Political News

ఈ ఎలివేషన్‌కి పవన్ నవ్వాలా.. ఏడవాలా?


మొన్నటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం 1,122 మంది అభ్యర్థులు పోటీ పడితే అందులో రెబల్ క్యాండిడేట్లే 415 మందట. తమ పార్టీల నుంచి టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు.. ఇండిపెండెట్లుగా బరిలోకి దిగి ఎవరికి చేయాల్సిన నష్టం వాళ్లు చేశారు. ఈ రెబల్స్ వల్ల కొన్ని చోట్ల ఫలితాలు తారుమారు అయిపోయాయి. ఐతే ఇందులో టీఆర్ఎస్ వాళ్లున్నారు. బీజేపీ వాళ్లున్నారు. అలాగే కాంగ్రెస్, టీడీపీ వాళ్లూ ఉన్నారు. కానీ ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమై, వెనక్కి తగ్గిన జనసేన నుంచి మాత్రం ఒక్కరూ రెబల్ క్యాండిడేట్ లేరట. ఈ విషయాన్ని జనసేన వాళ్లు గొప్పగా చెప్పుకుంటున్నారు.

పార్టీ ఎన్నికల బరిలో ఉంటుందని ప్రకటన చేశాక పోటీకి చెప్పుకోదగ్గ సంఖ్యలోనే అభ్యర్థులు సిద్ధమై ఉంటారు. కానీ రెండు రోజులు తిరిగే సరికి పవన్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. జనసేన పోటీలో ఉండదని, తమ పార్టీ మద్దతుదారులంతా బీజేపీకి అండగా నిలవాలని అధినేత పిలుపునిచ్చాడు.

పవన్ మాట మార్చడంపై సోషల్ మీడియాలో వ్యతిరేకత వ్యక్తమైంది. జనసేన మద్దతుదారులే ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఈ ట్రెండ్ చూశాక జనసేన నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ వాళ్లలో కొందరు ఎన్నికల బరిలో ఉంటారేమో అనుకున్నారు. కానీ కట్ చేస్తే ఆ పార్టీ నుంచి రెబల్స్ ఎవరూ పోటీ పడలేదు. తమ అధినేత మాట మీద గౌరవంతోనే జనసేన నుంచి ఎవరూ రెబల్స్‌గా మారలేదని పవన్ గురించి ఎలివేషన్లు ఇస్తున్నారు కొందరు. కానీ ఇది చూసి నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి జనసైనికులది.

మామూలుగా ఓ పార్టీకి ఒక చోట బలం ఉంటే.. టికెట్ ఆశించి భంగపడ్డ వాళ్లు తమ పార్టీ పోటీకే దూరమైతే ఊరుకోరు. తమ అసహనాన్ని ఏదో రకంగా చూపిస్తారు. బయట ఆందోళనలు చేస్తారు. లేదంటే రెబల్స్ అవుతారు. తమ అధినేత మాటను ధిక్కరించి పోటీలో నిలుస్తారు. అలాంటిదేమీ జరగలేదంటే కేవలం అధినేత మీద గౌరవంగానే అనుకోవాలా.. లేక ఆ పార్టీకి ఇక్కడ బలం లేకపోవడం వల్ల, పోటీ చేసి గెలుస్తామన్న ధీమా ఉన్న నాయకులు లేకపోవడం వల్ల ఎవరూ బరిలో లేరనుకోవాలా?

This post was last modified on December 6, 2020 12:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తమిళులు లేపుతున్నారు.. తెలుగోళ్లు లైట్ అంటున్నారు

గత కొన్నేళ్లలో తమిళ సినిమాల క్వాలిటీ బాగా పడిపోయిన మాట వాస్తవం. ఒకప్పుడు దేశంలోనే అత్యుత్తమ సినిమాలు తీసే ఇండస్ట్రీగా…

25 minutes ago

పౌరసన్మాన సభలో బాలయ్య జోరు హుషారు

కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రెసిడెంట్ చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారం అందుకున్న బాలకృష్ణకు పౌరసన్మాన సభ ఘనంగా జరిగింది. వేలాదిగా…

2 hours ago

అదిరిపోయేలా ‘మ‌హానాడు’.. ఈ ద‌ఫా మార్పు ఇదే!

టీడీపీకి ప్రాణ స‌మాన‌మైన కార్య‌క్ర‌మం ఏదైనా ఉంటే.. అది మ‌హానాడే. దివంగ‌త ముఖ్య‌మంత్రి, తెలుగువారిఅన్న‌గారు ఎన్టీఆర్ పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని..…

3 hours ago

శుభం దర్శకుడి కాన్ఫిడెన్స్ వేరే లెవల్

మే 9 విడుదల కాబోతున్న సినిమాల్లో  సమంత నిర్మించిన శుభం ఉంది. ప్రొడ్యూసర్ గా వ్యవహరించడమే కాదు ఒక క్యామియో…

4 hours ago

అఫిషియ‌ల్ : ప్ర‌ధాని వ‌స్తున్నారు.. ఏర్పాట్లు చేసుకోండి!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోడీ రెండు రోజుల కింద‌టే అమ‌రావ‌తి రాజ‌ధాని ప్రాంతంలో ప‌ర్య‌టించారు. రాజ‌ధాని ప‌నుల‌కు పునః ప్రారంభం కూడా…

5 hours ago

స్వాగ్… వంద కోట్లు పెట్టినా రానంత‌

యూత్ ఫుల్ కామెడీ ఎంట‌ర్టైన‌ర్ల‌తో యువ ప్రేక్ష‌కుల్లో మంచి ఫాలోయింగే సంపాదించాడు శ్రీ విష్ణు. గ‌త ఏడాది అత‌డి నుంచి…

6 hours ago