ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్ చేశారు. ఆయన వల్ల తెలుగు ప్రజల ఐక్యత చెడిపోయే ప్రమాదం ఏర్పడిందని అన్నారు. ఈ మేరకు ఆయన సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తూ.. సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. రెండు తెలుగు ప్రజల రాష్ట్రాలు భౌతికంగా విడిపోయినా.. శారీరకంగా మానసికంగా కలిసే ఉన్నాయని.. ఎలాంటి శతృత్వం లేదని చెప్పారు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా.. ఆయన తన కుమార్తెను భీమవరం అబ్బాయికి ఇచ్చి వివాహం చేశారని నారాయణ గుర్తు చేశారు. కాబట్టి.. శతృత్వాలు లేవు కదా! అని వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ గతంలో చేగువేరా డ్రస్ ధరించి విప్లవకారుడిని అని తిరిగారని చెప్పారు. తర్వాత వేషం మార్చి.. సావార్కర్ శిష్యుడిగా మారారని, ఇప్పుడు సనాతన ధర్మంలో ఉన్నారని నారాయణ అన్నారు. సనాతన ధర్మంలో ఉన్నాడు. కాబట్టి దిష్టి తగిలింది.. అనే పదాలు వాడుతున్నాడని వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో ఆయన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పదవికి తగరని నారాయణ అన్నారు. ఆయన ఈ పదవిని వదిలేసి.. గుడులూ.. గోపురాల చుట్టూ తిరగొచ్చని.. సనాతన ధర్మంలో ఉండొచ్చని అన్నారు. ఆయన రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా తగరని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య విబేధాలు రేకిత్తించే విధంగా ఉన్నాయి కాబట్టి ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలని సీపీఐ నారాయణ కోరారు.
'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…
ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…
అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్డమ్ పరిస్థితి మాత్రం…
టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…