Political News

బంగ్లాదేశ్‌కు దిక్కెవరు?

బంగ్లాదేశ్ రాజకీయాలు ఇప్పుడు మరింత చిక్కుల్లో పడ్డాయి. దేశాన్ని ఇన్నాళ్లు శాసించిన ఇద్దరు ఉక్కు మహిళలు ఇప్పుడు సీన్లో లేకపోవడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. ఒకవైపు మాజీ ప్రధాని షేక్ హసీనా ఇండియాలో తలదాచుకుంటే, మరోవైపు ఆమె ప్రధాన ప్రత్యర్థి, మాజీ ప్రధాని ఖలీదా జియా చావుబతుకుల మధ్య పోరాడుతున్నారు. ఈ ఇద్దరు లేని బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

మాజీ ప్రధాని, BNP చీఫ్ ఖలీదా జియా ఆరోగ్యం విషమించడంతో ఢాకాలోని ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. 80 ఏళ్ల వయసులో ఆమెకు గుండె, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సోకిందని, పరిస్థితి చాలా సీరియస్‌గా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఆమె కొడుకు, రాజకీయ వారసుడు తారిఖ్ రెహమాన్ లండన్‌లో ఉన్నారు. ఆయన తిరిగొస్తారా లేదా అనేది సస్పెన్స్‌గా మారింది. అయితే ఆయన రాకకు ఎలాంటి అడ్డంకులు లేవని తాత్కాలిక ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

మరోవైపు షేక్ హసీనా పరిస్థితి మరింత దారుణంగా ఉంది. విద్యార్థుల ఉద్యమంతో దేశం వదిలి పారిపోయిన ఆమె, ప్రస్తుతం ఇండియాలో ప్రవాస జీవితం గడుపుతున్నారు. ఇటీవల ఢాకాలోని ఒక ట్రిబ్యునల్ ఆమెకు మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పడం సంచలనం సృష్టించింది. ఆమె కొడుకు, కూతురికి కూడా జైలు శిక్షలు పడ్డాయి. హసీనా తండ్రి, బంగ్లా జాతిపిత ముజిబుర్ రెహమాన్ ఫోటోలను కూడా కరెన్సీ నుంచి తొలగించారంటే అక్కడ ఆమె ఇమేజ్ ఎంత డ్యామేజ్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు.

ప్రస్తుతం నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం పాలన సాగిస్తోంది. ఎన్నికలను 2026 ఏప్రిల్‌లో నిర్వహించాలని వారు ప్లాన్ చేస్తుంటే, ప్రతిపక్ష BNP మాత్రం డిసెంబర్ లేదా ఫిబ్రవరిలోనే పెట్టాలని డిమాండ్ చేస్తోంది. ఈ గ్యాప్‌లో కొత్త శక్తులు పుట్టుకొస్తున్నాయి. ఉద్యమం నడిపిన విద్యార్థులు కొత్త పార్టీ పెట్టాలని చూస్తుంటే, జమాత్ ఎ ఇస్లామీ వంటి మత ఛాందసవాద పార్టీలు బలం పుంజుకుంటున్నాయి.

స్వాతంత్ర్యం వచ్చి 54 ఏళ్లు అవుతున్నా, ఇంకా తమకు సరైన స్వేచ్ఛ దొరకలేదని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు ప్రధాన పార్టీల లీడర్లు దూరమవ్వడం, కొత్త నాయకత్వంపై స్పష్టత లేకపోవడంతో బంగ్లాదేశ్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

This post was last modified on November 30, 2025 4:47 pm

Share
Show comments
Published by
Satya
Tags: bangladesh

Recent Posts

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

28 minutes ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

9 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

9 hours ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

10 hours ago

పరాశక్తి పండగ చేసుకుంటుంది కానీ

సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…

10 hours ago

చంద్రబాబు – పవన్‌లకు పని తగ్గిస్తున్న జగన్..!

వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…

13 hours ago