Political News

పవన్ వి పిచ్చిమాటలు అంటున్న బీఆర్ఎస్ మాజీ మంత్రి

గోదావరి జిల్లాల పచ్చదనం వల్లనే రాష్ట్రం విడిపోయిందేమో అనిపిస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నవ్వుతూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తెలంగాణ నాయకుల దిష్టి తగిలి గోదావరి జిల్లాల్లో కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని పవన్ చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. ప్రస్తుతం కోనసీమలో తలలు లేని మొండెం మాదిరి కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయని పవన్ అన్నారు. ఈ క్రమంలోనే పవన్ కామెంట్లపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్పందించారు. ఈ క్రమంలోనే పవన్ పై ఆయన షాకింగ్ కామెంట్లు చేశారు.

పవన్ కళ్యాణ్‌వి తెలివితక్కువ మాటలని, మైండ్ లెస్ అని జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ దిష్టి వాళ్ళకి తాకలేదని, హైదరాబాద్ కే వారు వచ్చి పోతుంటారు కాబట్టి వారి దిష్టి తెలంగాణకు తగిలిందని అన్నారు. మెదడు వాడకుండా నోటికొచ్చినట్లు మాట్లాడే వాళ్లు కూడా ఉప ముఖ్యమంత్రులు అవుతున్నారంటూ పవన్ ను ఉద్దేశించి ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్ నుంచి కోనసీమకు ఎక్కువగా తెలంగాణ ప్రజలు వెళ్లరని..మాట్లాడేటప్పుడు నాలుకను అదుపులో పెట్టుకోకుండా, మెదడు వాడకుంటా ఈ తరహా వ్యాఖ్యలు చేయకూడదని హితవు పలికారు. కావాలంటే కోనసీమ కొబ్బరి తోటలలో దిష్టిబొమ్మలు పెట్టుకోవాలని పవన్ పై సెటైర్లు వేశారు. పవన్ వి పిచ్చి పిచ్చి మాటలని, తెలివితక్కువ మాటలని జగదీష్ రెడ్డి విమర్శించారు. మరి, జగదీష్ రెడ్డి కామెంట్లపై జనసేన నేతల స్పందన ఏవిధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

This post was last modified on November 27, 2025 4:41 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

‘పరదాల్లో పవన్’ అన్న వైసీపీ ఇప్పుడేమంటుందో?

ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…

55 minutes ago

చైతూ వివాహ వార్షికోత్సవం… దర్శకుడి పోస్టు వైరల్

ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్‌‌గా పెళ్లి చేసుకుంది ఈ…

1 hour ago

కోహ్లీ… 2,462 రోజుల సెంటిమెంట్ బ్రేక్

విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో…

1 hour ago

ఉభయకుశలోపరి… తెలంగాణ ‘అఖండ’ 2 ధరలు

ఎప్పుడూ లేనిది ఒక పెద్ద హీరోకు తెలంగాణ టికెట్ రేట్ల పెంపు బాగా ఆలస్యమయ్యింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో…

1 hour ago

అఖండ హీరోయిన్ ను ఎందుకు తీసేసారో లీక్ చేసిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’లో ప్రగ్యా జైశ్వాల్  కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.…

2 hours ago

టికెట్ రేట్లలో పెంచిన 100 రూపాయల్లో నిర్మాతకి వచ్చేది అంతేనా?

తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల ధరల పెంపు గురించి ఇటీవల పెద్ద చర్చే జరుగుతోంది. ఆల్రెడీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పెరుగుతున్న…

2 hours ago