Political News

సరిహద్దులు మారొచ్చు.. రాజ్ నాథ్ సింగ్ సంచలనం

సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. భారతదేశంలో భాగం కాని సింధ్ ప్రాంతం భవిష్యత్తులో భారత్ లో భాగమవుతుందన్న ఆయన మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. సింధ్ ప్రాంతం ప్రస్తుతం పాకిస్థాన్ లో భాగమన్న సంగతి తెలిసిందే. సింధ్ ప్రాంతంలోని వారిని పాకిస్థాన్.. విదేశీయుల మాదిరి చూస్తుందని.. భారతప్రజలు మాత్రం వారిని విదేశీయుల మాదిరి కాకుండా సొంత మనుషుల్లా పరిగణిస్తున్నట్లు చెప్పారు.

హిందువులు సింధు నదిని పవిత్రంగా భావించేవారని.. ఇప్పుడు ఆ ప్రాంతం భారత్ భాగం కానప్పటికీ.. నాగరికత ప్రకారం ఎల్లప్పుడు మన దేశంలో భాగంగా ఉంటుందని పేర్కొన్నారు. “ఈ ప్రాంతం నేడు భారత్ లో భాగం కాకపోయినా.. ఇక్కడి నాగరికత వారసత్వంతో ఇప్పటికి ముడిపడి ఉంది. సరిహద్దులు మారొచ్చు. 1947లో దేశ విభజన అనంతరం పాక్ లో భాగమైన సింధ్.. భవిష్యత్తులో తిరిగి భారత్ లో కలవొచ్చు” అని వ్యాఖ్యానించారు. సింధీ హిందువులని.. ముఖ్యంగా తన తరం వారు సింధ్ ను భారత్ నుంచి వేరుచేయటాన్ని ఇప్పటికీ అంగీకరించలేదని బీజేపీ అగ్రనేత ఎల్ కే ఆడ్వాణీ రాసిన ఒక పుస్తకంలో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు.

“సరిహద్దులు మారొచ్చు. ఎవరికి తెలుసు. భవిష్యత్తులో సింధ్ మళ్లీ మన దేశంలో కలవొచ్చు. సింధీ ప్రజలు ఎక్కడున్నా.. ఎల్లప్పుడు వాళ్లు మనవాళ్లే” అంటూ రాజ్ నాథ్ నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఢిల్లీలో జరిగిన సింధీ సమాజం కార్యక్రమంలో పాల్గొన్న రాజ్ నాథ్ ప్రసంగించిన సందర్భంగా ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

This post was last modified on November 24, 2025 12:56 pm

Share

Recent Posts

బిర్యానీ సంపూ ఏడిపిస్తాడా?

ది ప్యారడైజ్.. దసరా లాంటి రా అండ్ రస్టిక్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న కాంబినేషన్ కావడంతో దీనిపై అంచనాలు…

22 minutes ago

బరువు తగ్గే ఔషధం వేసుకుంటే జుట్టు ఊడిపోతుంది

అదేంటో గానీ... ఉన్న రోగానికి మందేస్తే... ఆ రోగం సంగతేమో గానీ... కొత్త రోగం వచ్చి పడుతోంది. ఈ తరహా…

42 minutes ago

సల్మాన్‌ను ఎలా ఒప్పించారబ్బా?

మన నిర్మాతలు ఈ మధ్య బౌండరీలు దాటేసి, వేరే ఇండస్ట్రీల సూపర్ స్టార్లతో సినిమాలు చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్…

1 hour ago

అమ్మాయిల ప్రైవేటు పార్ట్స్ మీద కొడితే సారి చెప్పరా

జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఆందోళన విరమించినప్పటికీ అది సృష్టించిన తుఫాన్ కొనసాగుతుంది. సద్దుమణిగిందనుకున్న విషయాన్ని శుక్రవారం…

2 hours ago

హ్యాట్రిక్ ముద్ర కోసం ఫ్లాపుని మర్చిపోవాలా

చెన్నై లవ్ స్టోరీ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లలో యూనిట్ సభ్యులు కొందరు వాడిన మాట ఒకటుంది. అదే కిరణ్ అబ్బవరం హ్యాట్రిక్…

2 hours ago

నాగార్జున అసలు పాయింట్ మిస్సయ్యారు

ఆ మధ్య జరిగిన లెనిన్ సక్సెస్ మీట్ లో కింగ్ నాగార్జున ఒక మాట అన్నారు. ది ఒడిస్సి లాంటి…

3 hours ago