Political News

పీఎంవో పేరు-భ‌వ‌నం కూడా మార్పు.. అవేంటంటే!

దేశంలో పురాత‌న, బ్రిటీష్ కాలం నాటి పేర్ల‌ను, ఊర్ల‌ను కూడా మారుస్తున్న కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీయే ప్ర‌భుత్వం తాజాగా గ‌వ‌ర్న‌ర్ల భ‌వ‌నాల‌కు సోమ‌వారం పేర్లు మార్చిన విష‌యం తెలిసిందే. కొన్ని ద‌శాబ్దాలుగా రాజ్ భ‌వ‌న్‌లుగా పేర్కొంటున్న గ‌వ‌ర్న‌ర్ల బంగ‌ళాల‌కు..’లోక్ భ‌వ‌న్లు’గా పేరు మార్చింది. ఈ ఆదేశాలు త‌క్ష‌ణ‌మే అమల్లోకి వ‌చ్చిన‌ట్టు తెలిపింది. ఈ ప‌రంపర‌లో తాజాగా ప్ర‌ధాన మంత్రి నివాసం, కార్యాల‌యం పేరునుకూడా మార్పు చేసింది.. ఇక నుంచి ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యం, నివాసం(పీఎంవో)ను ‘సేవా తీర్థ్‌'(సేవ‌ల క్షేత్రం)గా మార్పు చేసింది.

ఈ నిర్ణ‌యం కూడా త‌క్ష‌ణ‌మే అమ‌ల్లోకి వ‌చ్చిన‌ట్టు కేంద్ర హోం శాఖ మంగ‌ళ‌వారం విడుద‌ల చేసిన జీవోలో స్ప‌ష్టం చేసింది. ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కు కొన్నిద‌శాబ్దాలుగా ప్ర‌ధాని నివాసం ఉంటున్న భ‌వ‌నాన్ని కూడా మార్పు చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లో ఉన్న భ‌వ‌నం నుంచి ప్ర‌ధాన మంత్రి కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తున్నారు. మంగ‌ళ‌వారం నుంచి ఈ భ‌వనాన్ని కొత్త‌గా నిర్మించిన ‘సెంట్రల్ విస్టా అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా కీలకమైన ప్రభుత్వ కార్యాలయాలను ‘న్యూ ఎగ్జిక్యూటివ్ ఎన్‌క్లేవ్‌’లోకి మార్చనున్నారు. దీనికే సేవా తీర్థ్‌గా పేరు పెట్టారు.

అయితే.. ఈ భ‌వ‌నాన్ని కూడా మూడు భాగాలుగా విభ‌జించారు. న్యూ ఎగ్జిక్యూటివ్ ఎన్‌క్లేవ్‌లోని ఒక భ‌వ‌నాన్ని సేవా తీర్థ్‌-1, రెండో దానిని సేవా తీర్థ్‌-2, మూడో దానిని సేవాతీర్థ్ -3 గా పిల‌వ‌నున్నారు. ఈ మేర‌కు కేంద్ర హోం శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీనిలో సేవాతీర్థ్‌-1లో ప్ర‌ధాని కార్యాల‌యం, ఆయ‌న నివాసం కూడా ఏర్పాటు చేస్తారు. దీనికి అత్యంత క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త‌ను క‌ల్పించారు. జీపీఎస్ నేవిగేష‌న్‌ను కేడా ఏర్పాటు చేశారు. ప్ర‌తి క‌ద‌లిక‌ల‌ను అధికారులు గ‌మ‌నించ‌నున్నారు. సుమారు 50 మీట‌ర్ల దూరం వ‌ర‌కు దృష్టి పెట్ట‌గ‌ల అత్య‌త బ‌ల‌మైన సీసీ కెమెరాల‌ను ఏర్పాటు చేశారు. ఇక‌, సేవాతీర్థ్‌-2, 3 ప్ర‌ధాన మంత్రి వ‌ర్గ స‌చివాల‌యంగా నిర్వ‌హిస్తారు. దీనిలో జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు కార్యాల‌యం,నివాసంకూడా ఉంటాయి.

This post was last modified on December 2, 2025 6:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయితే రచ్చే

రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…

52 minutes ago

ప్రతిచోట చీపురు పట్టుకొని పవన్ ఊడవాలా?

పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…

4 hours ago

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

5 hours ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

5 hours ago

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

6 hours ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

14 hours ago