Political News

ఈసారి పెద్దిరెడ్డికి కష్టమే

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గం అంటేనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పెట్టని కోటగా ఉన్న విషయం తెలిసిందే. అయితే రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. నాయకుల వ్యవహారశైలి పట్ల ప్రజల్లోనూ అసంతృప్తి పెరుగుతూ ఉంటుంది. దీనిని ఎప్పటికప్పుడు తగ్గించుకుంటూ ప్రజల నాడిని పట్టుకునే దిశగా నాయకులు అడుగులు వేయాలి. అయితే ఇప్పుడు ఎన్నికలు జరిగి 17 మాసాలైనా ఎమ్మెల్యేగా గెలిచిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజల మధ్యకు రాలేకపోతున్నారు.

కనీసం ఆయన ప్రజల సమస్యలను కూడా పట్టించుకోవడం లేదన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడు ఏదైనా సమస్య ఉంటే వాస్తవానికి ఎమ్మెల్యే కార్యాలయానికి జనాలు వెళతారు. సమస్యలు చెప్పుకుంటారు. అర్జీలు సమర్పిస్తారు. కానీ ఇప్పుడు పుంగనూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కార్యాలయం తాళాలు వేసి ఉంది. ఇప్పటివరకు ప్రజల్లోకి కూడా రాలేకపోయారు. పైగా వివిధ కేసుల్లో చిక్కుకుని పెద్దిరెడ్డి కుటుంబం ఇబ్బంది పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్న టాక్ వినిపిస్తోంది.

దీనిని గమనించిన బీసీవై అధినేత బోడె రామచంద్ర యాదవ్ ప్రజలకు చేరువవుతున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. నియోజకవర్గంలో తరచుగా పర్యటిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల నాటికి బోడె రామచంద్ర యాదవ్ పుంజుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే జరిగితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హవాకు వచ్చే ఎన్నికల్లో బ్రేక్ పడడం ఖాయం అన్నది విశ్లేషకులు చెబుతున్న మాట. అయితే అంత దూరం రాదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజల్లోకి వస్తారని వైసీపీ వర్గాలు చెబుతుండడం గమనార్హం.

కానీ స్థానికంగా ఉన్న రాజకీయాలను గమనిస్తే దీనికి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. పెద్దిరెడ్డి బయటకు రాకపోవడం వైసీపీ పరంగా పెద్దగా యాక్టివ్ పాలిటిక్స్ లేకపోవడంతో పాటు నాయకుల చుట్టూ కేసులు ముసురుకున్న నేపధ్యంలో కేడర్ లో పెద్దగా ఉత్సాహం కనిపించడం లేదు. దీంతో ఈ గ్యాప్ ను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు బీసీవై పార్టీ రాజకీయంగా అడుగులు ముమ్మరం చేసింది. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్న బోడే పుంగనూరు విజయాన్ని కీలకంగా భావిస్తున్నారు. ఈ క్రంలో ఆయనకు సానుకూల వాతావరణం నెలకొందన్న చర్చ సాగుతోంది.

This post was last modified on November 20, 2025 10:19 pm

Share

Recent Posts

అప్పుడు కుటుంబ పేర్లు… ఇప్పుడు వీరుల పేర్లు

భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ విమానాశ్రయాన్ని జాతికి…

47 minutes ago

హాలీవుడ్ సినిమాలకు మళ్ళీ మంచి రోజులు

ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…

3 hours ago

గండాన్ని దాటిన చెన్నై లవ్ స్టోరీ

గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…

3 hours ago

మోదీ కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగాలని ఉంది: నటుడు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…

4 hours ago

కనకరాజు సీమలో కొరియన్ దెయ్యం

బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…

4 hours ago

“కొబ్బరికాయ కొట్టాం… గుమ్మడి కాయ కట్టాం”

ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…

5 hours ago