అమరావతిపై చాలా ఆశలు ఉన్నాయి, అలా చేయలేమని చంద్రబాబు అన్నారు. ఏపీ రాజధాని అమరావతిపై ప్రజలకు పెద్ద ఆశలు ఉన్నాయని తెలిపారు. దీనిని కేవలం 29 గ్రామాల పరిమితిలో మాత్రమే ఉంచలేమని చెప్పారు. అలాంటి ఆలోచనలు ఉంటే వాటిని విరమించుకోవాలని సూచించారు. అమరావతిని కేవలం మునిసిపాలిటీగా ప్రజలు కోరుకోవడం లేదన్నారు. దీనిని మహానగరంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రైతులు భూములు ఇచ్చిన 29 గ్రామాలతో పాటు మరిన్ని ఎకరాలను ల్యాండ్ పూలింగ్లో తీసుకుంటామని చెప్పారు.
గురువారం సాయంత్రం అమరావతి కోసం భూములు ఇచ్చిన 80 మందికిపైగా రైతులతో చంద్రబాబు సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారికి సీఎం ధన్యవాదాలు తెలిపారు. రాజధానిని ప్రగతి శీల నగరంగా, క్వాంటమ్ వ్యాలీ కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్టు చెప్పారు. ఇది కేవలం రాజధానిమాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయి నగరంగా నిర్మించనున్నట్టు చెప్పారు. అందుకే మరో 45 వేల ఎకరాల భూమిని సమీకరించాలని నిర్ణయించామని తెలిపారు. దీనికి రైతులు సంపూర్ణంగా సహకరించాలన్నారు.
అయితే కొందరు చెబుతున్న మాటలతో రైతులు తప్పు దారిలో నడుస్తున్నారని, అది సరైన దారి కాదని చెప్పారు. హైదరాబాద్ తరహాలో రాజధానిని అభివృద్ధి చేయాలంటే 29 గ్రామాల పరిమితి సరిపోదన్నారు. వాస్తవానికి హైదరాబాద్ కూడా సరిగా సరిపోవడం లేదని, అందుకే ఆ నగరాన్ని కూడా విస్తరించుతున్నారని చెప్పారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విస్తరణ ప్రక్రియను చేపడుతున్నామని తెలిపారు. అమరావతి విషయంలో కూడా ఇదే చేస్తానన్నారు. ప్రజలకు అవసరమైనదే చేస్తున్నానని చెప్పారు.
రైతులు సహకరించాలని సీఎం చంద్రబాబు కోరారు. ఎవరో చెప్పిన మాటలు వినొద్దన్నారు. భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఇప్పటికే త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశామని, రైతుల సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు. ఆర్థికేతర సమస్యలను తక్షణమే పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని, ఆర్థిక సమస్యలనూ అత్యంత వేగంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. రైతులు చేసిన త్యాగాన్ని తరతరాల పాటు గుర్తు పెట్టుకుంటామని చంద్రబాబు అన్నారు.
2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…
ఈ రోజుల్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు రిలీజ్రోజు ఇచ్చిన థియేటర్లను జనంతో నింపడమే కష్టమైపోతోంది. జనం థియేటర్లకు రావడం…
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్రభుత్వం ఏం చేయాలన్నా.. మరో…
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…