బంగ్లాదేశ్ రాజకీయాలు ఇప్పుడు మరింత చిక్కుల్లో పడ్డాయి. దేశాన్ని ఇన్నాళ్లు శాసించిన ఇద్దరు ఉక్కు మహిళలు ఇప్పుడు సీన్లో లేకపోవడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. ఒకవైపు మాజీ ప్రధాని షేక్ హసీనా ఇండియాలో తలదాచుకుంటే, మరోవైపు ఆమె ప్రధాన ప్రత్యర్థి, మాజీ ప్రధాని ఖలీదా జియా చావుబతుకుల మధ్య పోరాడుతున్నారు. ఈ ఇద్దరు లేని బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
మాజీ ప్రధాని, BNP చీఫ్ ఖలీదా జియా ఆరోగ్యం విషమించడంతో ఢాకాలోని ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. 80 ఏళ్ల వయసులో ఆమెకు గుండె, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సోకిందని, పరిస్థితి చాలా సీరియస్గా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఆమె కొడుకు, రాజకీయ వారసుడు తారిఖ్ రెహమాన్ లండన్లో ఉన్నారు. ఆయన తిరిగొస్తారా లేదా అనేది సస్పెన్స్గా మారింది. అయితే ఆయన రాకకు ఎలాంటి అడ్డంకులు లేవని తాత్కాలిక ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
మరోవైపు షేక్ హసీనా పరిస్థితి మరింత దారుణంగా ఉంది. విద్యార్థుల ఉద్యమంతో దేశం వదిలి పారిపోయిన ఆమె, ప్రస్తుతం ఇండియాలో ప్రవాస జీవితం గడుపుతున్నారు. ఇటీవల ఢాకాలోని ఒక ట్రిబ్యునల్ ఆమెకు మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పడం సంచలనం సృష్టించింది. ఆమె కొడుకు, కూతురికి కూడా జైలు శిక్షలు పడ్డాయి. హసీనా తండ్రి, బంగ్లా జాతిపిత ముజిబుర్ రెహమాన్ ఫోటోలను కూడా కరెన్సీ నుంచి తొలగించారంటే అక్కడ ఆమె ఇమేజ్ ఎంత డ్యామేజ్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం పాలన సాగిస్తోంది. ఎన్నికలను 2026 ఏప్రిల్లో నిర్వహించాలని వారు ప్లాన్ చేస్తుంటే, ప్రతిపక్ష BNP మాత్రం డిసెంబర్ లేదా ఫిబ్రవరిలోనే పెట్టాలని డిమాండ్ చేస్తోంది. ఈ గ్యాప్లో కొత్త శక్తులు పుట్టుకొస్తున్నాయి. ఉద్యమం నడిపిన విద్యార్థులు కొత్త పార్టీ పెట్టాలని చూస్తుంటే, జమాత్ ఎ ఇస్లామీ వంటి మత ఛాందసవాద పార్టీలు బలం పుంజుకుంటున్నాయి.
స్వాతంత్ర్యం వచ్చి 54 ఏళ్లు అవుతున్నా, ఇంకా తమకు సరైన స్వేచ్ఛ దొరకలేదని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు ప్రధాన పార్టీల లీడర్లు దూరమవ్వడం, కొత్త నాయకత్వంపై స్పష్టత లేకపోవడంతో బంగ్లాదేశ్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
This post was last modified on November 30, 2025 4:47 pm
ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ప్రతి చిత్ర బృందం కోరుకుంటుంది. ఆ దిశగా విన్నపాలు చేస్తుంది. కానీ తీరా…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో విడుదలైన…
గత ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ మిడ్ రేంజ్ మూవీ.. ఎవ్వరూ…
2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. పార్టీ బలాబలాలు,…
తన పాత పాటలు ఏవైనా కొత్త సినిమాల్లో వాడుకుంటే అస్సలు ఊరుకోవట్లేదు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా. నోటీసులు ఇస్తున్నారు.…
జాతీయ సినీ అవార్డులు ప్రకటించినపుడల్లా.. ఫలానా సినిమాకు అన్యాయం జరిగింది, ఫలానా ఆర్టిస్టుకు అవార్డు ఇవ్వాల్సింది అనే చర్చ జరగడం…