Political News

రైతుల ఎఫెక్ట్‌: వైసీపీ కూడా దోషేనా?

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకోవాల‌నే ప్ర‌ధాన డిమాండ్‌తో ఉత్త‌రాది రాష్ట్రాల నుంచి ప్రారంభ‌మైన రైతుల ఉద్య‌మం.. ఇప్పుడు మెల్ల‌మెల్ల‌గా దేశంలోని అన్ని రాష్ట్రాల‌కూ పాకింది. కార్పొరేట్ వ్య‌వ‌సాయాన్ని ప్రోత్స‌హించే ప్ర‌ధాన లక్ష్యంతో మోడీ స‌ర్కారు తీసుకువ‌చ్చిన‌.. ఈ చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకోవాల‌నేది ఆయా రైతుల ప్ర‌ధాన డిమాండ్. అయితే .. ఇప్పుడు స‌రికొత్త అంశం తెర‌మీదికి తెచ్చింది.. మోడీ ప్ర‌భుత్వం. రైతుల సెగ త‌మ‌కు మాత్ర‌మే త‌గులు తోందని.. ప్రాంతీయ పార్టీలు.. రైతుల‌ను ఎగ‌దోస్తున్నాయ‌ని కేంద్రం భావిస్తోంది.

అంటే.. రైతుల నుంచి బీజేపీపై వ్య‌తిరేక‌త పెరుగుతోంద‌నే భావ‌న దేశంలో వ్యాపిస్తోంది. రైతు చ‌ట్టాల‌ను తీసుకువ‌చ్చిన మోడీ స‌ర్కారుకు రైతుల సెగ త‌ప్ప‌దంటూ.. పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో మోడీ స‌ర్కారు కీల‌క విష‌యాన్ని తెర‌మీదికి తెచ్చింది. పార్ల‌మెంటులో ఆయా రాష్ట్రాల ప్ర‌భుత్వాలు ఆమోదం తెలిపాయ‌ని.. ఈ చ‌ట్టాలు తీసుకురావ‌డంతో రాష్ట్రాల పాత్ర కూడా ఉంద‌ని ప్ర‌చారం చేయాల‌ని తాజాగా నిర్ణ‌యించింది. త‌మ‌కు త‌గులుతున్న రైతుల సెగ‌ను రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై కూడా నొట్టేందుకు.. రాజ‌కీయంగా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించింది.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఇదే ప్ర‌శ్న‌.. ఏపీ ప్ర‌భుత్వానికి కూడా త‌గులుతోంది. పార్ల‌మెంటులో రైతులకు సంబంధించిన కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై చ‌ర్చ జ‌రిగిన‌ప్పుడు.. వైసీపీ స‌భ్యులు వీటిని ఎంతో కొనియాడారు. ముఖ్యంగా రాజ్య‌స‌భ‌లో 10 నిముషాల‌కు పైగా ఈ వ్య‌వ‌సాయ బిల్లుల‌పై మాట్లాడిన విజ‌య‌సాయిరెడ్డి.. ప్ర‌ధానిని అభిన‌వ రైతు బాంధ‌వుడిగా ఆకాశానికి ఎత్తేశారు. పార్ల‌మెంటులోనూ మిథున్ రెడ్డి.. త‌దిత‌ర ఎంపీలు.. ఈ వ్య‌వ‌సాయ బిల్లులు దేశ రైతాంగ భ‌విత‌వ్యాన్ని కీల‌క మ‌లుపు తిప్ప‌డం ఖాయ‌మ‌ని పేర్కొన్నారు. ఇలా.. అటు పెద్ద‌ల స‌భ‌, ఇటు లోక్‌స‌భ‌లోనూ వైసీపీ మ‌ద్ద‌తు ఇచ్చింది.

దీంతో ఇప్పుడు రైతుల ఉద్య‌మం విష‌యంలో ఎదుర‌వుతున్న ప్ర‌శ్న‌ల‌కు ఏం స‌మాధానం చెబుతుంది? అనేది కీల‌క ప్ర‌శ్న‌. ఇక‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ విష‌యానికి వ‌స్తే.. ఈ బిల్లుల‌పై చ‌ర్చ జ‌రిగిన‌ప్పుడు.. అటు లోక్‌స‌భ‌, ఇటు రాజ్య‌స‌భ కు కూడా ఈ స‌భ్యులు డుమ్మా కొట్ట‌డం గ‌మ‌నార్హం. కాబ‌ట్టి… టీడీపీ ఇబ్బందుల్లో ప‌డ‌లేదు. ఎటొచ్చీ.. మోడీకి అన్ని విధాలా వంత పాడుతున్న వైసీపీనే ఇప్పుడు అడ్డంగా బుక్క‌యింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on December 5, 2020 7:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

గేమ్ కోసం ఫోన్ ఇవ్వలేదని ముగ్గురు అక్కాచెల్లెళ్ళు…

​ఘజియాబాద్‌లోని భారత్ సిటీ సొసైటీలో గుండెలు పిండేసే విషాదం చోటుచేసుకుంది. ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసలైన ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు.. తల్లిదండ్రులు…

1 hour ago

అల్లరోడి ఆల్కహాల్ అడ్రస్ ఎక్కడ

అల్లరి నరేష్ కొత్త సినిమా ఆల్కహాల్ టీజర్ వచ్చి అయిదు నెలలు దాటేసింది. దాంట్లో ప్రకటించిన విడుదల తేదీ జనవరి…

2 hours ago

మామతో దళపతి… మాజీ అల్లుడితో ఎమోషనల్ డ్రామా

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కేవలం హీరోయిజం ఉన్న పాత్రలే చేస్తానని ఎప్పుడూ కట్టుబడరు. అందుకే నాలుగు…

2 hours ago

దిల్ రాజుకు, నాగవంశీకి చెడిందా?

టాలీవుడ్లో మంచి అనుబంధం ఉన్న అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు, నాగవంశీలది ఒకటి. ఇద్దరికి బిజినెస్ పరంగా గట్టి బంధమే…

3 hours ago

చిరుపై విమర్శకులకు లావణ్య కౌంటర్

ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి కుటుంబాన్ని సంతోషంలో ముంచెత్తే పరిణామం చోటుచేసుకుంది. చిరు తనయుడు రామ్ చరణ్ కవల పిల్లలకు తండ్రి…

3 hours ago

రెండు షాట్ల కోసం మహేష్ ఆరు నెలల కష్టం

రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు.. ఈ వార్త నిజం కావడానికి దశాబ్దంన్నర పాటు ఎదురు చూడాల్సి వచ్చింది అభిమానులు. వీరి…

3 hours ago