తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త ఆలోచన చేశారు. హైదరాబాద్ సహా తెలంగాణలో పెట్టుబ డులు పెట్టేవారికి ఆహ్వానం పలుకుతున్నామని చెప్పారు. ఢిల్లీలో జరిగిన భారత్-అమెరికా పెట్టుబడుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా `రైజింగ్ తెలంగాణ – 2047`ను ఆయన ఆవిష్కరించారు. ప్రముఖ కంపెనీల ప్రతినిధులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. దేశంలో పెట్టుబడులకు విస్తారమైన అవకాశాలు ఉన్న నగరంగా హైదరాబాద్ గుర్తింపు పొందిందన్నారు.
పెట్టుబడులతో వచ్చే కంపెనీల పేర్లను పలు వీధులకు పెట్టనున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు నాయకుల పేర్లు ఉన్నాయని, అయితే, యువతకు స్ఫూర్తినిచ్చేలా పెట్టుబడులు పెట్టే కంపెనీల పేర్లను రహ దారులకు పెట్టనున్నట్టు వివరించారు. దీనికి పారిశ్రామిక వేత్తల నుంచి భారీ స్పందన లభించింది. ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రతి ఒక్కరికీ అవసరమైన అన్ని సౌక ర్యాలకు తాను హామీ ఇస్తున్నట్టు తెలిపారు.
అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, పెట్టుబడులకు సింగిల్ విండో ద్వారా అనుమతులు ఇస్తామని సీఎం చెప్పారు. ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మార్చడమే తమ ధ్యేయ మని వివరించారు. 23 మాసాల కాలంలో అనేక పెట్టుబడులు వచ్చాయని.. వచ్చే నెలలో పెట్టుబడుల సదస్సును(రైజింగ్ తెలంగాణ సదస్సు) నిర్వహిస్తున్నట్టు వివరించారు. యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
This post was last modified on November 13, 2025 11:19 pm
కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వచ్చిన సినిమాగా ఆరెంజ్ మీద ఓ…
ఏడేళ్ల క్రితం వచ్చిన పలాసతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కరుణ కుమార్. తక్కువ ఖర్చులో స్టార్ క్యాస్టింగ్ లేకుండా…
అక్కినేని నాగార్జున హీరోనే కాదు.. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కూడా. ఐతే ఒకప్పటితో పోలిస్తే గత కొన్నేళ్లలో ఆయన అన్నపూర్ణ సంస్థలో…
కొన్ని సినిమాలు హీరోలకు నటులుగా మంచి పేరు తెచ్చిపెడతాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోవు. మహేష్ బాబు…
ఏపీలో మద్యం అమ్మకాల విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం…
దురంధర్ 2 ది రివెంజ్ దెబ్బకు అడివి శేష్ డెకాయిట్ వాయిదా పడింది. ఇదే రూటులో టాక్సిక్ కూడా మనసు…