Political News

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ ప్ర‌భుత్వం కీల‌క ముందడుగు వేస్తోంద‌న్నారు. కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌.. మాట్లాడుతూ.. ఏపీలో గూగుల్ డేటా కేంద్రం, అమ‌రావ‌తిలో క్వాంట‌మ్ వ్యాలీ సిటీ వంటివి ఏపీకి ఏఐ మ‌ణిహారాలుగా మార‌నున్న‌ట్టు చెప్పారు. వృద్ధి రేటు కూడా పుంజుకుంటోంద‌ని తెలిపారు.

2026లో ఏఐ ప్ర‌పంచ స‌ద‌స్సు నిర్వ‌హిస్తున్న‌ట్టు మంత్రి చెప్పారు. దీనిలో ఏపీని కూడా భాగ‌స్వామ్యం చేస్తామ‌ని చెప్పారు. దేశ వ్యాప్తంగా మొత్తం 200 ఏఐ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్న‌ట్టు తెలిపారు. దీనిలో ఏపీని కూడా భాగ‌స్వామ్యం చేయ‌నున్న‌ట్టు వివ‌రించారు. డేటా కేంద్రం రాక‌తో ఏపీలోని విశాఖ రూపు రేఖ‌లు మార‌నున్న‌ట్టు చెప్పారు. ఆర్థికంగానే కాకుండా.. సాంకేతికంగా కూడా రాష్ట్రం వృద్ధి చెందుతోంద‌న్నారు. దీనికి కేంద్రం నుంచి అన్ని విధాలా స‌హ‌కారం అందిస్తున్నామ‌ని వివ‌రించారు.

ముఖ్యంగా సీఎం చంద్ర‌బాబు నేతృత్వంలోని ప్ర‌భుత్వం ఏఐకి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న‌ట్టు మంత్రి పార్ల‌మెంటు(రాజ్య‌స‌భ‌)లో వివ‌రించారు. అమ‌రావ‌తిలో ఏఐ యూనివ‌ర్సిటీని ఏర్పాటు చేయాల‌ని ఇప్ప‌టికే ప్ర‌తిపాద‌న‌లు అందించిన విష‌యాన్ని ఆయన గుర్తు చేశారు. వ‌చ్చే 20 ఏళ్ల‌లో ఏఐ ప్ర‌భావిత రంగాల్లో ఉద్యోగుల‌కు ఇక్క‌డ శిక్ష‌ణ ఇవ్వ‌నున్న‌ట్టు తెలిపారు. ఏపీలోని విశాఖ‌తో పాటు.. మహారాష్ట్ర, యూపీ ల‌లోనూ.. డేటా కేంద్రాలు ఏర్పాటు అవుతున్నాయ‌ని, వీటికి కేంద్రం నుంచి సంపూర్ణ స‌హ‌కారం అందుతుంద‌ని చెప్పారు.

ఇదిలావుంటే.. వ‌చ్చే నెల‌లో అమ‌రావ‌తిలో క్వాంట‌మ్ వ్యాలీ ఏర్పాటుకు ఇప్ప‌టికే రంగం సిద్ధ‌మైంది. దీని ద్వారా.. 20 వేల మందికి పైకి ఉద్యోగాలు పొందేందుకు అవ‌కాశం ఏర్ప‌డుతుంది. అదేవిధంగా విశాఖ‌లో డేటా కేంద్రం, అమ‌రావ‌తిలో ఏఐ యూని వ‌ర్సిటీల‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇలా.. మొత్తంగా ఏఐ ఆధారిత రంగాల‌కు ప్ర‌భుత్వంప్రాధాన్యం ఇస్తుండ‌డం గ‌మ‌నార్హం. దీనివ‌ల్ల ఆర్థికంగా కూడా రాష్ట్రానికి వృద్ధి చేకూరుతున్న‌ట్టు పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం పేర్కొన‌డం విశేషం.

This post was last modified on December 6, 2025 8:17 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అసలు చంద్రబాబు ప్రమేయమే లేదు

2023లో స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న…

6 minutes ago

ఏబీఎన్ రిపోర్టర్ పై బీఆర్ఎస్ దాడి.. ఎవరికి నష్టం?

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు విచారణ జరిపిన సంగతి తెలిసిందే. ఈ…

2 hours ago

ఒకేసారి ఇన్ని సినిమాలు ఎందుక‌య్యా?

ఐతే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్న‌ట్లే ఉంటుంది బాక్సాఫీస్ వ్య‌వ‌హారం. సంక్రాంతికి ఒకేసారి అయిదు సినిమ‌లు రిలీజ‌య్యాయి. కానీ త‌ర్వాతి…

3 hours ago

అంబటి మీద అన్ని కేసులా?

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబుపై టీడీపీ…

3 hours ago

తెలుగువారి మ‌న‌సు దోచిన‌ దురంధ‌ర్

రెండు నెల‌ల కింద‌ట రిలీజైన దురంధ‌ర్ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవ‌లం…

7 hours ago

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

11 hours ago