నదుల అనుసంధానంపై ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఎన్ని ఇబ్బందులు సృష్టించినా.. నదుల అనుసంధానం ఆగేది లేదన్నారు. వాస్తవానికి కొన్నాళ్ల కిందట బనకచర్ల ప్రాజెక్టును చంద్రబాబు తలపోశారు. అయితే.. దీనికి తెలంగాణ నుంచిపెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. దీంతో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రణాళికలో మార్పులు చేసుకున్నారు. అయితే.. ఈ విషయాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం తప్పుబట్టింది. “చంద్రబాబు వేరే రూపంలో బనకచర్ల చేపడుతున్నారు” అని తెలంగాణ మంత్రి వ్యాఖ్యానించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో నదుల అనుసంధానంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. తాజాగా కడప జిల్లా కమలాపురంలో పర్యటించిన చంద్రబాబు అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ విడతలో రైతులకు రూ.5000 చొప్పున రాష్ట్రం, రూ.2000 చొప్పున పీఎం-కిసాన్ కింద కేంద్రం ఇస్తున్నాయి. ఈ పథకాన్ని ప్రారంభించి.. రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసిన చంద్రబాబు అనంతరం మాట్లాడుతూ.. నదుల అనుసంధానం ఆగబోదని తేల్చి చెప్పారు.
రాయల సీమలోని ప్రతి ఎకరాకు నీరు అందిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. అయితే.. రాష్ట్రంలో సాగు విధానంలో మార్పు లు రావాల్సిన అవసరం ఉందని చంద్రబాబు తెలిపారు. ప్రతి విషయంలోనూ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందని.. రైతులు మాత్రమే టెక్నాలజీకి దూరంగా ఉంటున్నారని.. ఇకపై అలా ఉండబోదన్నారు. రైతులు కూడా టెక్నాలజీని అందుకునేలా విధానాలు రూపొందిస్తామని చంద్రబాబు తెలిపారు. వ్యవసాయంలో ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ముఖ్యంగా నేచర్ పామింగ్(ప్రకృతి సేద్యం) చాలా ముఖ్యమని సీఎం వివరించారు.
రైతులు అభివృద్ధి కోసం..ఐదు కీలక సూత్రాలను తీసుకువచ్చామన్నారు. వాటిని అమలు చేస్తే.. అన్నదాతల జీవితాల్లో సమూల మార్పులు వస్తాయని చంద్రబాబు వెల్లడించారు. ఈ సందర్భంగా తన చిన్ననాటి రోజులను సీఎం గుర్తు చేసుకున్నారు. తన తండ్రి వ్యవసాయం చేసుకునేవారని.. తాను కూడా సాగులో ఆయనకు సాయం చేసేవాడినని చెప్పారు. అధునాతన విధానాలను అందిపుచ్చుకుంటేనే రైతులకు మేలు జరుగుతుందని.. సాగులో అనేక పద్ధతులు మారుతున్నాయని.. వాటిని అందిపుచ్చుకుని రైతుల ఆదాయం పెరిగేలా చూస్తామన్నారు.
This post was last modified on November 19, 2025 9:37 pm
ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా దశాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన కథానాయిక సమంత. కానీ కొన్నేళ్లుగా…
సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత తన…
బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…
బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…