Political News

రైతుల ఎఫెక్ట్‌: వైసీపీ కూడా దోషేనా?

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకోవాల‌నే ప్ర‌ధాన డిమాండ్‌తో ఉత్త‌రాది రాష్ట్రాల నుంచి ప్రారంభ‌మైన రైతుల ఉద్య‌మం.. ఇప్పుడు మెల్ల‌మెల్ల‌గా దేశంలోని అన్ని రాష్ట్రాల‌కూ పాకింది. కార్పొరేట్ వ్య‌వ‌సాయాన్ని ప్రోత్స‌హించే ప్ర‌ధాన లక్ష్యంతో మోడీ స‌ర్కారు తీసుకువ‌చ్చిన‌.. ఈ చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకోవాల‌నేది ఆయా రైతుల ప్ర‌ధాన డిమాండ్. అయితే .. ఇప్పుడు స‌రికొత్త అంశం తెర‌మీదికి తెచ్చింది.. మోడీ ప్ర‌భుత్వం. రైతుల సెగ త‌మ‌కు మాత్ర‌మే త‌గులు తోందని.. ప్రాంతీయ పార్టీలు.. రైతుల‌ను ఎగ‌దోస్తున్నాయ‌ని కేంద్రం భావిస్తోంది.

అంటే.. రైతుల నుంచి బీజేపీపై వ్య‌తిరేక‌త పెరుగుతోంద‌నే భావ‌న దేశంలో వ్యాపిస్తోంది. రైతు చ‌ట్టాల‌ను తీసుకువ‌చ్చిన మోడీ స‌ర్కారుకు రైతుల సెగ త‌ప్ప‌దంటూ.. పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో మోడీ స‌ర్కారు కీల‌క విష‌యాన్ని తెర‌మీదికి తెచ్చింది. పార్ల‌మెంటులో ఆయా రాష్ట్రాల ప్ర‌భుత్వాలు ఆమోదం తెలిపాయ‌ని.. ఈ చ‌ట్టాలు తీసుకురావ‌డంతో రాష్ట్రాల పాత్ర కూడా ఉంద‌ని ప్ర‌చారం చేయాల‌ని తాజాగా నిర్ణ‌యించింది. త‌మ‌కు త‌గులుతున్న రైతుల సెగ‌ను రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై కూడా నొట్టేందుకు.. రాజ‌కీయంగా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించింది.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఇదే ప్ర‌శ్న‌.. ఏపీ ప్ర‌భుత్వానికి కూడా త‌గులుతోంది. పార్ల‌మెంటులో రైతులకు సంబంధించిన కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై చ‌ర్చ జ‌రిగిన‌ప్పుడు.. వైసీపీ స‌భ్యులు వీటిని ఎంతో కొనియాడారు. ముఖ్యంగా రాజ్య‌స‌భ‌లో 10 నిముషాల‌కు పైగా ఈ వ్య‌వ‌సాయ బిల్లుల‌పై మాట్లాడిన విజ‌య‌సాయిరెడ్డి.. ప్ర‌ధానిని అభిన‌వ రైతు బాంధ‌వుడిగా ఆకాశానికి ఎత్తేశారు. పార్ల‌మెంటులోనూ మిథున్ రెడ్డి.. త‌దిత‌ర ఎంపీలు.. ఈ వ్య‌వ‌సాయ బిల్లులు దేశ రైతాంగ భ‌విత‌వ్యాన్ని కీల‌క మ‌లుపు తిప్ప‌డం ఖాయ‌మ‌ని పేర్కొన్నారు. ఇలా.. అటు పెద్ద‌ల స‌భ‌, ఇటు లోక్‌స‌భ‌లోనూ వైసీపీ మ‌ద్ద‌తు ఇచ్చింది.

దీంతో ఇప్పుడు రైతుల ఉద్య‌మం విష‌యంలో ఎదుర‌వుతున్న ప్ర‌శ్న‌ల‌కు ఏం స‌మాధానం చెబుతుంది? అనేది కీల‌క ప్ర‌శ్న‌. ఇక‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ విష‌యానికి వ‌స్తే.. ఈ బిల్లుల‌పై చ‌ర్చ జ‌రిగిన‌ప్పుడు.. అటు లోక్‌స‌భ‌, ఇటు రాజ్య‌స‌భ కు కూడా ఈ స‌భ్యులు డుమ్మా కొట్ట‌డం గ‌మ‌నార్హం. కాబ‌ట్టి… టీడీపీ ఇబ్బందుల్లో ప‌డ‌లేదు. ఎటొచ్చీ.. మోడీకి అన్ని విధాలా వంత పాడుతున్న వైసీపీనే ఇప్పుడు అడ్డంగా బుక్క‌యింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on December 5, 2020 7:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రైటర్ గారు… చేదుగా ఉన్నా నిజమే చెప్పారు

రచయిత బివిఎస్ రవి ఒక్కోసారి బాగా ఓపెన్ అయిపోతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…

30 minutes ago

పేర్ని పాకులాట‌.. ఇమేజ్ కోస‌మేనా.. ?

పేర్ని నాని. వైసీపీ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీ నుంచి త‌ప్పుకొని వారసుడు కిట్టుకు…

1 hour ago

అవును… కళ్యాణ్ రామ్ సరసన ఆమెనే

అనిల్ రావిపూడి సినిమాలో ఛాన్స్ అంటే తెలుగులో అంతకుమించిన బంపరాఫర్ లేదన్నట్లే. హిట్ మెషీన్‌గా పేరు తెచ్చుకున్న అనిల్.. ఇప్పటిదాకా…

3 hours ago

పో* వెబ్ సైట్లో ఫొటో… జాన్వి షాక్

ఏఐని వాడుకుని ఇప్పుడు హీరోయిన్ల మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలతో సోషల్ మీడియా జనాలు ఎలా రెచ్చిపోతున్నారో.. ఇంటర్నెట్ ఎంత విశృంఖలంగా తయారైందో చూస్తూనే…

4 hours ago

భోగాపురంలో ఫ్లైట్ ల్యాండ్ అయ్యేది ఎప్పుడూ?

ఏపీకి సంబంధించి అందరూ ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటి భోగాపురం ఎయిర్ పోర్టు. భారీగా చేపట్టిన ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే..…

4 hours ago

డెకాయిట్ ఛాన్సుకి అదొక్కటే అడ్డంకి

ఎంత గ్యాప్ వచ్చినా పర్లేదు క్వాలిటీనే ముఖ్యమనే హీరో అడివి శేష్ కొత్త సినిమా డెకాయిట్ ఈ శుక్రవారం ఏప్రిల్…

4 hours ago