తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త ఆలోచన చేశారు. హైదరాబాద్ సహా తెలంగాణలో పెట్టుబ డులు పెట్టేవారికి ఆహ్వానం పలుకుతున్నామని చెప్పారు. ఢిల్లీలో జరిగిన భారత్-అమెరికా పెట్టుబడుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా `రైజింగ్ తెలంగాణ – 2047`ను ఆయన ఆవిష్కరించారు. ప్రముఖ కంపెనీల ప్రతినిధులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. దేశంలో పెట్టుబడులకు విస్తారమైన అవకాశాలు ఉన్న నగరంగా హైదరాబాద్ గుర్తింపు పొందిందన్నారు.
పెట్టుబడులతో వచ్చే కంపెనీల పేర్లను పలు వీధులకు పెట్టనున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు నాయకుల పేర్లు ఉన్నాయని, అయితే, యువతకు స్ఫూర్తినిచ్చేలా పెట్టుబడులు పెట్టే కంపెనీల పేర్లను రహ దారులకు పెట్టనున్నట్టు వివరించారు. దీనికి పారిశ్రామిక వేత్తల నుంచి భారీ స్పందన లభించింది. ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రతి ఒక్కరికీ అవసరమైన అన్ని సౌక ర్యాలకు తాను హామీ ఇస్తున్నట్టు తెలిపారు.
అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, పెట్టుబడులకు సింగిల్ విండో ద్వారా అనుమతులు ఇస్తామని సీఎం చెప్పారు. ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మార్చడమే తమ ధ్యేయ మని వివరించారు. 23 మాసాల కాలంలో అనేక పెట్టుబడులు వచ్చాయని.. వచ్చే నెలలో పెట్టుబడుల సదస్సును(రైజింగ్ తెలంగాణ సదస్సు) నిర్వహిస్తున్నట్టు వివరించారు. యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
This post was last modified on November 13, 2025 11:19 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…