Political News

జూబ్లీ ఎఫెక్ట్: తెలంగాణ బీజేపీలో చీలిక?

ఒక ఉప ఎన్నిక అనేక మార్పులకు దారి తీస్తోంది. పార్టీలు ఏవైనా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత కాంగ్రెస్‌లో అసమ్మతి స్వరాలు తగ్గాయి. సీఎం రేవంత్ సహా పార్టీ అధిష్ఠానంపై ఉన్న అసంతృప్తి కూడా తగ్గుముఖం పట్టింది. మరోవైపు బీఆర్‌ఎస్‌లోనూ మార్పులు కనిపిస్తున్నాయి. పార్టీ వ్యూహాలు మార్చుకోవాలన్న వాదన బలంగా వినిపిస్తోంది. బీఆర్‌ఎస్‌ను మరింత పటిష్ఠంగా ముందుకు తీసుకువెళ్లాలంటే వ్యూహాత్మకంగా ఆలోచించాల్సిందే అన్న చర్చ జరుగుతోంది.

ఇదిలావుంటే, ఇదే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీజేపీలో చీలిక దిశగా అడుగులు వేసేలా చేస్తోందన్న చర్చ సాగుతోంది. కొందరు నేతల మధ్య వ్యక్తిగత వివాదాలు, విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కీలక నాయకుడు ఘోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు.

ఆ తర్వాత కిషన్ రెడ్డిని కేంద్రంగా చేసుకుని వివాదాలు మరింత పెరుగుతున్నాయి. పైకి ద్వితీయ శ్రేణి నాయకులు మౌనంగా ఉన్నప్పటికీ, అంతర్గత చర్చల్లో కిషన్ రెడ్డి వ్యవహార శైలిపై నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

అదేవిధంగా మాజీ మంత్రి, ఎంపీ ఈటల రాజేందర్ మరియు కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్య ఉన్న విభేదాలు జూబ్లీహిల్స్ ఫలితం తర్వాత మరింత తీవ్రమయ్యాయి. బండి సంజయ్ ఇటీవల మాట్లాడుతూ తాను హిందువునేనని, తన ప్రాణం ఉన్నంతవరకు హిందూత్వమే తన మార్గమని అన్నారు. దీనికి ఈటల ఘాటు కౌంటర్ ఇచ్చారు. తత్వం తెలంగాణలో పనిచేయదని, బరాబర్ హిందుత్వ అజెండాతో ప్రతి ఎన్నికలో పోటీ చేయడం సరికాదని చెప్పారు.

అంతేకాదు, కేవలం హిందుత్వ అజెండానే జూబ్లీహిల్స్‌లో బీజేపీని దెబ్బ కొట్టిందని, అందుకే డిపాజిట్ కూడా రాలేదని ఈటల అంటున్నారు. నేరుగా బండి పేరును ప్రస్తావిస్తూ వారి మత ప్రచారం మరియు అతివాద ధోరణి వల్లే జూబ్లీహిల్స్ పోయిందని వ్యాఖ్యానించారు. అభివృద్ధిని అజెండా చేసుకుని ఉంటే ఫలితం బాగుండేదని అన్నారు.

దీంతో బీజేపీలో మతపరమైన అజెండాను పట్టుకునే నేతలు మరియు దానికి తటస్థంగా ఉండే నేతల మధ్య స్పష్టమైన చీలిక కనిపిస్తున్నదన్న వాదన బలపడుతోంది.

This post was last modified on November 20, 2025 9:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…

42 minutes ago

స‌మంత బంగారం కోసం రాజు గారు వ‌స్తారా?

ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళంలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ద‌శాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన క‌థానాయిక స‌మంత‌. కానీ కొన్నేళ్లుగా…

2 hours ago

ఆ యూట్యూబర్లకు ‘పరాభవం’ తప్పదట

సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…

2 hours ago

క‌విత పార్టీకి న్యాయ చిక్కులు… ఏం జరిగింది?

బీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత త‌న…

4 hours ago

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

4 hours ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

4 hours ago