తన జీవితంలో జరగని సంఘటన ఇప్పుడు జరిగిందంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు. డల్లాస్ తెలుగు డయాస్పోరా సమావేశానికి విచ్చేసిన ఆయనకు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వేదికపై లోకేష్ ఒక ఆసక్తికరమైన సంఘటనను గుర్తు చేసుకున్నారు. అమెరికాలో సుమారు తొమ్మిదేళ్లు ఉన్నాను. కానీ ఎప్పుడూ జరగని సంఘటన ఈ రోజు జరిగిందంటూ ఆయన వివరించారు.
నేను అమెరికాలో చదివాను. నాలుగు సంవత్సరాలు ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశాను. రెండు సంవత్సరాలు ఇక్కడ వాషింగ్టన్ డిసి లో వరల్డ్ బ్యాంకులో పని చేశాను. మరో రెండు సంవత్సరాలు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశాను అని గుర్తు చేశారు. ఈ దేశంలో ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్న ఇప్పుడు జరగని సంఘటన ఈ రోజు జరిగిందన్నారు.
తాను ఎయిర్పోర్టులో దిగి బయటకు వస్తున్నప్పుడు ఆరుగురు పోలీసులు వచ్చి తనను ఆపారని అన్నారు. నన్ను పట్టుకెళ్ళడానికి వచ్చారా లేక బయటికి తీసుకెళ్లడానికి వచ్చారా అని అనుమానం వేసింది అన్నారు. ఇక్కడ ఆగండి అని వారు సూచించారు. ఏమైందని అడగ్గా బయట చాలా రద్దీగా ఉంది, ఇక్కడి నుంచి బయటకు వెళ్లేందుకు పర్మిషన్ లేదు అని అన్నారని తెలిపారు. అందుకే వేరే మార్గం నుండి నన్ను బయటకు తీసుకొని వచ్చారు అని లోకేష్ తెలిపారు. డల్లాస్ లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటి ఈ కార్యక్రమం వరకు తనకు ఘన స్వాగతం పలికారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
లోకేష్ అమెరికా గడ్డపై అడుగు పెట్టినప్పటి నుంచి ఆయనకు అడుగడుగునా తెలుగు ప్రజలు హారతి పడుతున్నారు. వెళ్లిన ప్రతిచోట లోకేష్ ను చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఆయనతో కరచాలనం చేసేందుకు, సెల్ఫీలు దిగేందుకు పోటీ పడుతున్నారు. మంత్రి నారా లోకేష్ రాకతో డల్లాస్ డయాస్పోరా ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకొంది. టీడీపీ, బీజేపీ, జనసేన జెండాలు అక్కడ రెపరెపలాడాయి. వారి జోష్, ఉత్సాహం చూస్తుంటే తన యువగళం పాదయాత్ర రోజులు గుర్తొచ్చాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. వేలాదిమంది తెలుగువారితో ఒక్కసారిగా డయాస్పోరా ప్రాంగణం నిండిపోయింది ఎన్నారైల ఆత్మీయ స్వాగతం, సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఎన్నారైలు ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ ఉత్తేజ భరితంగా ప్రసంగించారు.
This post was last modified on December 7, 2025 3:08 pm
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…