Political News

ఖర్మ కాకపోతే ఆంధ్రప్రదేశ్ కి ప్రపంచ స్థాయి రాజధాని అవసరమా?

ఐదేళ్ల జగన్ పాలనలో అమరావతి రాజధానిపై వైసీపీ నేతలు చిమ్మిన విషం అంతా ఇంతా కాదు. అమరావతిని శ్మశానంతో పోల్చడం మొదలు అమరావతిని అడవిలా మార్చడం వరకు వైసీపీ నేతలు చేయాల్సిందంతా చేశారు. అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా తీర్చిదిద్దాలన్న సీఎం చంద్రబాబు కలకు వైసీపీ నేతలు తూట్లు పొడిచారు. అధికారం పోయినా సరే..ఇప్పటికీ అమరావతిపై విషం చిమ్మడం మాత్రం మానడం లేదు. అసలు ఏపీకి ప్రపంచస్థాయి రాజధాని ఎందుకని మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

పార్టీలు, రాజకీయాలు పక్కనబెడితే…ఒక సగటు ఆంధ్రా పౌరుడిగా తమ రాష్ట్ర రాజధాని ప్రపంచ స్థాయిలో ఉండాలని కోరుకుంటారు. కోరుకోవాలి కూడా. కానీ, వైసీపీ నేత అంబటి రాంబాబు మాత్రం అలా అనుకోవడం లేదు. అసలు ఏపీకి ప్రపంచ స్థాయి రాజధాని ఎందుకు అని ఆయన ఎదురు ప్రశ్నిస్తున్నారు. అమరావతి ఓ అంతులేని కథ అంటూ అంబటి వెటకారలంగా మాట్లాడారు. రెండో దశ భూసేకరణ చేపట్టేందుకు ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అంబటి రాంబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే అంబటి వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మూడు రాజధానులంటూ మూడుముక్కలాట ఆడిన వైసీపీకి ప్రజలు 2024 ఎన్నికల్లో బుద్ధి చెప్పారని, అయినా సరే అమరావతి రాజధానిపై వైసీపీ బురదజల్లడం మానలేదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. అమరావతి రాజధాని పూర్తయితే వైసీపీకి రాబోయే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కవని, అందుకే ఇలా పసలేని వ్యాఖ్యలతో అమరావతి ఇమేజ్ ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఓ పక్క రైతులు సంతోషంగా తమ భూములను రాజధాని నిర్మాణం కోసం ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తుంటే అంబటి మాత్రం రైతులు ఇబ్బంది పడుతున్నారని వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

This post was last modified on November 29, 2025 6:58 pm

Share

Recent Posts

ఏజెంట్‌లో నన్ను చూసి అసహ్యమేసింది – అఖిల్

అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద…

2 hours ago

దేవర కలెక్షన్లపై డిస్ట్రిబ్యూటర్ క్లారిటీ

ఒక సినిమా రిలీజైన రెండు మూడేళ్ల తర్వాత కూడా దాని కలెక్షన్ల గురించి విపరీతమైన చర్చ జరగడం అరుదు. ‘దేవర’ విషయంలో ఇదే…

6 hours ago

కొత్త విద్యా మంత్రిగా జోషి… ఎవరీయన?

కేంద్ర విద్యా శాఖకు నూతన మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు.…

9 hours ago

విజయ్ బలహీనతే కిరణ్ బలం

బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయి. ఇది అలాంటిదే. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో…

9 hours ago

‘స్పైడర్ మ్యాన్’ రచ్చ చేసేలా ఉన్నాడు

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న స్పైడర్ మ్యాన్ సిరీస్ లోని కొత్త సినిమా బ్రాండ్ న్యూ డే జూలై…

10 hours ago

జగన్ లాజిక్… ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ కి లోకేష్ కు ముడి!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ కొత్త లాజిక్ మాట్లాడుతున్నారు. నైతిక బాధ్యత వహిస్తూ…

10 hours ago