Political News

టీడీపీ సానుకూల ఓటు ఎవ‌రికి ప‌డింది: ఇదే చ‌ర్చ‌!

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక లో టిడిపి అనుకూల ఓటు ఎవరికి పడింది? అసలు ఎవరికి పడాలి? ఇదీ ఇప్పుడు ఆసక్తికర చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఈ ఉప ఎన్నికల్లో టిడిపి పోటీలో లేదు. పైగా ఎవరికి అనుకూలంగా ఎవరికి వ్యతిరేకంగా వ్యవహరిస్తామని కూడా ఆ పార్టీ చెప్పలేదు. ఆది నుంచి తటస్థంగానే వ్యవహరిస్తామని పార్టీ అధినేత సీఎం చంద్రబాబు ప్రకటించారు. అయినప్పటికీ అటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఇటు అధికారపక్షం కాంగ్రెస్ టిడిపి సానుకూల ఓటు బ్యాంకు ను తమ వైపు తిప్పుకునే దిశగా అడుగులు వేశారన్నది వాస్తవం.

పలు ఇంటర్వ్యూలలో బీఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రి కేటీఆర్ టిడిపికి అనుకూలంగా మాట్లాడటం అదేవిధంగా దివంగత ఎన్టీఆర్ పేరు త‌న‌కు పెట్టారని చెప్పి సెంటిమెంట్లను రగిలించే ప్రయత్నం చేశారు. ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా టిడిపి అనుకూల ఓటు బ్యాంకు ను తమ వైపు తిప్పుకునే దిశగా అడుగులు వేసింది. దాదాపు 12 నుంచి 16% మేరకు టిడిపి అనుకూల ఓటు బ్యాంకు ఉందన్నది రాజకీయ వర్గాలు చెబుతున్న మాట.

గతంలో మాగంటి గోపీనాథ్ టిడిపి నుంచి విజయం కూడా దక్కించుకున్న విషయం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. అయితే తర్వాత టిడిపి ఏపీకే పరిమితం కావడం గ‌త ఎన్నిక‌ల్లోనూ టిడిపి ఎవ‌రినీ నిలబెట్టకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో టిడిపికి బలంగా ఉన్న ఓటు బ్యాంకు ఎవరికి పడింది ఎవరు విజయం దక్కించుకునే దిశగా ఈ ఓటు బ్యాంకు సహకరించింది అన్నది రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చగా మారింది. గెలుపు, ఓటమి అనే విష‌యాల‌ను పక్కన పెడితే ఒక పార్టీకి అనుకూలంగా ఉన్న ఓటు బ్యాంకు ను తమ వైపు తిప్పుకునే దిశగా అడుగులు వేయడంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించిందన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

చివరి నిమిషంలో లేవనెత్తిన అనేక అంశాలు టిడిపి సానుకూల ఓటు బ్యాంకుపై ప్రభావం చూపించాయని వారు చెబుతున్నారు. ఉదాహరణకు చంద్రబాబును ఏపీలో అరెస్టు చేసినప్పుడు అక్కడికి వెళ్లి ధర్నాలు నిరసనలు చేసుకోవాలని అప్పటి మంత్రిగా ఉన్న కేటీఆర్ వ్యాఖ్యానించిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రస్తావించారు. దీనిని ప్రచారంలోకి కూడా తీసుకువెళ్లారు. ఇది బాగా ఫలించింది అన్నది టిడిపి శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. అదే సమయంలో టిడిపి ఓటు బ్యాంకుతో పాటు సెటిలర్లు కూడా కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నారన్నది కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాట.

ఈ రెండు విషయాలు ఎన్నికల్లో బాగా ప్రచారం జరిగి టిడిపి ఓటు కాంగ్రెస్ కి పడిందన్నది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ బీఆర్ఎస్ కు పడినప్పటికీ రెండు నుంచి మూడు శాతానికి మించి పడి ఉండకపోవచ్చు అన్న అభిప్రాయాన్ని కూడా వారు వ్యక్తం చేస్తున్నారు. ఆది నుంచి టిడిపిని బీఆర్ఎస్ వ్యతిరేకించడంతోపాటు చంద్రబాబు అరెస్టు సహా సెటిలర్ల పై కూడా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాగా ప్రభావం చూపించాయి అన్న వాదనా వినిపిస్తుంది.

ఎలా చూసుకున్నా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో టిడిపి అనుకూల ఓటు బ్యాంకు అధికారం పక్షం వైపే మొగ్గిందన్నది పరిశీలకుల అంచనా. ఈ విషయంలో ఏం జరిగిందన్నది ఎలా ఉన్నప్పటికీ ఫలితం మాత్రం కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో టిడిపి అనుకూల సానుకూల ఓటు బ్యాంకు పూర్తిగా కాంగ్రెస్ వైపు ఉందన్నది పరిశీలకుల అంచనా.

This post was last modified on November 14, 2025 2:28 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

మృణాల్ పాటించాల్సిన సలహానే ఇది

సీతారామం, హాయ్ నాన్న లాంటి పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలు దక్కించుకున్న మృణాల్ ఠాగూర్ టాలీవుడ్ తొలి అడుగులు చాలా గొప్పగా…

13 minutes ago

స్టాండ‌ప్ క‌మెడియన్ సారీ… అంద‌రికీ ఓ పాఠం

జ‌నాల‌ను న‌వ్వించ‌డం కోసం సెల‌బ్రెటీల వ్య‌క్తిగ‌త జీవితాల్లోకి వెళ్లిపోతే ప‌రిణామాలు ఎలా ఉంటాయో మ‌రోసారి రుజువైంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్, రామ్…

1 hour ago

మళ్లీ ‘టీఆర్ఎస్’ గా గులాబీ సేన?

తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించి... తొలి పదేళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన…

3 hours ago

హీరోలు మారినా ఫలితాలు మారట్లేదు

హీరోయిన్ కృతి శెట్టిని చూస్తుంటే పాపం అనిపించక మానదు. ఉప్పెనతో డెబ్యూ చేసినప్పుడు తనో సెన్సేషన్ అవుతుందని అందరూ భావించారు.…

4 hours ago

ఎన్టీఆర్ నీల్ ఏం ఇవ్వబోతున్నారు

మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు రానుంది. అభిమానులు మాములు ఎగ్జైట్ మెంట్ తో లేరు. ఏదో స్పెషల్ కంటెంట్…

5 hours ago

అలా బటన్ నొక్కితే… ఇలా నెంబర్ ప్లేట్ మారిపోద్ది

ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి వెళ్లేందుకు మనమైతే...ఎన్నెన్నో మార్గాలు అవలంబిస్తూ ఉంటాం. అయితే ఈ కొత్త మాయగాడు మాత్రం ట్రాఫిక్ పోలీసుల కళ్ల ముందే మాయ…

6 hours ago