అమరావతిపై చాలా ఆశలు ఉన్నాయి, అలా చేయలేమని చంద్రబాబు అన్నారు. ఏపీ రాజధాని అమరావతిపై ప్రజలకు పెద్ద ఆశలు ఉన్నాయని తెలిపారు. దీనిని కేవలం 29 గ్రామాల పరిమితిలో మాత్రమే ఉంచలేమని చెప్పారు. అలాంటి ఆలోచనలు ఉంటే వాటిని విరమించుకోవాలని సూచించారు. అమరావతిని కేవలం మునిసిపాలిటీగా ప్రజలు కోరుకోవడం లేదన్నారు. దీనిని మహానగరంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రైతులు భూములు ఇచ్చిన 29 గ్రామాలతో పాటు మరిన్ని ఎకరాలను ల్యాండ్ పూలింగ్లో తీసుకుంటామని చెప్పారు.
గురువారం సాయంత్రం అమరావతి కోసం భూములు ఇచ్చిన 80 మందికిపైగా రైతులతో చంద్రబాబు సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారికి సీఎం ధన్యవాదాలు తెలిపారు. రాజధానిని ప్రగతి శీల నగరంగా, క్వాంటమ్ వ్యాలీ కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్టు చెప్పారు. ఇది కేవలం రాజధానిమాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయి నగరంగా నిర్మించనున్నట్టు చెప్పారు. అందుకే మరో 45 వేల ఎకరాల భూమిని సమీకరించాలని నిర్ణయించామని తెలిపారు. దీనికి రైతులు సంపూర్ణంగా సహకరించాలన్నారు.
అయితే కొందరు చెబుతున్న మాటలతో రైతులు తప్పు దారిలో నడుస్తున్నారని, అది సరైన దారి కాదని చెప్పారు. హైదరాబాద్ తరహాలో రాజధానిని అభివృద్ధి చేయాలంటే 29 గ్రామాల పరిమితి సరిపోదన్నారు. వాస్తవానికి హైదరాబాద్ కూడా సరిగా సరిపోవడం లేదని, అందుకే ఆ నగరాన్ని కూడా విస్తరించుతున్నారని చెప్పారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విస్తరణ ప్రక్రియను చేపడుతున్నామని తెలిపారు. అమరావతి విషయంలో కూడా ఇదే చేస్తానన్నారు. ప్రజలకు అవసరమైనదే చేస్తున్నానని చెప్పారు.
రైతులు సహకరించాలని సీఎం చంద్రబాబు కోరారు. ఎవరో చెప్పిన మాటలు వినొద్దన్నారు. భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఇప్పటికే త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశామని, రైతుల సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు. ఆర్థికేతర సమస్యలను తక్షణమే పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని, ఆర్థిక సమస్యలనూ అత్యంత వేగంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. రైతులు చేసిన త్యాగాన్ని తరతరాల పాటు గుర్తు పెట్టుకుంటామని చంద్రబాబు అన్నారు.
This post was last modified on November 28, 2025 2:22 pm
కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వచ్చిన సినిమాగా ఆరెంజ్ మీద ఓ…
ఏడేళ్ల క్రితం వచ్చిన పలాసతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కరుణ కుమార్. తక్కువ ఖర్చులో స్టార్ క్యాస్టింగ్ లేకుండా…
అక్కినేని నాగార్జున హీరోనే కాదు.. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కూడా. ఐతే ఒకప్పటితో పోలిస్తే గత కొన్నేళ్లలో ఆయన అన్నపూర్ణ సంస్థలో…
కొన్ని సినిమాలు హీరోలకు నటులుగా మంచి పేరు తెచ్చిపెడతాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోవు. మహేష్ బాబు…
ఏపీలో మద్యం అమ్మకాల విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం…
దురంధర్ 2 ది రివెంజ్ దెబ్బకు అడివి శేష్ డెకాయిట్ వాయిదా పడింది. ఇదే రూటులో టాక్సిక్ కూడా మనసు…