Political News

ఏమిటో ఈ మార్పు… పిలిచి మరీ ఓదార్పు!

ఓటమి తర్వాత ఓఏడాది పాటు మాజీ సీఎం వైఎస్ జగన్ బెంగళూరుకే పరిమితం అయి అప్పుడప్పుడూ తాడేపల్లికి వచ్చి వెళ్లారు. ఆ తర్వాత అడపా దడపా పరామర్శల పేరుతో పర్యటనలు చేపట్టారు. ఆ సమయంలోనే ప్రజలను కలుస్తున్నారు. అయితే రెండు మూడు రోజులుగా తాడేపల్లిలో తనను కలిసేందుకు ప్రజలకు అవకాశం ఇస్తున్నారు. ప్రజలకు దూరంగా ఉంటున్నారనే అపవాదును తుడిచి వేసేందుకు ఆయన ఈ కార్యక్రమం చేపట్టినట్లు పలువురు భావిస్తున్నారు.

వైఎస్ జగన్ లో ఈ మధ్య వచ్చిన ఈ మార్పును ఆసక్తిగా గమనిస్తున్నారు. ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ పేరుతో సమయం ఉన్నప్పుడల్లా ప్రజలను కలుస్తున్నారు. ఆయనకు తమ సమస్యలు వినిపించేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. రెండు రోజుల నుంచి ప్రజలు జగన్ ను కలవడం.. లోకేష్ ప్రజాదర్బార్ ను గుర్తు చేస్తుందని విశ్లేషకులు ఆంటున్నారు. 

జగన్ జనం.. ఈ బంధం విడదీయలేని అంటూ వైసీపీ అనుకూల మీడియా హోరెత్తిస్తోంది. ప్రజలు జగన్ ను తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో కలిసిన ఫోటోలను షేర్ చేస్తోంది. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయానికి పోటెత్తిన జనం అంటూ వైసీపీ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. దివ్యాంగులతో పాటు కార్యకర్తలు, రైతులు, ప్రజల సమస్యల్ని వైయస్ జగన్ సావధానంగా విని.. బాధితులకి భరోసా ఇస్తున్నారంటూ పేర్కొంది.

జగన్ అధికారంలో ఉన్నపుడు ఇలా ప్రజలను కలిసిన సందర్భం లేదు. జనంలోకి వెళ్ళినా పరదాలు కట్టుకుని మరీ వెళ్లారనే విమర్శలను కూడా ఎదుర్కొన్నారు. ఈ మధ్య కాలంలో పులివెందులలో తనను ప్రజలు కలిసేందుకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు తాడేపల్లి ప్రజలను కలుస్తున్నారు. దీంతో జగన్ నేలపైకి దిగి వచ్చారా అని టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.

This post was last modified on November 18, 2025 9:53 am

Share
Show comments
Published by
Kumar
Tags: JaganYCP

Recent Posts

ఆరెంజ్ ఎన్నిసార్లు చూస్తారయ్యా

కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వచ్చిన సినిమాగా ఆరెంజ్ మీద ఓ…

50 minutes ago

పలాస దర్శకుడికి విషమ పరీక్ష

ఏడేళ్ల క్రితం వచ్చిన పలాసతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కరుణ కుమార్. తక్కువ ఖర్చులో స్టార్ క్యాస్టింగ్ లేకుండా…

3 hours ago

నిజాం గడ్డపై ‘కింగ్’ కన్ను

అక్కినేని నాగార్జున హీరోనే కాదు.. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కూడా. ఐతే ఒకప్పటితో పోలిస్తే గత కొన్నేళ్లలో ఆయన అన్నపూర్ణ సంస్థలో…

5 hours ago

మహేష్ కోసం వాయిస్ మార్చమన్న కృష్ణ

కొన్ని సినిమాలు హీరోలకు నటులుగా మంచి పేరు తెచ్చిపెడతాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోవు. మహేష్ బాబు…

10 hours ago

వైసీపీలా చెడ్డపేరు తెచ్చుకోవద్దు: పవన్ హెచ్చరిక

ఏపీలో మద్యం అమ్మకాల విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం…

11 hours ago

టాక్సిక్ ఎందుకు భయపడటం లేదు

దురంధర్ 2 ది రివెంజ్ దెబ్బకు అడివి శేష్ డెకాయిట్ వాయిదా పడింది. ఇదే రూటులో టాక్సిక్ కూడా మనసు…

12 hours ago