తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త ఆలోచన చేశారు. హైదరాబాద్ సహా తెలంగాణలో పెట్టుబ డులు పెట్టేవారికి ఆహ్వానం పలుకుతున్నామని చెప్పారు. ఢిల్లీలో జరిగిన భారత్-అమెరికా పెట్టుబడుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా `రైజింగ్ తెలంగాణ – 2047`ను ఆయన ఆవిష్కరించారు. ప్రముఖ కంపెనీల ప్రతినిధులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. దేశంలో పెట్టుబడులకు విస్తారమైన అవకాశాలు ఉన్న నగరంగా హైదరాబాద్ గుర్తింపు పొందిందన్నారు.
పెట్టుబడులతో వచ్చే కంపెనీల పేర్లను పలు వీధులకు పెట్టనున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు నాయకుల పేర్లు ఉన్నాయని, అయితే, యువతకు స్ఫూర్తినిచ్చేలా పెట్టుబడులు పెట్టే కంపెనీల పేర్లను రహ దారులకు పెట్టనున్నట్టు వివరించారు. దీనికి పారిశ్రామిక వేత్తల నుంచి భారీ స్పందన లభించింది. ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రతి ఒక్కరికీ అవసరమైన అన్ని సౌక ర్యాలకు తాను హామీ ఇస్తున్నట్టు తెలిపారు.
అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, పెట్టుబడులకు సింగిల్ విండో ద్వారా అనుమతులు ఇస్తామని సీఎం చెప్పారు. ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మార్చడమే తమ ధ్యేయ మని వివరించారు. 23 మాసాల కాలంలో అనేక పెట్టుబడులు వచ్చాయని.. వచ్చే నెలలో పెట్టుబడుల సదస్సును(రైజింగ్ తెలంగాణ సదస్సు) నిర్వహిస్తున్నట్టు వివరించారు. యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
తమన్ మ్యూజిక్కుకి తమనే కాంపిటీషన్ కావడం ఏమిటనుకుంటున్నారా. ఇది గతంలో జరిగిందే అయినా ఈసారి మాత్రం కొంచెం స్పెషల్ గా…
ముందు లీకైనట్టే ఘట్టమనేని జయకృష్ణ డెబ్యూ మూవీ శ్రీనివాస మంగాపురం వాయిదా పడింది. జూలై 30 విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు…
టాలెంట్ ఉండి ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వాలంటే ఎవరో ఒకరి దగ్గర శిష్యుడిగా చేరాలి. లేదా ఎవరైనా రిఫరెన్స్ తీసుకుని ప్రముఖ…
ఏపీలో విపక్షం వైసీపీ ఇటీవలి కాలంలో తిరిగి యాక్టివ్ మోడ్ లోకి వచ్చినట్టే కనిపిస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రదాన…
టాలీవుడ్ లో జూన్ నెలలో పెద్ది, మా ఇంటి బంగారం తమ మీద పెట్టుకున్న ఆశలు నెరవేర్చాయి. తెలుగు రాష్ట్రాల…
రిషికొండ పాలెస్ లను వినియోగంలోకి తీసుకువచ్చే దిశగా ఎట్టకేలకు ఓ కీలక అడుగు అయితే.పడింది. సాగర నగరం విశాఖ పర్యాటక…