Political News

రైతుల ఎఫెక్ట్‌: వైసీపీ కూడా దోషేనా?

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకోవాల‌నే ప్ర‌ధాన డిమాండ్‌తో ఉత్త‌రాది రాష్ట్రాల నుంచి ప్రారంభ‌మైన రైతుల ఉద్య‌మం.. ఇప్పుడు మెల్ల‌మెల్ల‌గా దేశంలోని అన్ని రాష్ట్రాల‌కూ పాకింది. కార్పొరేట్ వ్య‌వ‌సాయాన్ని ప్రోత్స‌హించే ప్ర‌ధాన లక్ష్యంతో మోడీ స‌ర్కారు తీసుకువ‌చ్చిన‌.. ఈ చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకోవాల‌నేది ఆయా రైతుల ప్ర‌ధాన డిమాండ్. అయితే .. ఇప్పుడు స‌రికొత్త అంశం తెర‌మీదికి తెచ్చింది.. మోడీ ప్ర‌భుత్వం. రైతుల సెగ త‌మ‌కు మాత్ర‌మే త‌గులు తోందని.. ప్రాంతీయ పార్టీలు.. రైతుల‌ను ఎగ‌దోస్తున్నాయ‌ని కేంద్రం భావిస్తోంది.

అంటే.. రైతుల నుంచి బీజేపీపై వ్య‌తిరేక‌త పెరుగుతోంద‌నే భావ‌న దేశంలో వ్యాపిస్తోంది. రైతు చ‌ట్టాల‌ను తీసుకువ‌చ్చిన మోడీ స‌ర్కారుకు రైతుల సెగ త‌ప్ప‌దంటూ.. పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో మోడీ స‌ర్కారు కీల‌క విష‌యాన్ని తెర‌మీదికి తెచ్చింది. పార్ల‌మెంటులో ఆయా రాష్ట్రాల ప్ర‌భుత్వాలు ఆమోదం తెలిపాయ‌ని.. ఈ చ‌ట్టాలు తీసుకురావ‌డంతో రాష్ట్రాల పాత్ర కూడా ఉంద‌ని ప్ర‌చారం చేయాల‌ని తాజాగా నిర్ణ‌యించింది. త‌మ‌కు త‌గులుతున్న రైతుల సెగ‌ను రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై కూడా నొట్టేందుకు.. రాజ‌కీయంగా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించింది.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఇదే ప్ర‌శ్న‌.. ఏపీ ప్ర‌భుత్వానికి కూడా త‌గులుతోంది. పార్ల‌మెంటులో రైతులకు సంబంధించిన కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై చ‌ర్చ జ‌రిగిన‌ప్పుడు.. వైసీపీ స‌భ్యులు వీటిని ఎంతో కొనియాడారు. ముఖ్యంగా రాజ్య‌స‌భ‌లో 10 నిముషాల‌కు పైగా ఈ వ్య‌వ‌సాయ బిల్లుల‌పై మాట్లాడిన విజ‌య‌సాయిరెడ్డి.. ప్ర‌ధానిని అభిన‌వ రైతు బాంధ‌వుడిగా ఆకాశానికి ఎత్తేశారు. పార్ల‌మెంటులోనూ మిథున్ రెడ్డి.. త‌దిత‌ర ఎంపీలు.. ఈ వ్య‌వ‌సాయ బిల్లులు దేశ రైతాంగ భ‌విత‌వ్యాన్ని కీల‌క మ‌లుపు తిప్ప‌డం ఖాయ‌మ‌ని పేర్కొన్నారు. ఇలా.. అటు పెద్ద‌ల స‌భ‌, ఇటు లోక్‌స‌భ‌లోనూ వైసీపీ మ‌ద్ద‌తు ఇచ్చింది.

దీంతో ఇప్పుడు రైతుల ఉద్య‌మం విష‌యంలో ఎదుర‌వుతున్న ప్ర‌శ్న‌ల‌కు ఏం స‌మాధానం చెబుతుంది? అనేది కీల‌క ప్ర‌శ్న‌. ఇక‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ విష‌యానికి వ‌స్తే.. ఈ బిల్లుల‌పై చ‌ర్చ జ‌రిగిన‌ప్పుడు.. అటు లోక్‌స‌భ‌, ఇటు రాజ్య‌స‌భ కు కూడా ఈ స‌భ్యులు డుమ్మా కొట్ట‌డం గ‌మ‌నార్హం. కాబ‌ట్టి… టీడీపీ ఇబ్బందుల్లో ప‌డ‌లేదు. ఎటొచ్చీ.. మోడీకి అన్ని విధాలా వంత పాడుతున్న వైసీపీనే ఇప్పుడు అడ్డంగా బుక్క‌యింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Satya

Recent Posts

పట్టపగలే కారు చీకట్లోకి బికనీర్!

సాంకేతికంగా మనిషి ఎన్నో అద్భుతాలను సృష్టించాడు. వాటిని తన జీవన విధానంలో భాగం చేసుకున్నాడు. సుఖమయ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే…

49 minutes ago

వైసీపీ నేతలకు షాకిచ్చిన లేడీ ఆఫీసర్

ఏపీలోని కూటమి సర్కారు ఇటీవలే నిర్వహించిన మెగా డీఎస్సీపై విపక్ష వైసీపీ బారీ అవినీతి ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.…

2 hours ago

రెండు బెనిఫిట్ షోలు సేఫా రిస్కా

పెద్ది ప్రీమియర్ల గురించి ఇండస్ట్రీ వర్గాల్లో, అభిమానుల్లో ఎడతెగని చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో క్లారిటీ వచ్చేసింది. రాత్రి 8…

3 hours ago

తేడా అంటూనే డబుల్ సెంచరీ కొట్టింది

దృశ్యం 3 ప్రపంచవ్యాప్తంగా రెండు వందల కోట్ల గ్రాస్ దాటేసింది. కేవలం పది రోజుల్లోపే ఈ ఫీట్ సాధించడం అనూహ్యం.…

3 hours ago

పవన్ అంతే… ఏదైనా పూర్తిగా తెలియాల్సిందే!

జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజకీయాలకు కొత్తే. సినిమా నటుడిగా సుదీర్ఘ కాలం పాటు కొనసాగుతున్న…

3 hours ago

దాసరి స్మృతి వనం… కదిలిపోయిన మనోజ్

తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప దర్శకుల్లో ఒకరు దాసరి నారాయణరావు. అగ్ర దర్శకుడిగా ఉంటూ 150 సినిమాలు తీయడం…

5 hours ago