఇప్పుడు అలాంటి నాయకుడిపైనే జగన్ విమర్శలు చేయడం.. ఆయనను వేరే రూపంలో చూపించే ప్రయత్నం చేయడం సహజంగానే వేమిరెడ్డికి ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో ఆయన మరింతగా పట్టుదలకు పోతే.. అది వైసీపీకి నష్టం తెచ్చే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు పరిశీలకులు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన వారికి వేమిరెడ్డిసాయం చేశారు. వచ్చేఎన్నికల్లోనూ ఆయన పట్టుబడితే.. నెల్లూరులో వైసీపీ ఆశలు వదులు కోవడం ఖాయమని అంటున్నారుపరిశీలకులు.
ఆర్థికంగా ఎలా ఉన్నా.. మంచి పేరు, ప్రజల్లో మంచిని సంపాయించుకున్న వేమిరెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేయడం ద్వారా.. ప్రజల్లోనే వైసీపీ నాయకులు చులకన అవుతారు. తద్వారా అది సింపతీగా మారితే.. వేమిరెడ్డి కుటుంబానికి మేలు చేసినట్టు అవుతుంది తప్ప.. వైసీపీకి కాదని చెబుతున్నారు. ఈ విషయంలో ఎంత మౌనంగా ఉంటే అంత మంచిదని కూడా చెబుతున్నారు. వాస్తవానికి వేమిరెడ్డి వ్యవహారం.. నెల్లూరులో ఇప్పటికీ పాజిటివిటీగానే ఉందన్న విషయాన్ని వైసీపీ నాయకులు గుర్తించాల్సి ఉంటుందని కూడా పరిశీలకులు చెబుతున్నారు.
This post was last modified on December 9, 2025 11:45 am
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…
కెజిఎఫ్ లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ సాధించాక హీరో యష్ వేగంగా సినిమాలు చేయాలని తొందరపడలేదు. కోరుకుంటే స్టార్…
హీరో కిరణ్ అబ్బవరం మంచి ఊపులో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ అనుకున్న దానికన్నా బాగా ఆడటంతో పాటు యాభై…
కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వ్యక్తిగత ఫ్యామిలీ సంబంధాల గురించి రకరకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.…
భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ విమానాశ్రయాన్ని జాతికి…