Political News

ఇండి’గోల’పై కేటీఆర్ ‘పెత్తనం’ కామెంట్స్

బీఆర్ ఎస్ కార్యనిర్వాహ‌క అధ్య‌క్షుడు, మాజీమంత్రి కేటీఆర్ తాజాగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అధికారం ఒక‌రిద్ద‌రి చేతుల్లో ఉంటే.. ఇలాంటి ప‌రిస్థితులే వ‌స్తాయంటూ.. ఆయ‌న `ఇండిగో` విమాన స‌ర్వీసుల‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అంతేకాదు.. సంప‌ద కూడా ఒక‌రిద్ద‌రి చేతుల్లోనే ఉంటే ఇలానే జ‌రుగుతుంద‌న్నారు. తాజాగా హైద‌రాబాద్‌లో జ‌రిగిన ట్రేడ్ యూనియ‌న్ స‌భ‌లో ఆయ‌న పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా ఇండిగో అంశాన్ని ప్ర‌స్తావించిన కేటీఆర్‌.. పైల‌ట్ల‌కు రెస్టు ఇవ్వాల‌ని.. పేర్కొంటూ.. డీజీసీఏ ఏడాది కింద‌టే ఉత్త‌ర్వులు ఇచ్చింద‌ని తెలిపారు. అయినా.. కొంద‌రి చేతుల్లోనే ఉన్న విమానరంగం ఈ ఉత్త‌ర్వుల‌ను పెడ‌చెవిన పెట్టింద‌ని, అందుకే ఇప్పుడు.. ఇబ్బందులు త‌లెత్తాయ‌నిఅన్నారు. పెత్త‌నం .. పెట్టుబ‌డి ఒకే చేతిలో ఉంటే జ‌రిగే అన‌ర్థాల‌కు ఇండిగో ఘ‌ట‌నను ఉదాహ‌ర‌ణ‌గా ఆయ‌న పేర్కొన్నారు.

దేశంలో మెజారిటీ విమానాల‌న్నీ.. ఇండిగో, టాటాల చేతుల్లోనే ఉన్నాయ‌ని.. అందుకే అవి రూల్స్ పాటించ‌డం లేద‌ని కేటీఆర్ చెప్పారు. ఇప్పుడు చేతులు కాలిపోయాక‌.. ఆ ఇబ్బందులు ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్నార‌ని తెలిపారు. ఇక‌, అధికారం కూడా ఒక‌రిద్ద‌రి చేతుల్లో ఉంటే.. కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణ‌యం మాదిరిగానే ఉంటుంద‌ని ఎద్దేవా చేశారు. ఇండిగో విమానాల ర‌ద్దు, ఆల‌స్యంతో కేంద్రం స్పందించి.. ఇటీవ‌ల త‌ను ఇచ్చిన ఉత్త‌ర్వుల‌ను వెన‌క్కి తీసుకుంది.

ఈ ప‌రిణామాల‌ను ప్ర‌స్తావించిన కేటీఆర్‌.. ఒక‌రిద్ద‌రి చేతుల్లోనే అధికారం, పెట్టుబ‌డి, సంస్థ‌లు ఉంటే ఇలానే జ‌రుగుతుంద‌ని పేర్కొన‌డం గ‌మ‌నార్హం. అయితే.. డీజీసీఏ నిర్దేశించిన ప్ర‌మాణాల‌ను పాటించాల్సిందేన‌ని చెప్పుకొచ్చారు. ఇదిలావుంటే.. ఇండిగో వ్య‌వ‌హారంపై కేంద్రం స్పందించింది. ప్ర‌త్యామ్నాయంగా రైళ్ల‌ను ఏర్పాటు చేశామ‌ని.. ప్ర‌యాణికులు వినియోగించుకోవాల‌ని పేర్కొంది. స‌మ‌స్య స‌ర్దుబాటు అయ్యే వ‌ర‌కు.. రైళ్ల‌ను కొన‌సాగించ‌నున్న‌ట్టు తెలిపింది.

This post was last modified on December 7, 2025 9:10 am

Share

Recent Posts

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

2 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

3 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

3 hours ago

వివేకా కేసులో ముగియని సునీత పోరాటం

వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…

3 hours ago

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు… లండన్ నుంచే ఇండియాకు..

విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…

4 hours ago

కాంగ్రెస్ లో కొండా కార్చిచ్చు

సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…

6 hours ago