Political News

‘చిన్న చోరీ’ చేసిన దొంగకు ఉన్న పశ్చాతాపం జగన్ కు లేదా?

తాను చేసింది మహా పాపమే అంటూ.. పరకామణి చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు రవికుమార్ తెలిపారు. ఈ వ్యవహారంలో మాజీ సీఎం.. ఆరోపణలు ప్రత్యారోపణల తర్వాత తొలిసారిగా నిందితుడు బయటకు వచ్చి మాట్లాడారు. ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

అందులో ఆయన ‘పెద్ద తప్పు చేశాను.. తాను చేసిన పెద్ద తప్పునకు భార్య, పిల్లలు బాధనపడి రోజంటూ లేదు..’ అని అన్నారు. తిరుమలలో పరకామణిలో చోరీ కేసు ఇప్పటికే ఎన్నో మలుపులు తిరిగింది. దీనిపై హైకోర్టు జోక్యంతో విచారణ వేగవంతం అయింది. ఆ తర్వాత ఈ చోరీ కేసులో తిరుపతిలో సీఐడీ ఎదుట విచారణకు హాజరయ్యేందుకు రైలులో బయలుదేరిన టీటీడీ మాజీ  అసిస్టెంట్‌ విజిలెన్స్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ సతీష్‌కుమార్‌ శవమై తేలడం సంచలనంగా మారింది.

మూడు రోజుల కిందట మాజీ సీఎం వైయస్ జగన్ ప్రెస్ మీట్ పెట్టి పరకామణి చోరీ చాలా చిన్నది.. కేవలం 9 డాలర్లే.. దానికి నిందితుడు ఆస్తి రాసిచ్చి ప్రాయశ్చిత్తం చేసుకున్నారంటూ వెనుకేసుకొచ్చారు. దీనిపై ఏపీ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. నిన్న సీఎం చంద్రబాబు సైతం ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఇది భక్తుల మనోభావాలకు సంబంధించింది అంటూ జగన్కు కౌంటర్ ఇచ్చారు. చోరీ చేసిన వారిని ఆయన వెనకేసుకు రావడం ఏంటంటూ చంద్రబాబు ప్రశ్నించారు.

కొద్దిసేపటికే నిందితుడు రవికుమార్ ఒక వీడియోను విడుదల చేశారు. అందులో పలు విషయాలను ఆయన వెల్లడించారు. ‘నా కుటుంబం మొత్తం మేం చేసింది మహాపాపంగా భావిస్తున్నాం.. అందుకు ప్రాయశ్చిత్తంగా తన ఆస్తిని రాసిచ్చానని అన్నారు. జగన్ తన ప్రెస్ మీట్ లో కూడా ప్రాయశ్చిత్వం జరిగిపోయింది కదా.. అని అనడం గమనార్హం. మరోవైపు రవికుమార్ వీడియో విడుదల చేసిన యూ ట్యూబ్ ఛానల్ లో వైసీపీ నాయకులకు చెందిన వీడియోలు ఎక్కువగా ఉండడం గమనార్హం. దీంతో అతని చేత వైసీపీ నాయకులే ఈ వీడియోను విడుదల చేయించారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి.

కొందరు తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ వ్యాఖ్యానించడం కూడా గమనించదగిన అంశం. తన ప్రైవేటు భాగాల్లో నగదు దాచినట్లు ప్రచారం జరుగుతోందని.. అది అబద్ధమని, కావాలంటూ శస్త్ర చికిత్స చేయించుకోవచ్చని రవికుమార్ అన్నారు. 2.31 నిమిషాల పాటు ఉన్న వీడియోలో  మాట్లాడుతున్నంతసేపు రవికుమార్ ఏడుస్తూనే ఉన్నారు. ప్రధాన నిందితుడు బయటకు వచ్చి మాట్లాడడంతో.. ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి..!

This post was last modified on December 7, 2025 1:34 pm

Share

Recent Posts

తండ్రి, కొడుకులు ఏపీ చ‌ట్ట‌స‌భ‌ల్లోనే…

తెలుగు రాజ‌కీయాల్లో కుటుంబ రాజ‌కీయాలు కొత్త కాదు. ఒకే కుటుంబంలో తండ్రి, కొడుకులు, భార్య‌భ‌ర్త‌లు కూడా చ‌ట్ట‌స‌భ‌ల‌కు ప్రాథినిత్యం వ‌హించిన…

57 minutes ago

టికెట్ రేట్ల తీర్పులో లాభనష్టాలు ఎవరికి

సోషల్ మీడియాలో, పరిశ్రమలో తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన టికెట్ రేట్ల జిఓ మీద పెద్ద చర్చ జరుగుతోంది. ప్రీమియం…

1 hour ago

అనిల్ రావిపూడి ముందే ఊహించి పెట్టారా

వెంకటేష్ - కళ్యాణ్ రామ్ కలయికలో దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందిస్తున్న సినిమాకు 'జనవరి 12 విడుదల' టైటిల్ లాక్…

2 hours ago

న్యూయార్క్ అటార్నీ జనరల్ రేసులో తెలంగాణా బిడ్డ

ఇప్పుడు అమెరికాలో కొత్తగా వినిపిస్తున్న పేరు సరితా కోమటిరెడ్డి. ఈ తెలంగాణా బిడ్డ న్యూయార్క్ అటార్నీ జనరల్ పదవి రేసులో…

3 hours ago

విశ్వనాథ్ కాళ్లకు ఇరుముడి బంధనం

తమిళం కంటే తెలుగులోనే బాగా పెర్ఫార్మ్ చేస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ కు రెండో వారం చాలా కీలకం కానుంది.…

3 hours ago

ఖలీఫా… ఇంత సైలెంట్ అయితే ఎలాగప్పా

మన ప్రేక్షకులకు స్ట్రెయిట్ డబ్బింగ్ అనే భేదాలు ఉండవు కాబట్టి ఒరిజినల్ వెర్షన్లతో సమానంగా ఇక్కడా రిలీజ్ చేయడం మంచిదే.…

3 hours ago