Political News

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భామినిలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులతో ముచ్చటించారు. విద్యార్ధులకు ఇచ్చిన లెర్నింగ్ టూల్స్ ను పరిశీలించారు. పాఠశాలల్లో డిజిటల్ లెర్నింగ్ సామర్ధ్యాలు పెంచేందుకు వీలుగా కార్యాచరణ చేపట్టాలని విద్యాశాఖను ఆదేశించారు. విద్యార్ధుల ప్రోగ్రెస్ కార్డులను పరిశీలించి, వారి తల్లిదండ్రులతో స్వయంగా మాట్లాడారు.

స్టెమ్ ల్యాబ్ పరిశీలించారు. ల్యాబ్ లో విద్యార్థినులు ప్రజెంటేషన్ ఇచ్చిన తీరును అభినందించారు. క్లాస్ రూంలో కూర్చొని క్లికర్ విధానాన్ని విద్యార్థులతో కలిసి పరిశీలించారు. రెయిన్ ఫాల్ పై వీడియో ప్రదర్శించి దాని ఆధారంగా ప్రశ్నలు అడిగారు. మంచి మార్కులు వచ్చిన వారికి సాటి విద్యార్ధులతో చప్పట్లు కొట్టించారు.

సీఎం చంద్రబాబు నాయుడు విద్యార్థులతో మమేకం కావడం, ముచ్చటించటం, వాళ్లతో కలిసి చప్పట్లు కొట్టడం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తాను నిరంతర విద్యార్థిని అని ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు చెబుతూ ఉంటారు. నూతన అంశాలను తెలుసుకోవడం తద్వారా పాలనలో సరికొత్త పంథాని ఆవిష్కరించడం అందరికీ తెలిసిందే.

భామినిలోని ఏపీ మోడల్ స్కూల్‌‌లో స్టెమ్ ల్యాబ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. పాఠశాలలోని ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ లో సీఎం ముందు విద్యార్థినులు ప్రజెంటేషన్ ఇవ్వగా, వారిని సీఎం అభినందించారు. ల్యాబ్ లో విద్యార్థులు చెబుతున్న వాటిని ఆసక్తిగా విన్నారు. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.

This post was last modified on December 5, 2025 5:08 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

మహేష్ కోసం వాయిస్ మార్చమన్న కృష్ణ

కొన్ని సినిమాలు హీరోలకు నటులుగా మంచి పేరు తెచ్చిపెడతాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోవు. మహేష్ బాబు…

5 hours ago

వైసీపీలా చెడ్డపేరు తెచ్చుకోవద్దు: పవన్ హెచ్చరిక

ఏపీలో మద్యం అమ్మకాల విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం…

6 hours ago

టాక్సిక్ ఎందుకు భయపడటం లేదు

దురంధర్ 2 ది రివెంజ్ దెబ్బకు అడివి శేష్ డెకాయిట్ వాయిదా పడింది. ఇదే రూటులో టాక్సిక్ కూడా మనసు…

7 hours ago

లడ్డూ తయారిలో 58 లక్షల లీటర్ల పామాయిల్?

సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ నివేదిక వెల్లడైన…

7 hours ago

సింగర్ చిన్మ‌యిపై కేసు

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే త‌మిళ గాయ‌ని, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మ‌యిపై కేసు న‌మోదైంది. ఎక్స్‌లో ఆమె చేసిన…

8 hours ago

అన్నయ్య రూటులోనే బేబీ హీరో రిస్కు

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీకి వచ్చిన ఆనంద్ దేవరకొండని సక్సెస్ వరించడానికి టైం అయితే పట్టింది. బేబీ…

9 hours ago