తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త ఆలోచన చేశారు. హైదరాబాద్ సహా తెలంగాణలో పెట్టుబ డులు పెట్టేవారికి ఆహ్వానం పలుకుతున్నామని చెప్పారు. ఢిల్లీలో జరిగిన భారత్-అమెరికా పెట్టుబడుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా `రైజింగ్ తెలంగాణ – 2047`ను ఆయన ఆవిష్కరించారు. ప్రముఖ కంపెనీల ప్రతినిధులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. దేశంలో పెట్టుబడులకు విస్తారమైన అవకాశాలు ఉన్న నగరంగా హైదరాబాద్ గుర్తింపు పొందిందన్నారు.
పెట్టుబడులతో వచ్చే కంపెనీల పేర్లను పలు వీధులకు పెట్టనున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు నాయకుల పేర్లు ఉన్నాయని, అయితే, యువతకు స్ఫూర్తినిచ్చేలా పెట్టుబడులు పెట్టే కంపెనీల పేర్లను రహ దారులకు పెట్టనున్నట్టు వివరించారు. దీనికి పారిశ్రామిక వేత్తల నుంచి భారీ స్పందన లభించింది. ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రతి ఒక్కరికీ అవసరమైన అన్ని సౌక ర్యాలకు తాను హామీ ఇస్తున్నట్టు తెలిపారు.
అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, పెట్టుబడులకు సింగిల్ విండో ద్వారా అనుమతులు ఇస్తామని సీఎం చెప్పారు. ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మార్చడమే తమ ధ్యేయ మని వివరించారు. 23 మాసాల కాలంలో అనేక పెట్టుబడులు వచ్చాయని.. వచ్చే నెలలో పెట్టుబడుల సదస్సును(రైజింగ్ తెలంగాణ సదస్సు) నిర్వహిస్తున్నట్టు వివరించారు. యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
This post was last modified on November 13, 2025 11:19 pm
మెగా, అల్లు బంధం మీద ఎప్పటికప్పుడు రకరకాల ఊహాగానాలు, అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఒకప్పట్లా…
జింబాబ్వేపై వెస్టిండీస్ భారీ గెలుపు తర్వాత భారత్ సెమీస్ అవకాశాలు ఇప్పుడు పక్కా లెక్కల మీద ఆధారపడి ఉన్నాయి. నెట్…
ప్రాణానికి ప్రాణం అనేది పాత సామెత. స్ట్రోకుకు స్ట్రోకు కొత్త ట్రెండ్. ఇటీవలే ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కు చెందిన…
మెక్సికోలో అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ మాఫియా డాన్ నెమెసియో రూబెన్ ఒసెగ్వెరా సెర్వంటెస్ అలియాస్ 'ఎల్ మెంచో' కథ ముగిసింది.…
న్యాచురల్ స్టార్ నాని తన ఇమేజ్ ని ఏ దిశగా తీసుకెళ్తున్నాడో ప్రేక్షకులకు పూర్తి క్లారిటీ వచ్చేస్తోంది. దసరాతో తెచ్చుకున్న…
ప్రభాస్ సినిమాలు సెట్స్ మీద ఎన్ని ఉన్నా ముందుగా ఏది విడుదలవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొన్న మాట వాస్తవం. ఆదిపురుష్…