ఇతర రాష్ట్రాలు వద్దని గోల చేస్తున్న ‘సర్’ ప్రక్రియపై ఏపీ అధికార పార్టీ టీడీపీ సానుకూలత వ్యక్తం చేయడం.. ఎంత వేగంగా అయితే.. అంత వేగంగా ఏపీలో సర్ ప్రక్రియను ప్రారంభించేలా కేంద్రాన్ని కోరతామని.. ఆపార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు చెప్పడం విశేషం. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ద్వారా 2001కి ముందు ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరి నుంచి ఆధారాలు సేకరిస్తారు. దీని ద్వారా ఓటు హక్కును నిర్ధారిస్తారు.
అనధికార, మృతి చెందిన, వేరే ప్రాంతం నుంచి వలస వచ్చిన వారి ఓట్లను జాబితాలను తొలగిస్తారు. దీనినే సర్ ప్రక్రియగా కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంటోంది. దీనిని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. అయితే.. దీనిపై వివాదాలు కూడా ముసురుకున్నాయి. ప్రతిపక్షాల అనుకూల ఓట్లను తొలగించడమే లక్ష్యంగా సర్ ప్రక్రియను చేపడుతున్నారన్న విమర్శలు వున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాలు.. ఓట్ చోరీ అంటూ నిరసనలు చేపట్టింది.
అయితే. ఈ ఆందోళనలు, నిరసనల వెనుక ఉన్న వాస్తవాలు ఏంటి? సర్ ప్రక్రియ నిజంగానే ఓటర్ల హ క్కులను తుడిచిపెడుతోందా? అనేది సందేహమే. దీంతో ఈ ప్రక్రియ నిరాఘాటంగా ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీలోనూ సర్ ప్రక్రియను చేపట్టాలని.. టీడీపీ కోరుతుండడం గమనార్హం. ప్రస్తుతం వచ్చే ఏడాదిఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఈ ప్రక్రియను చేపట్టారు. తద్వారా.. ఎన్నికల ప్రక్రియకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నది ఎన్నికల సంఘం వాదన.
ఏపీలో సర్ ప్రక్రియను చేపట్టడం ద్వారా.. వచ్చే ఏడాది జరగనున్న స్థానిక ఎన్నికలకు సంబంధించి ముందస్తుగా మార్పులు-చేర్పులకు అవకాశం ఉంటుందన్నది టీడీపీ వ్యూహం. అందుకే… సర్ ప్రక్రియను త్వరగా చేపట్టేలా.. పార్లమెంటులో ఈ విషయాన్ని చర్చిస్తామని ఆ పార్టీ ఎంపీ లావు చెప్పుకొచ్చారు. దీనిపై పార్లమెంటులో ప్రత్యేకంగా ప్రస్తావిస్తామన్నారు. ఇక, ఈ విషయంపై ప్రతిపక్ష వైసీపీ ఎలాంటి గళం వినిపించడం లేదు. సర్పై వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
This post was last modified on December 1, 2025 11:08 am
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…
కెజిఎఫ్ లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ సాధించాక హీరో యష్ వేగంగా సినిమాలు చేయాలని తొందరపడలేదు. కోరుకుంటే స్టార్…