పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. అందులో సుస్వాగతం సినిమా ఒకటి. ఈ సినిమా తర్వాత పవన్ తో సినిమా చేయాలని మాజీ మంత్రి ఒకరు భావించారు. కొన్ని కారణాలతో అది ఆచరణలోకి రాలేదు.. ఆ విషయాన్ని స్వయంగా ఆ మాజా మంత్రి ఈ రోజు వెల్లడించారు. విషయం ఏంటంటే.. ఈ రోజు చిలకలూరిపేటలో మెగా టీచర్ పేరెంట్ మీటింగ్ జరిగింది. ఆ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అదే కార్యక్రమంలో మాజీ మంత్రి, ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ఆసక్తికర విషయాలను తెలిపారు.
‘1998లో సుస్వాగతం ప్రివ్యూ షో చూశాను. అప్పటికి నేను రాజకీయాల్లోకి రాలేదు. పవన్ కళ్యాణ్ కు నేను ఫ్యాన్ ని. నేను పవన్కల్యాణ్ తో ఒక సినిమా తియ్యాలని అని అనుకున్నాను. భీమినేని శ్రీనివాసరావు, పవన్కల్యాన్, నేను ముగ్గురం కలిసి సుస్వాగతం ప్రివ్యూ షో చూసి సినిమాకు కమిట్మెంట్అయ్యాం. నేను సినిమా తియ్యాలని అడగగానే ఆయన వెంటనే ఒప్పుకున్నారు. భీమినేని శ్రీనివాసరావుది మా ఊరి పక్కనే బేతపూడి. ఆ తర్వాత అనుకోకుండా నేను రాజకీయాల్లోకి వచ్చాను. లేకుంటే పవన్ గారితో సినిమా తీసి ఒక సంచలనం సృష్టించేవాడిని..’ అని ప్రత్తిపాటి పుల్లారావు సభాముఖంగా వివరించారు.
ఆయన మాట్లాడుతుండగా వేదికపై ఉన్న పవన్ కళ్యాణ్ , విన్నారు. కోట్లాదిమంది అభిమానుల గుండె గుడిలో ఆరడుగుల బుల్లెట్ ఉందన్నారు. ఒక అంకిత భావం కలిగిన నటుడు, రాజకీయ నాయకుడు పవన్ కల్యాణ్ అని అన్నారు. ఆత్మవిశ్వాసం + ఆత్మగౌరవం + ఆత్మీయత – అహంకారం = పవన్ కల్యాణ్ అంటూ ఆయన అభివర్ణించారు. పవన్ తో తాను సినిమా నిర్మించాలని అనుకున్నాను అని ప్రత్తిపాటి తెలపగానే పవన్ కళ్యాణ్ తో సహా అక్కడున్న వారంతా ఆసక్తిగా విన్నారు. పవన్ఆరోజు జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నట్లు చిరునవ్వులు నవ్వారు.
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…