దేశానికి ఏపీ గేట్ వే(ప్రధాన ద్వారం)గా మారుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. పెట్టుబడులు పెట్టేవారికి ఏపీ స్వర్గధామంగా మారుతుందని చెప్పారు. విశాఖలో శుక్రవారం ప్రారంభమైన పెట్టుబడుల సదస్సును ఉద్దేశించి సీఎం చంద్రబాబు సుదీర్ఘంగా ప్రసంగించారు. రాష్ట్రంలోను, దేశంలోనూ సమర్థవంతమైన నాయకత్వం ఉందన్న చంద్రబాబు.. పెట్టుబడులను ఆహ్వానించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందున్నాయని తెలిపారు. కాగా.. ఈ సదస్సుకు 72 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు.
విశాఖలో అనేక అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. కేంద్రం కూడా ఇటీవల విశాఖను సురక్షిత నగరంగా ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తున్నామని.. ఎక్కడా నిర్లక్ష్యం లేకుండా సింగిల్ విండో ద్వారా అనుమతులు మంజూరు చేస్తున్నట్టు వివరించారు. 2047లోగా భారత్ నంబర్ వన్ ఎనానమీ అవుతుందన్న ఆయన.. ఏపీ కూడా విజన్ 2047ను అందిపుచ్చుకుందని వివరించారు.
ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూసే పరిస్థితి వచ్చిందని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇంటికో పారిశ్రామిక వేత్త నినాదంతో ఏపీ ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం వివరించారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా.. పనిలోనూ చేసి చూపిస్తున్నామని తెలిపారు. ఏపీకి స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఎలక్ట్రానిక్స్ సిటీ, క్వాంటమ్ వ్యాలీ, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ వస్తున్నాయన్నారు. వచ్చే ఏడాది జనవరి నెలలోనే అమరావతిలో క్వాంటం వ్యాలీకి శ్రీకారం చుడుతున్నట్టు వివరించారు.
ఇక, పునరుత్పాదక ఇంధన వనరులైన సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీలో ఏపీ ముందుందన్నారు. స్థానిక ఉత్పత్తులకు గ్లోబల్ మార్కెటింగ్ కల్పిస్తున్నామని తెలిపారు. అరకు కాఫీ, కొండపల్లి బొమ్మలు, పొందూరు ఖద్దరు వంటివి అంతర్జాతీయంగా ఖ్యాతి పొందుతున్నాయని వివరించారు. వ్యాపారం చేసేవారిని ప్రోత్సహిస్తున్నామని సీఎం చెప్పారు. మరో రెండేళ్లలో డ్రోన్ ట్యాక్సీలు కూడా వస్తాయన్నారు. ఆక్వా ఉత్పత్తులకు ఏపీ అగ్రగామిగా ఉందని చంద్రబాబు తెలిపారు.
రాష్ట్రంలో 2024 నుంచి ఇప్పటి వరకు పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేలా 27 పాలసీలు తెచ్చామని సీఎం చంద్రబాబు తెలిపారు. పెట్టుబడిదారులకు ఎస్క్రో అకౌంట్ ఇస్తామని భారీ ప్రకటన చేశారు. మరో మూడేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనేది తమ లక్ష్యమన్న ఆయన.. వచ్చే పదేళ్లలో ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు రావాలనేదే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని వివరించారు. రాష్ట్రాభివృద్ధిలో పర్యాటకరంగానిది కీలకపాత్ర కానుందని తెలిపారు.
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…