రాజకీయంగా ప్రశాంతంగా ఉండే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. ఇప్పటి వరకు ఎవరినీ టార్గెట్ చేయలేదు. తన సతీమణి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై ఆరోపణలు వచ్చినప్పుడు, వైసీపీ నేతలు యాగీ చేసినప్పుడు కూడా ఆయన సైలెంట్గానే ఉన్నారు. కానీ.. తాజాగా మాత్రం ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత జగన్పైనే నేరుగా విరుచుకుపడ్డారు. తనపై జగన్ చేసిన వ్యాఖ్యలను తిప్పి కొట్టారు. వైసీపీ సీనియర్ నేత.. వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్నకు సొమ్ములు ఇచ్చిన విషయంపై ఆయన రగిలిపోతున్నారు.
అయితే.. ఇది కేవలం అప్పన్న వ్యవహారంతోనే పోయేలా కనిపించడం లేదు. వేమిరెడ్డి నెల్లూరు జిల్లాలోని కీలక నాయకులకు ఒక ఆర్థిక వనరుగా ఉపయోగపడుతున్నారు. వైసీపీలో ఉన్నప్పుడు ఆయన అనేక మంది నాయకులకు సాయం చేశారు. ఎన్నిక లసమయంలో వారు తిరిగి ఇస్తారా? ఇవ్వరా? అని కూడా చూడకుండా.. ఆర్థిక సాయం అందించారు. ఈ విషయాన్ని అప్పటి వైసీపీ నాయకులు చాలా మంది చెప్పారు. వేమిరెడ్డి సొమ్ము, సాయం అందుకోని వైసీపీ నాయకుడు జిల్లాలోనే లేరని చెప్పారు.
ఇప్పుడు అలాంటి నాయకుడిపైనే జగన్ విమర్శలు చేయడం.. ఆయనను వేరే రూపంలో చూపించే ప్రయత్నం చేయడం సహజంగానే వేమిరెడ్డికి ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో ఆయన మరింతగా పట్టుదలకు పోతే.. అది వైసీపీకి నష్టం తెచ్చే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు పరిశీలకులు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన వారికి వేమిరెడ్డిసాయం చేశారు. వచ్చేఎన్నికల్లోనూ ఆయన పట్టుబడితే.. నెల్లూరులో వైసీపీ ఆశలు వదులు కోవడం ఖాయమని అంటున్నారుపరిశీలకులు.
ఆర్థికంగా ఎలా ఉన్నా.. మంచి పేరు, ప్రజల్లో మంచిని సంపాయించుకున్న వేమిరెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేయడం ద్వారా.. ప్రజల్లోనే వైసీపీ నాయకులు చులకన అవుతారు. తద్వారా అది సింపతీగా మారితే.. వేమిరెడ్డి కుటుంబానికి మేలు చేసినట్టు అవుతుంది తప్ప.. వైసీపీకి కాదని చెబుతున్నారు. ఈ విషయంలో ఎంత మౌనంగా ఉంటే అంత మంచిదని కూడా చెబుతున్నారు. వాస్తవానికి వేమిరెడ్డి వ్యవహారం.. నెల్లూరులో ఇప్పటికీ పాజిటివిటీగానే ఉందన్న విషయాన్ని వైసీపీ నాయకులు గుర్తించాల్సి ఉంటుందని కూడా పరిశీలకులు చెబుతున్నారు.
This post was last modified on December 9, 2025 11:45 am
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. స్వప్నిస్తున్న తెలంగాణ విజన్ డాక్యుమెంటును తాజాగా మంగళవారం సాయంత్రం ఫ్యూచర్…
రకరకాల ప్రచారాలు, వదంతులు, డిస్కషన్లు, సోషల్ మీడియా తిట్లు, ఎన్నెన్నో కథలు వెరసి గత అయిదు రోజులుగా పెద్ద చర్చగా…
టెస్ట్ సిరీస్ ఓటమి బాధను మరిపిస్తూ వన్డే సిరీస్ గెలిచిన టీమిండియా, ఇప్పుడు టీ20లోనూ అదే జోరు కొనసాగించింది. కటక్లోని…
టెక్ ప్రపంచంలోనే ఒక సంచలన ప్రకటన వెలువడింది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.…
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా ఇవాళ సినీ ప్రముఖులు ఈ సమ్మేళనానికి విచ్చేసారు. అందులో పాల్గొన్న నిర్మాత అల్లు…
అఖండ 2 విడుదల డిసెంబర్ 12 ఉంటుందా లేదానే అయోమయం ఇంకా కొనసాగుతోంది. ఆ డేట్ కి రావడం పక్కానే…