2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడి వైసీపీని మట్టి కరిపించాయి. కూటమిలోని మూడు పార్టీల మధ్య చిన్న చిన్న సమస్యలుండడం సహజం. కానీ, ఆ చిన్న సమస్యలను భూతద్దంలో చూపించి కూటమిని విచ్ఛిన్నం చేయాలని వైసీపీ ఎదురు చూస్తోంది. ఈ క్రమంలోనే కూటమి పార్టీల నేతలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక సూచన చేశారు. కూటమి బలంగా ఉండాలంటే మూడు పార్టీల నేతలు మినీ యుద్ధాలే చేయాలని పవన్ అన్నారు.
విభిన్నమైన పార్టీల నుంచి వచ్చిన నేతలు, కానీ, రాష్ట్రం బాగుండాలని, అరాచక పాలన ఉండకూడదన్నది అన్ని పార్టీల ఉమ్మడి ఉద్దేశ్యమని పవన్ చెప్పారు. ఒక పార్టీకి చెందిన నాయకులలోనే అంతర్గత విభేదాలుండడం సహజమని, అటువంటిది మూడు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడితే పార్టీల మధ్య చిన్న చిన్న విభేదాలుంటాయని అన్నారు. అయితే, సామరస్యపూర్వకంగా కూర్చొని మాట్లాడుకొని చిన్న చిన్న గొడవలు, సమస్యలను పరిష్కరించుకోవాలని హితవు పలికారు.
చైనా, ఇండియాల మధ్య చర్చలు ఒక్కోసారి 18-20 సార్లు కూర్చుంటేగానీ పరిష్కారం కావని, అదే రీతిలో కూటమి పార్టీలు కలిసికట్టుగా బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలే చేయాల్సి ఉంటుందని పవన్ అన్నారు. యుద్ధం అంటే గొడవ కాదని, మాట్లాడుకొని, చర్చించుకొని సమస్యలు పరిష్కరించుకోవాలని పవన్ సూచించారు. బలాబలాలు చూసుకోవాలని, పరిస్థితులను గమనించుకోవాలని అన్నారు.
కూటమి పార్టీలోని చిన్న చిన్న విభేదాలను పెద్దవి చేసి కూటమిని విడగొట్టేందుకు వైసీపీ రెడీగా ఉందని, ఆ అవకాశం వైసీపీకి ఇవ్వకుండా కూటమి లోని అంతర్గత సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పవన్ సూచించారు. అంతేగానీ, సోషల్ మీడియాలో ఒక పార్టీపై మరొక పార్టీ విమర్శలు చేయడం ద్వారా వైసీపీకి పలుచన అయిపోతామని పవన్ అంటున్నారు.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…