ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్ చేశారు. ఆయన వల్ల తెలుగు ప్రజల ఐక్యత చెడిపోయే ప్రమాదం ఏర్పడిందని అన్నారు. ఈ మేరకు ఆయన సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తూ.. సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. రెండు తెలుగు ప్రజల రాష్ట్రాలు భౌతికంగా విడిపోయినా.. శారీరకంగా మానసికంగా కలిసే ఉన్నాయని.. ఎలాంటి శతృత్వం లేదని చెప్పారు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా.. ఆయన తన కుమార్తెను భీమవరం అబ్బాయికి ఇచ్చి వివాహం చేశారని నారాయణ గుర్తు చేశారు. కాబట్టి.. శతృత్వాలు లేవు కదా! అని వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ గతంలో చేగువేరా డ్రస్ ధరించి విప్లవకారుడిని అని తిరిగారని చెప్పారు. తర్వాత వేషం మార్చి.. సావార్కర్ శిష్యుడిగా మారారని, ఇప్పుడు సనాతన ధర్మంలో ఉన్నారని నారాయణ అన్నారు. సనాతన ధర్మంలో ఉన్నాడు. కాబట్టి దిష్టి తగిలింది.. అనే పదాలు వాడుతున్నాడని వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో ఆయన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పదవికి తగరని నారాయణ అన్నారు. ఆయన ఈ పదవిని వదిలేసి.. గుడులూ.. గోపురాల చుట్టూ తిరగొచ్చని.. సనాతన ధర్మంలో ఉండొచ్చని అన్నారు. ఆయన రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా తగరని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య విబేధాలు రేకిత్తించే విధంగా ఉన్నాయి కాబట్టి ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలని సీపీఐ నారాయణ కోరారు.
This post was last modified on December 3, 2025 9:37 pm
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…