Political News

సరిహద్దులు మారొచ్చు.. రాజ్ నాథ్ సింగ్ సంచలనం

సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. భారతదేశంలో భాగం కాని సింధ్ ప్రాంతం భవిష్యత్తులో భారత్ లో భాగమవుతుందన్న ఆయన మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. సింధ్ ప్రాంతం ప్రస్తుతం పాకిస్థాన్ లో భాగమన్న సంగతి తెలిసిందే. సింధ్ ప్రాంతంలోని వారిని పాకిస్థాన్.. విదేశీయుల మాదిరి చూస్తుందని.. భారతప్రజలు మాత్రం వారిని విదేశీయుల మాదిరి కాకుండా సొంత మనుషుల్లా పరిగణిస్తున్నట్లు చెప్పారు.

హిందువులు సింధు నదిని పవిత్రంగా భావించేవారని.. ఇప్పుడు ఆ ప్రాంతం భారత్ భాగం కానప్పటికీ.. నాగరికత ప్రకారం ఎల్లప్పుడు మన దేశంలో భాగంగా ఉంటుందని పేర్కొన్నారు. “ఈ ప్రాంతం నేడు భారత్ లో భాగం కాకపోయినా.. ఇక్కడి నాగరికత వారసత్వంతో ఇప్పటికి ముడిపడి ఉంది. సరిహద్దులు మారొచ్చు. 1947లో దేశ విభజన అనంతరం పాక్ లో భాగమైన సింధ్.. భవిష్యత్తులో తిరిగి భారత్ లో కలవొచ్చు” అని వ్యాఖ్యానించారు. సింధీ హిందువులని.. ముఖ్యంగా తన తరం వారు సింధ్ ను భారత్ నుంచి వేరుచేయటాన్ని ఇప్పటికీ అంగీకరించలేదని బీజేపీ అగ్రనేత ఎల్ కే ఆడ్వాణీ రాసిన ఒక పుస్తకంలో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు.

“సరిహద్దులు మారొచ్చు. ఎవరికి తెలుసు. భవిష్యత్తులో సింధ్ మళ్లీ మన దేశంలో కలవొచ్చు. సింధీ ప్రజలు ఎక్కడున్నా.. ఎల్లప్పుడు వాళ్లు మనవాళ్లే” అంటూ రాజ్ నాథ్ నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఢిల్లీలో జరిగిన సింధీ సమాజం కార్యక్రమంలో పాల్గొన్న రాజ్ నాథ్ ప్రసంగించిన సందర్భంగా ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

This post was last modified on November 24, 2025 12:56 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

#AskKavitha.. కవిత కొత్త పంథా!

బీఆర్ ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన కవిత.. సొంత పార్టీ పెట్టుకునే ఆలోచనలో ఉన్నారు. దీనికి సంబంధించిన…

7 minutes ago

దురంధర్ దర్శకుడిది భలే స్టోరీ గురు

ఆదిత్య ధర్.. ఇప్పుడు బాలీవుడ్లోనే కాక, దేశవ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీల్లోనూ చర్చనీయాంశం అవుతున్న పేరిది. బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్లలో ఒకటిగా…

28 minutes ago

8 గంటల పని… దీపికకు వ్యతిరేకంగా భర్త

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే స్పిరిట్, కల్కి-2 చిత్రాల నుంచి తప్పుకోవడం ఆ మధ్య చర్చనీయాంశంగా మారిన సంగతి…

1 hour ago

సీఎం వచ్చినా తగ్గేదేలే అంటున్న ఉద్యమకారులు

హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణను తెలంగాణ ఉద్యమకారులు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఎస్పీ బాలు తెలంగాణ…

3 hours ago

మోదీ, రేవంత్, లోకేష్ కు కూడా తప్పని ఢిల్లీ తిప్పలు

ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్మేయడంతో విమాన, రైలు రవాణా తీవ్రంగా ప్రభావితమైంది. విజిబిలిటీ భారీగా తగ్గిపోవడంతో పలు విమానాలను దారి…

3 hours ago

ఒక్క ఓటుతో కోడల్ని గెలిపించిన ‘అమెరికా మామ’

తెలంగాణ పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ఫలితాలు నిన్న వెలువడిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఎన్నికల ఫలితాల…

3 hours ago