జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకే ఎడ్జ్ ఉన్నట్లుగా అనేక సర్వే సంస్థలు వెల్లడించాయి. ఎన్నికల పోలింగ్ ముగిసిన 11వ తేదీ సాయంత్రం అనేక సర్వేలు వచ్చాయి. వీటిలో నాగన్న సర్వే నుంచి స్మార్ట్ పోల్స్, పబ్లిక్ పల్స్, చాణక్య స్ట్రాటజీ, పీపుల్స్ పల్స్ సహా అనేక సర్వేలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాయి.
అయితే ఒకే ఒక్క కేకే సర్వే మాత్రం ఈ విషయంలో బీఆర్ ఎస్కు పట్ట కట్టింది. వాస్తవానికి 2024లో జరిగిన ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సాధిస్తుందని, వైఎస్ఆర్సీపీ కేవలం 10 స్థానాలకు పరిమితం అవుతుందని కేకే సర్వే ముందే చెప్పింది. అచ్చంగా అప్పట్లో అలాగే జరుగడంతో కేకే సర్వేకు మంచి ప్రాధాన్యం పెరిగింది.
ఆ తర్వాత జరిగిన ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికల్లో కూడా కేకే సర్వే ఫలితాలు నిజమయ్యాయి. దీంతో తాజాగా జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కేకే సర్వేకు ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది. కేకే సర్వే పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. ఇందులో బీఆర్ ఎస్ 4 శాతం ఓట్ల మెజారిటీతో గెలుస్తుందని తుది ఫలితాల్లో పేర్కొంది. మొదట్లో మాత్రం బీఆర్ ఎస్కు 14 నుంచి 16 శాతం ఓట్ల తేడా వస్తుందని చర్చ సాగింది.
కానీ తాజా ఫలితాల్లో బీఆర్ ఎస్ భారీగా వెనుకబడింది. ఏకంగా 16 వేల ఓట్ల తేడాతో పాటు ప్రతి రౌండ్లోనూ వెనుకపడింది. మరోవైపు బీఆర్ ఎస్ పార్టీ కూడా తమ అంతర్గత సర్వేలపై నమ్మకం పెట్టుకుంది. సెంటిమెంట్ గోరింటాకు మాదిరిగా పండుతుందని భావించింది. దీంతో కొంత జోష్ వచ్చినా ఎక్కడా తడబాటు చూపకుండా ముందుకు సాగింది.
కానీ ప్రజల నాడి అనూహ్యంగా యు టర్న్ తీసుకుని బీఆర్ ఎస్కు భారీ ఇబ్బందిని తీసుకువచ్చింది. మొత్తం చూస్తే మెజారిటీ సర్వేలు కాంగ్రెస్కు అనుకూలంగానే నిలిచాయి.
This post was last modified on November 14, 2025 3:04 pm
గత ఏడాది విడుదల కావాల్సిన సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు కొత్త…
ప్రభాస్ ఫౌజీ మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పనక్కర్లేదు. రాజా సాబ్ డిజాస్టర్ తర్వాత ఈ ఏడాది ఆ…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. కాకినాడ లో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న ఆయనకు తీవ్ర…
తమిళనాడు సీఎం విజయ్, సినీ నటి త్రిషల మధ్య రిలేషన్ షిప్ గురించి రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్న సంగతి…
బాలీవుడ్ ఖాన్ల ప్రభంజనంలో తనకంటూ ఒక ఉనికిని దక్కించుకున్న హీరో ఇమ్రాన్ హష్మీ. ఒకప్పుడు మంచి హిట్లతో ముద్దుల వీరుడిగా…
గుంటూరులోని తూర్పు, పడమర నియోజకవర్గాల్లో వైసీపీ తన ప్రభావం, ప్రాభవం కూడా కోల్పోయింది. రెండున్నరేళ్ల కాలంలో పార్టీ ఘోరంగా దెబ్బతిందన్న…