నదుల అనుసంధానంపై ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఎన్ని ఇబ్బందులు సృష్టించినా.. నదుల అనుసంధానం ఆగేది లేదన్నారు. వాస్తవానికి కొన్నాళ్ల కిందట బనకచర్ల ప్రాజెక్టును చంద్రబాబు తలపోశారు. అయితే.. దీనికి తెలంగాణ నుంచిపెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. దీంతో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రణాళికలో మార్పులు చేసుకున్నారు. అయితే.. ఈ విషయాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం తప్పుబట్టింది. “చంద్రబాబు వేరే రూపంలో బనకచర్ల చేపడుతున్నారు” అని తెలంగాణ మంత్రి వ్యాఖ్యానించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో నదుల అనుసంధానంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. తాజాగా కడప జిల్లా కమలాపురంలో పర్యటించిన చంద్రబాబు అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ విడతలో రైతులకు రూ.5000 చొప్పున రాష్ట్రం, రూ.2000 చొప్పున పీఎం-కిసాన్ కింద కేంద్రం ఇస్తున్నాయి. ఈ పథకాన్ని ప్రారంభించి.. రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసిన చంద్రబాబు అనంతరం మాట్లాడుతూ.. నదుల అనుసంధానం ఆగబోదని తేల్చి చెప్పారు.
రాయల సీమలోని ప్రతి ఎకరాకు నీరు అందిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. అయితే.. రాష్ట్రంలో సాగు విధానంలో మార్పు లు రావాల్సిన అవసరం ఉందని చంద్రబాబు తెలిపారు. ప్రతి విషయంలోనూ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందని.. రైతులు మాత్రమే టెక్నాలజీకి దూరంగా ఉంటున్నారని.. ఇకపై అలా ఉండబోదన్నారు. రైతులు కూడా టెక్నాలజీని అందుకునేలా విధానాలు రూపొందిస్తామని చంద్రబాబు తెలిపారు. వ్యవసాయంలో ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ముఖ్యంగా నేచర్ పామింగ్(ప్రకృతి సేద్యం) చాలా ముఖ్యమని సీఎం వివరించారు.
రైతులు అభివృద్ధి కోసం..ఐదు కీలక సూత్రాలను తీసుకువచ్చామన్నారు. వాటిని అమలు చేస్తే.. అన్నదాతల జీవితాల్లో సమూల మార్పులు వస్తాయని చంద్రబాబు వెల్లడించారు. ఈ సందర్భంగా తన చిన్ననాటి రోజులను సీఎం గుర్తు చేసుకున్నారు. తన తండ్రి వ్యవసాయం చేసుకునేవారని.. తాను కూడా సాగులో ఆయనకు సాయం చేసేవాడినని చెప్పారు. అధునాతన విధానాలను అందిపుచ్చుకుంటేనే రైతులకు మేలు జరుగుతుందని.. సాగులో అనేక పద్ధతులు మారుతున్నాయని.. వాటిని అందిపుచ్చుకుని రైతుల ఆదాయం పెరిగేలా చూస్తామన్నారు.
This post was last modified on November 19, 2025 9:37 pm
ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి వెళ్లేందుకు మనమైతే...ఎన్నెన్నో మార్గాలు అవలంబిస్తూ ఉంటాం. అయితే ఈ కొత్త మాయగాడు మాత్రం ట్రాఫిక్ పోలీసుల కళ్ల ముందే మాయ…
భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోస్లే ఇక లేరు. అనారోగ్యం కారణంగా ఇటీవల ముంబయిలోని బ్రీచ్…
తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…
షూటింగ్ ఆలస్యాలు, రిలీజ్ వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 26 విడుదల తేదీని లెనిన్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.…
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నాయకురాలు.. గిరిజన నేత సీతక్క(అనసూయ) ఒక్కసారిగా బ్లాస్ట్ అ య్యారు. `చెప్పుతెగుద్ది` అని…
పల్నాడు జిల్లా మాచర్ల పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పోలీసు అధికారుల అవినీతి అక్రమాలు వరుసగా బయటపడుతున్నాయి. ఇప్పటికే మాచర్ల…