Political News

కేకే సర్వే ఫెయిల్.. ఏం జరిగింది?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకే ఎడ్జ్ ఉన్నట్లుగా అనేక సర్వే సంస్థలు వెల్లడించాయి. ఎన్నికల పోలింగ్ ముగిసిన 11వ తేదీ సాయంత్రం అనేక సర్వేలు వచ్చాయి. వీటిలో నాగన్న సర్వే నుంచి స్మార్ట్ పోల్స్, పబ్లిక్ పల్స్, చాణక్య స్ట్రాటజీ, పీపుల్స్ పల్స్ సహా అనేక సర్వేలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాయి.

అయితే ఒకే ఒక్క కేకే సర్వే మాత్రం ఈ విషయంలో బీఆర్ ఎస్‌కు పట్ట కట్టింది. వాస్తవానికి 2024లో జరిగిన ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సాధిస్తుందని, వైఎస్ఆర్‌సీపీ కేవలం 10 స్థానాలకు పరిమితం అవుతుందని కేకే సర్వే ముందే చెప్పింది. అచ్చంగా అప్పట్లో అలాగే జరుగడంతో కేకే సర్వేకు మంచి ప్రాధాన్యం పెరిగింది.

ఆ తర్వాత జరిగిన ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికల్లో కూడా కేకే సర్వే ఫలితాలు నిజమయ్యాయి. దీంతో తాజాగా జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కేకే సర్వేకు ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది. కేకే సర్వే పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. ఇందులో బీఆర్ ఎస్ 4 శాతం ఓట్ల మెజారిటీతో గెలుస్తుందని తుది ఫలితాల్లో పేర్కొంది. మొదట్లో మాత్రం బీఆర్ ఎస్‌కు 14 నుంచి 16 శాతం ఓట్ల తేడా వస్తుందని చర్చ సాగింది.

కానీ తాజా ఫలితాల్లో బీఆర్ ఎస్ భారీగా వెనుకబడింది. ఏకంగా 16 వేల ఓట్ల తేడాతో పాటు ప్రతి రౌండ్‌లోనూ వెనుకపడింది. మరోవైపు బీఆర్ ఎస్ పార్టీ కూడా తమ అంతర్గత సర్వేలపై నమ్మకం పెట్టుకుంది. సెంటిమెంట్ గోరింటాకు మాదిరిగా పండుతుందని భావించింది. దీంతో కొంత జోష్ వచ్చినా ఎక్కడా తడబాటు చూపకుండా ముందుకు సాగింది.

కానీ ప్రజల నాడి అనూహ్యంగా యు టర్న్ తీసుకుని బీఆర్ ఎస్‌కు భారీ ఇబ్బందిని తీసుకువచ్చింది. మొత్తం చూస్తే మెజారిటీ సర్వేలు కాంగ్రెస్‌కు అనుకూలంగానే నిలిచాయి.

This post was last modified on November 14, 2025 3:04 pm

Share
Show comments
Published by
Satya
Tags: KK survey

Recent Posts

ఆ యూట్యూబర్లకు ‘పరాభవం’ తప్పదట

సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…

33 minutes ago

క‌విత పార్టీకి న్యాయ చిక్కులు… ఏం జరిగింది?

బీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత త‌న…

2 hours ago

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

3 hours ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

3 hours ago

ఊపిరి పీల్చుకుంటున్న తెలుగు థియేటర్లు

ఫిబ్రవరితో మొదలుపెట్టి మార్చి రెండో వారం దాకా పట్టుమని వారం రోజులు హౌస్ ఫుల్ చేసే సినిమా లేక గగ్గోలు…

4 hours ago

డిజిటల్ మోసాల బారిన పడినోళ్లకు పరిహారం, కానీ…

కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…

5 hours ago