Political News

మంత్రి లోకేష్… వెళ్ళిన ప్రతి చోట ప్రజాదర్బార్

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రి నారా లోకేష్ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ప్రజాదర్బార్ ను ఏర్పాటు చేశారు. మొదట్లో మంగళగిరిలోని తన నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించిన లోకేష్ ఆ తర్వాత తాను ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ స్థానికులకు సమయం కేటాయిస్తూ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ప్రజలకు, కార్యకర్తలకు చేరువగా ఉండేందుకు లోకేష్ తీసుకు వచ్చిన ఈ ప్రజాదర్బార్ కు కార్యకర్తలు తరలి వస్తున్నారు. దీర్ఘకాలంగా తమ సమస్యలు పరిష్కారానికి నోచుకోని ప్రజలు కూడా ప్రజాదర్బార్ కు వచ్చి లోకేష్ కు వినతి పత్రాలను సమర్పిస్తున్నారు. అయితే వెంటనే అధికారులకు వాటిని అందించి సమస్యలకు పరిష్కారం దొరికేలా నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు.

తాజాగా ఈ రోజు పుట్టపర్తిలోని తన క్యాంప్ సైట్ లో ఉదయం 74వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. మంత్రి లోకేష్ ను కలిసేందుకు సామాన్య ప్రజలు, టీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు. ప్రతిఒక్కరినీ ఆప్యాయంగా పలకరించిన మంత్రి నారా లోకేష్… ఆయా సమస్యలపై వారి నుంచి వినతులు స్వీకరించారు. వైసీపీ హయాంలో అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ప్రోద్బలంతో తనపై అక్రమ కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేశారని, విచారించి అక్రమ కేసుల ఎత్తివేతకు చర్యలు తీసుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం మలకవేముల గ్రామానికి చెందిన డి.లోకేష్ విజ్ఞప్తి చేశారు. 

సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి గ్రామంలో తాను కొనుగోలు చేసిన రెండున్నర సెంట్ల ఇంటి స్థలాన్ని గత వైసీపీ ప్రభుత్వ అండతో హనుమంతరెడ్డి ఆక్రమించారని, విచారణ జరిపి తగిన న్యాయం చేయాలని ముదిగుబ్బ మండలం మాకర్లకుంటపల్లికి చెందిన టి.నాగభూషణం మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఎంఏ బీఈడీ చదివిన తనకు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని ఎండోమెంట్ కార్యాలయంలో ఉద్యోగ అవకాశం కల్పించాలని పుట్టపర్తికి చెందిన ఎన్.జయలక్ష్మి విజ్ఞప్తి చేశారు. ఆయా వినతులను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.

1 / 8

This post was last modified on November 23, 2025 2:58 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Lokesh

Recent Posts

కండల వీరుడి సినిమాకు ‘చైనా’ కష్టాలు

యుద్ధ నేపధ్యాలు, చారిత్రాత్మక సంఘటనలు ఆధారంగా తీసే సినిమాలకు మినిస్ట్రీ అఫ్ డిఫెన్స్ అంగీకారం తప్పనిసరి. లేదంటే సెన్సార్ అభ్యంతరాలు…

42 minutes ago

నదిలో 11,000 లీటర్ల పాలు.. ప్రకృతికి మంచిదేనా?

మధ్యప్రదేశ్ లోని సెహోర్ జిల్లాలో జరిగిన ఓ ఆధ్యాత్మిక వేడుక ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీసింది. 21 రోజుల పాటు…

2 hours ago

మీడియాలోకి సాయిరెడ్డి.. పక్షపాతం లేకుండా…!

అవును, నిజమే.. విజయ్ సాయి రెడ్డి మీడియా రంగంలోకి వస్తున్నారట.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్లో వెల్లడించారు. త్వరలో…

2 hours ago

చిరంజీవి చుట్టూ డబుల్ అయోమయం

మన శంకరవరప్రసాద్ గారు రిలీజై మూడు నెలలు దాటేసింది. ఇప్పటిదాకా చిరంజీవి కొత్త సినిమాల అప్డేట్స్ లేవు. అదిగో ఇదిగో…

3 hours ago

శేష్ కెపాసిటీ ఏంటో అర్థమయ్యిందిగా

టాలీవుడ్ ప్రామిసింగ్ హీరోల్లో అడివి శేష్ పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నిర్మాతలు రెడీగా ఉన్నా వేగంగా సినిమాలు చేసేందుకు పరుగులు…

3 hours ago

పెన్షన్లు ఇవ్వలేని ప్రభుత్వానికి ఉచితాలు ఎందుకు

ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు పెన్షన్లు చెల్లించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద…

4 hours ago