రాజకీయంగా ప్రశాంతంగా ఉండే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. ఇప్పటి వరకు ఎవరినీ టార్గెట్ చేయలేదు. తన సతీమణి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై ఆరోపణలు వచ్చినప్పుడు, వైసీపీ నేతలు యాగీ చేసినప్పుడు కూడా ఆయన సైలెంట్గానే ఉన్నారు. కానీ.. తాజాగా మాత్రం ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత జగన్పైనే నేరుగా విరుచుకుపడ్డారు. తనపై జగన్ చేసిన వ్యాఖ్యలను తిప్పి కొట్టారు. వైసీపీ సీనియర్ నేత.. వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్నకు సొమ్ములు ఇచ్చిన విషయంపై ఆయన రగిలిపోతున్నారు.
అయితే.. ఇది కేవలం అప్పన్న వ్యవహారంతోనే పోయేలా కనిపించడం లేదు. వేమిరెడ్డి నెల్లూరు జిల్లాలోని కీలక నాయకులకు ఒక ఆర్థిక వనరుగా ఉపయోగపడుతున్నారు. వైసీపీలో ఉన్నప్పుడు ఆయన అనేక మంది నాయకులకు సాయం చేశారు. ఎన్నిక లసమయంలో వారు తిరిగి ఇస్తారా? ఇవ్వరా? అని కూడా చూడకుండా.. ఆర్థిక సాయం అందించారు. ఈ విషయాన్ని అప్పటి వైసీపీ నాయకులు చాలా మంది చెప్పారు. వేమిరెడ్డి సొమ్ము, సాయం అందుకోని వైసీపీ నాయకుడు జిల్లాలోనే లేరని చెప్పారు.
ఇప్పుడు అలాంటి నాయకుడిపైనే జగన్ విమర్శలు చేయడం.. ఆయనను వేరే రూపంలో చూపించే ప్రయత్నం చేయడం సహజంగానే వేమిరెడ్డికి ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో ఆయన మరింతగా పట్టుదలకు పోతే.. అది వైసీపీకి నష్టం తెచ్చే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు పరిశీలకులు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన వారికి వేమిరెడ్డిసాయం చేశారు. వచ్చేఎన్నికల్లోనూ ఆయన పట్టుబడితే.. నెల్లూరులో వైసీపీ ఆశలు వదులు కోవడం ఖాయమని అంటున్నారుపరిశీలకులు.
ఆర్థికంగా ఎలా ఉన్నా.. మంచి పేరు, ప్రజల్లో మంచిని సంపాయించుకున్న వేమిరెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేయడం ద్వారా.. ప్రజల్లోనే వైసీపీ నాయకులు చులకన అవుతారు. తద్వారా అది సింపతీగా మారితే.. వేమిరెడ్డి కుటుంబానికి మేలు చేసినట్టు అవుతుంది తప్ప.. వైసీపీకి కాదని చెబుతున్నారు. ఈ విషయంలో ఎంత మౌనంగా ఉంటే అంత మంచిదని కూడా చెబుతున్నారు. వాస్తవానికి వేమిరెడ్డి వ్యవహారం.. నెల్లూరులో ఇప్పటికీ పాజిటివిటీగానే ఉందన్న విషయాన్ని వైసీపీ నాయకులు గుర్తించాల్సి ఉంటుందని కూడా పరిశీలకులు చెబుతున్నారు.
This post was last modified on December 9, 2025 11:45 am
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…