కోనసీమ కొబ్బరి తోటలు ఎండిపోవడానికి దిష్టి తగలడం, తెలంగాణ నాయకుల పదే పదే ఇక్కడి పచ్చదనం గురించి మాట్లాడడమే కారణమని, తెలంగాణ విభజన కూడా కోనసీమ పచ్చదనం వల్లే జరిగిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ చేసిన కామెంట్లు తెలంగాణలో రాజకీయ కాక రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ పై తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, జడ్జర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి విమర్శలు గుప్పించారు. పవన్ క్షమాపణలు చెప్పాల్సిందేనని వారిద్దరూ డిమాండ్ చేశారు.
ఈ క్రమంలోనే పవన్ పై తెలంగాణ కాంగ్రెస్ నేతలతోపాటు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. ఇందులో పెద్ద విషయం ఏమీ లేదు. కానీ, ఆశ్చర్యకరంగా టీ కాంగ్రెస్ కంటే ఎక్కువగా వైసీపీ సోషల్ మీడియాలో పవన్ పై విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. పవన్ పై కాంగ్రెస్ విమర్శలు చూసి పండగ చేసుకుంటున్న వైసీపీ నేతలు అది చాలదన్నట్లు తమ సోషల్ మీడియాలో పవన్ పై పనిగట్టుకొని విమర్శలు చేయిస్తున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే టీ కాంగ్రెస్ సోషల్ మీడియా కంటే వైసీపీ సోషల్ మీడియా గట్టిగా డ్యూటీ చేస్తోంది.
ఈ క్రమంలో వైసీపీ సోషల్ మీడియాపై ట్రోలింగ్ జరుగుతోంది. 2024 ఎన్నికల్లో కింగ్ మేకర్ గా మారి వైసీపీని చావుదెబ్బ తీసిన పవన్ పై వైసీపీకి ఆ మాత్రం అక్కసు ఉండడం సహజమని జనసైనికులు అంటున్నారు. అయితే, పవన్ పై ఫోకస్ చేయడం మానేయాలని, ఇప్పటికైనా జగన్ ను అసెంబ్లీకి పంపే మార్గం చూడాలని ఎదురుదాడి చేస్తున్నారు.
This post was last modified on December 2, 2025 5:42 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…