Political News

హైకోర్టును కూడా వదలని హ్యాకర్లు.. ఏం జరిగింది

vహ్యాకింగ్ మోసాలకు అంతు లేకుండా పోయింది. ప్రభుత్వ వెబ్ సైట్లు, వ్యక్తుల సోషియల్ మీడియా ఖాతాలను కూడా హ్యాక్ చేస్తున్నారు. కీలక సమాచారాన్ని తస్కరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఆ సమాచారాన్ని డిలీట్ చేసిన ఘటనలు కూడా కనిపిస్తున్నాయి. ఇటీవల ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ సోషియల్ మీడియా ఖాతాను హ్యాక్ చేసిన దుండగులు కీలక సమాచారాన్ని తస్కరించడం తో పాటు కొన్ని ఫైళ్లను కూడా ధ్వంసం చేశారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.

తాజాగా ఇప్పుడు తెలంగాణ హైకోర్టు వెబ్ సైట్ ను కొందరు హ్యాక్ చేశారు. ఈ విషయాన్ని గుర్తించే సరికి కీలక తీర్పుల ఫైళ్లు ధ్వంసం అయినట్టు సమాచారం. శనివారం వెబ్ సైట్ ఓపెన్ చేయగానే ఆన్ లైన్ బెట్టింగు సైట్లు దర్శనమిచ్చాయి. దీంతో ఉలిక్కిపడ్డ సిబ్బంది వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వారు మరొకసారి వెబ్ సైట్ ఆన్ చేసి శుక్రవారం కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల కాపీలను డౌన్ లోడ్ చేసేందుకు ప్రయత్నించగా మళ్లీ బెట్టింగు సైట్ల తో పాటు ఇతర అసభ్యకర సైట్లు కూడా కనిపించాయి.

దీంతో సమాచారాన్ని అత్యంత రహస్యంగా సైబర్ పోలీసులకు చేరవేశారు. వారు రంగంలోకి దిగి సైట్ ను ఓపెన్ చేసి ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాగా ఇతర దేశాలకు చెందిన ముఠాలు ఇటీవలి కాలంలో ప్రభుత్వానికి చెందిన సైట్లను హ్యాక్ చేస్తున్నాయి. అదేవిధంగా కేంద్ర మంత్రుల సోషియల్ మీడియా ఖాతాలను కూడా స్తంభింప చేస్తున్నారు. ఈ పరిణామాలపై కేంద్రం మరియు రాష్ట్రాలు దృష్టి పెట్టినా సమస్య మాత్రం కొనసాగుతూనే ఉంది. నేరస్తులు కాంబోడియా వంటి దేశాల్లో ఉండడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది.

This post was last modified on November 16, 2025 9:36 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

18 seconds ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

3 minutes ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

1 hour ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

1 hour ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

5 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

5 hours ago