Political News

పవన్ పై కాంగ్రెస్ ఫైర్… వైసీపీకి పండగే!

కోనసీమ కొబ్బరి తోటలు ఎండిపోవడానికి దిష్టి తగలడం, తెలంగాణ నాయకుల పదే పదే ఇక్కడి పచ్చదనం గురించి మాట్లాడడమే కారణమని, తెలంగాణ విభజన కూడా కోనసీమ పచ్చదనం వల్లే జరిగిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ చేసిన కామెంట్లు తెలంగాణలో రాజకీయ కాక రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ పై తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, జడ్జర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి విమర్శలు గుప్పించారు. పవన్ క్షమాపణలు చెప్పాల్సిందేనని వారిద్దరూ డిమాండ్ చేశారు.

ఈ క్రమంలోనే పవన్ పై తెలంగాణ కాంగ్రెస్ నేతలతోపాటు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. ఇందులో పెద్ద విషయం ఏమీ లేదు. కానీ, ఆశ్చర్యకరంగా టీ కాంగ్రెస్ కంటే ఎక్కువగా వైసీపీ సోషల్ మీడియాలో పవన్ పై విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. పవన్ పై కాంగ్రెస్ విమర్శలు చూసి పండగ చేసుకుంటున్న వైసీపీ నేతలు అది చాలదన్నట్లు తమ సోషల్ మీడియాలో పవన్ పై పనిగట్టుకొని విమర్శలు చేయిస్తున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే టీ కాంగ్రెస్ సోషల్ మీడియా కంటే వైసీపీ సోషల్ మీడియా గట్టిగా డ్యూటీ చేస్తోంది.

ఈ క్రమంలో వైసీపీ సోషల్ మీడియాపై ట్రోలింగ్ జరుగుతోంది. 2024 ఎన్నికల్లో కింగ్ మేకర్ గా మారి వైసీపీని చావుదెబ్బ తీసిన పవన్ పై వైసీపీకి ఆ మాత్రం అక్కసు ఉండడం సహజమని జనసైనికులు అంటున్నారు. అయితే, పవన్ పై ఫోకస్ చేయడం మానేయాలని, ఇప్పటికైనా జగన్ ను అసెంబ్లీకి పంపే మార్గం చూడాలని ఎదురుదాడి చేస్తున్నారు.

This post was last modified on December 2, 2025 5:42 pm

Share

Recent Posts

మహాకాళి శ్రియ… థియేటర్లలో పూనకాలే!

శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…

12 minutes ago

త్రినాధ్ సంభవాన్ని తక్కువంచనా వేశారా

ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…

16 minutes ago

హోంమంత్రి పై కూలిన డ్రోన్‌… ఏం జ‌రిగింది?

ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్‌.. కొద్ద దూరం పైకి వెళ్లి…

2 hours ago

కుళ్లిపోయిన 100 టన్నుల చికెన్‌… చేపల ఆహారంగా!

కుళ్లిపోయిన చికెన్‌ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో…

3 hours ago

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

3 hours ago

ఆ ముగ్గురి మ‌ర‌ణానికి కార‌ణం ఐఫోన్ కాదా?

మ‌హారాష్ట్ర‌లో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండ‌గా, నిమిషాల వ్య‌వ‌ధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్…

3 hours ago